జయరాం కోమటికి ఘన సత్కారం.. తెదేపా సభ్యత్వ డ్రైవ్‌ గ్రాండ్‌ సక్సెస్‌!

ఎన్నారై తెదేపాలో ఎన్నడూ లేనంత కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నారై టీడీపీ నూతన సమన్వయకర్త (అమెరికా) కోమటి జయరాం, తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సమక్షంలో ......

Updated : 02 May 2022 22:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నారై తెదేపాలో ఎన్నడూ లేనంత కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నారై తెదేపా నూతన సమన్వయకర్త (అమెరికా) కోమటి జయరాం, తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సమక్షంలో వెంకట్ కోగంటి వ్యాఖ్యాతగా ఆదివారం రాత్రి జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. అంచనాలకు మించి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. సామాజిక అసమానతలు తొలగించే సమున్నత లక్ష్యంతో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగే ఏకైక తెలుగు ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ ఎన్నారై తెలుగుదేశం నూతన సమన్వయకర్త (అమెరికా) కోమటి జయరాం అన్నారు. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ..  2024లో ఎన్నారైలందరూ ఒక్కటై ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. 2014లో కొత్త రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని గుర్తించిన ప్రజలు ఆయన్ను కోరి గెలిపించారన్నారు. 2019లో మోసపూరిత అబద్ధాలతో మోసపోయిన ప్రజలు తమ పొరపాటును గ్రహించి గతంలో కన్నా రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఇంకా ఎక్కువ ఉందని తెలుసుకున్నారన్నారు. 2024 ఎన్నికల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కొమ్మారెడ్డి, మాజీ ఎంపీ విద్య చెన్నుపాటి కుమారుడు వజీర్ చెన్నుపాటి, పొగాకు బోర్డు మాజీ ఛైర్మన్ సుబ్బారావు మన్నవ తదితరులు కొత్త హోదాలో నియమితులైన జయరాం కోమటిని అభినందించారు.

దశాబ్దాలుగా తెదేపాతో కోమటి జయరాం ప్రయాణాన్ని సుబ్బారావు మన్నవ గుర్తుచేసుకొని ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. 2024లో ‘తెలుగుదేశం గెలుపే ఏపీ గెలుపు’ అనే లక్ష్యంతో ఎన్నారైలందరినీ సమన్వయం చేసుకుని ఏకతాటిపై నడిపిస్తామన్నారు. ‘పదవి ముళ్ల కిరీటమే, కానీ బాధ్యత మాత్రం మరువను. ఎన్నారై తెదేపాను ఏకతాటిపై నడిపించడమే నా లక్ష్యం’ అన్నారు. ఈ సందర్భంగా జయరాం కోమటి, పట్టాభిరాం, వజీర్, సుబ్బారావు మన్నవ, వెంకట్ కోగంటి తదితరులు తెదేపా మెంబర్ షిప్ డ్రైవ్‌ను ప్రారంభించగా అనూహ్య సంఖ్యలో ఎన్నారైలు సభ్యత్వం తీసుకున్నారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నారైలను ఉద్దేశించి జూమ్‌ ద్వారా లైవ్‌లో ప్రసంగించారు. కొత్త పదవిలో నియమితులైన సందర్భంగా జయరాం కోమటిని అభినందించారు. బే ఏరియా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేసి తెలుగుదేశం ప్రభుత్వం నెలకొల్పాలని, ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకోవడం మనందరి బాధ్య అన్నారు. చంద్రబాబు ప్రసంగం ఎన్నారై తెదేపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. 

చంద్ర గుంటుపల్లి, శ్రీకాంత్ దొడ్డపనేని, భక్త భల్ల, రజనీకాంత్ కాకర్ల, కృష్ణ గొంప, గోకుల్ మాచిరాజు, భరత్ ముప్పిరాళ్ల, విజయ ఆసూరి, ప్రసాద్ మంగిన, సతీష్ బోళ్ల, లక్ష్మణ్ పరుచూరి, గంగ కోమటి, సందీప్ ఇంటూరి తదితరులు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం సామాజిక అవసరమని, భావితరాల భవిష్యత్ కాపాడేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు. భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని