జయరాం కోమటికి ఘన సత్కారం.. తెదేపా సభ్యత్వ డ్రైవ్ గ్రాండ్ సక్సెస్!
ఎన్నారై తెదేపాలో ఎన్నడూ లేనంత కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నారై టీడీపీ నూతన సమన్వయకర్త (అమెరికా) కోమటి జయరాం, తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సమక్షంలో ......
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నారై తెదేపాలో ఎన్నడూ లేనంత కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎన్నారై తెదేపా నూతన సమన్వయకర్త (అమెరికా) కోమటి జయరాం, తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ సమక్షంలో వెంకట్ కోగంటి వ్యాఖ్యాతగా ఆదివారం రాత్రి జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. అంచనాలకు మించి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. సామాజిక అసమానతలు తొలగించే సమున్నత లక్ష్యంతో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగే ఏకైక తెలుగు ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ ఎన్నారై తెలుగుదేశం నూతన సమన్వయకర్త (అమెరికా) కోమటి జయరాం అన్నారు. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాట్లాడుతూ.. 2024లో ఎన్నారైలందరూ ఒక్కటై ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. 2014లో కొత్త రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని గుర్తించిన ప్రజలు ఆయన్ను కోరి గెలిపించారన్నారు. 2019లో మోసపూరిత అబద్ధాలతో మోసపోయిన ప్రజలు తమ పొరపాటును గ్రహించి గతంలో కన్నా రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఇంకా ఎక్కువ ఉందని తెలుసుకున్నారన్నారు. 2024 ఎన్నికల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కొమ్మారెడ్డి, మాజీ ఎంపీ విద్య చెన్నుపాటి కుమారుడు వజీర్ చెన్నుపాటి, పొగాకు బోర్డు మాజీ ఛైర్మన్ సుబ్బారావు మన్నవ తదితరులు కొత్త హోదాలో నియమితులైన జయరాం కోమటిని అభినందించారు.
దశాబ్దాలుగా తెదేపాతో కోమటి జయరాం ప్రయాణాన్ని సుబ్బారావు మన్నవ గుర్తుచేసుకొని ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ.. 2024లో ‘తెలుగుదేశం గెలుపే ఏపీ గెలుపు’ అనే లక్ష్యంతో ఎన్నారైలందరినీ సమన్వయం చేసుకుని ఏకతాటిపై నడిపిస్తామన్నారు. ‘పదవి ముళ్ల కిరీటమే, కానీ బాధ్యత మాత్రం మరువను. ఎన్నారై తెదేపాను ఏకతాటిపై నడిపించడమే నా లక్ష్యం’ అన్నారు. ఈ సందర్భంగా జయరాం కోమటి, పట్టాభిరాం, వజీర్, సుబ్బారావు మన్నవ, వెంకట్ కోగంటి తదితరులు తెదేపా మెంబర్ షిప్ డ్రైవ్ను ప్రారంభించగా అనూహ్య సంఖ్యలో ఎన్నారైలు సభ్యత్వం తీసుకున్నారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నారైలను ఉద్దేశించి జూమ్ ద్వారా లైవ్లో ప్రసంగించారు. కొత్త పదవిలో నియమితులైన సందర్భంగా జయరాం కోమటిని అభినందించారు. బే ఏరియా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేసి తెలుగుదేశం ప్రభుత్వం నెలకొల్పాలని, ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవడం మనందరి బాధ్య అన్నారు. చంద్రబాబు ప్రసంగం ఎన్నారై తెదేపా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.
చంద్ర గుంటుపల్లి, శ్రీకాంత్ దొడ్డపనేని, భక్త భల్ల, రజనీకాంత్ కాకర్ల, కృష్ణ గొంప, గోకుల్ మాచిరాజు, భరత్ ముప్పిరాళ్ల, విజయ ఆసూరి, ప్రసాద్ మంగిన, సతీష్ బోళ్ల, లక్ష్మణ్ పరుచూరి, గంగ కోమటి, సందీప్ ఇంటూరి తదితరులు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం సామాజిక అవసరమని, భావితరాల భవిష్యత్ కాపాడేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు. భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?