ఎన్టీఆర్ ఓ మహోన్నత శక్తి.. తెలుగుజాతి ఆయన్ను ఎప్పటికీ మరవలేదు!
తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు కువైట్లోని తెదేపా ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ భవనంలో వెంకట్ కోడూరి ......
కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
కువైట్: తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు కువైట్లోని తెదేపా ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ భవనంలో వెంకట్ కోడూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా నిలిచిన అన్న నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. సమాజమే దేవాలయం - ప్రజలే నా దేవుళ్లు అనే తారక మంత్రంతో కోట్లాది మంది మనస్సును ప్రభావితం చేసిన ఆయన ఓ మహోన్నత శక్తి అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అండదండల కోసం పార్టీని స్థాపించి కేవలం ఎనిమిది నెలల కాలంలోనే అధికారం చేపట్టిన ఎదురులేని మనిషి ఎన్టీఆర్ అన్నారు. కుళ్లు పట్టిన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేసి రామరాజ్యంగా మార్చిన ఘనత ఆయనకే సొంతమవుతుందని పేర్కొన్నారు. పంచభూతాలు ఉన్నంత కాలం తెలుగు జాతి ఆయన్ను మరువలేదన్నారు.
ఎన్టీఆర్ ఆశయాల సాధనే లక్ష్యంగా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ నిరంతరం ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వంపై పోరాడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఏకపక్షంగా ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. ఎందుకంటే ఆనాడు జగన్కు రాజశేఖర్ రెడ్డి కొడుకు అని, ఏదో చేస్తాడని నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజలను ఆయన నట్టేట ముంచాడంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారంటూ ధ్వజమెత్తారు. సొంత పార్టీ వాళ్లే జగన్ను ఎందుకు గెలిపించామా అని బాధపడుతున్నారని విమర్శించారు.
కువైట్ విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి ఎన్నారైలు చూపిన ప్రేమాభిమానాలు తన జీవితంలో మరిచిపోలేనన్నారు. ఇటీవల కువైట్లో జరిగిన హత్య కేసులో లక్కిరెడ్డిపల్లికి చెందిన ఓ అమాయకుడికి శిక్షపడిన వెంటనే వారి కుటుంబ సభ్యులు తన వద్దకు రాగానే మాజీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి కేంద్ర మంత్రికి చెప్పించినా ఫలితం లేకపోయిందని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నారై తెదేపా సెల్ ఆధ్వర్యంలో ఎన్నారై తెదేపా గల్ఫ్, ఎన్నారై తెదేపా కువైట్ మైనారిటీ విభాగం, ఎన్టీఆర్ సేవా సమితి కువైట్, చంద్రన్న సేవా సమితి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు అంజన రెడ్డి, నిర్మలమ్మ, అంజలి, సరస్వతి, నారాయణమ్మ నాయుకులు పిడికిట శ్రీనివాస్, ముస్తాఖ్ ఖాన్, గుదె శంకరయ్య, ఓలేటి రెడ్డయ్య, షేక్ ఎండీ అర్షద్ , చుండు బాలరెడ్డయ్య, మహామ్మద్ బోరా, షేక్ సుబాన్, కోర్రపాటి వెంకటేశ్వర్లు, మద్దిన వెంకటేశ్ , వేగి వెంకటేష్, నాయినపాటి విజయ్, సయ్యద్ ఆలీ, బాబు నాయుడు, జనార్దన్ రెడ్డి, పచ్చా నరసింహ, టిక్ టాక్ రాజు, ఖాదిర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక