సిలికానాంధ్ర వర్సిటీలో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధులతో ఎన్నారైల సమావేశం
అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులతో అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర సంస్థ చేస్తోన్న సేవల్ని ప్రశంసించారు.
సిలికానాంధ్ర: వివిధ రంగాల్లో పనిచేస్తోన్న ప్రవాస భారతీయులతో అమెరికా సంయుక్త రాష్ట్రాల స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధుల బృందం సమావేశమైంది. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో డాక్టర్ హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలో జరిగిన ఈ సమావేశానికి అనేకమంది ప్రముఖ ఎన్నారైలు హాజరయ్యారు. సిలికానాంధ్ర వర్సిటీ అధిపతి డాక్టర్ ఆనంద్ కూచిభొట్ల స్వాగతోపన్యాసం చేశారు. విశ్వవిద్యాలయానికి మాతృసంస్థ అయిన సిలికానాంధ్ర గత రెండు దశాబ్దాలకు పైగా తెలుగు భాష, సంస్కృతి, కళల అభ్యున్నతికి చేస్తోన్న కృషిని, సామాజిక సేవా కార్యక్రమాలను ఆ బృందానికి వివరించారు. అలాగే, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అతి త్వరలో ప్రారంభించే MS కంప్యూటర్ సైన్స్ కోర్సు గురించి, విశ్వవిద్యాలయం రాబోయే కాలంలో చేసే కార్యక్రమాల బృహత్ ప్రణాళికను సమావేశంలో ఉన్నవారందరికీ వివరించారు. అంతేకాకుండా, ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చి తమ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు I-20 మంజూరు చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నుంచి అనుమతి లభించిందని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఈ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించిన దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బ్యూరో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ నాన్సీ ఇజో జాక్సన్ మాట్లాడుతూ.. అమెరికా భారత్ సంబంధాల మెరుగుదలకు సిలికానాంధ్ర సంస్థ చేస్తోన్న కార్యక్రమాల్ని అభినందించారు. అతి కొద్ది సమయంలోనే విశ్వవిద్యాలయం సాధించిన విజయాలను కొనియాడుతూ భవిష్యత్ కార్యాచరణలో కృతకృత్యమయ్యేందుకు తమ బ్యూరో సహాయ సహకారాల్ని అందిస్తుందని ఆమె సభాముఖంగా ప్రకటించారు. ప్రతినిధి బృందంలో బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ డివిజన్ చీఫ్ నాన్సీ సడ్విక్, USAID మిషన్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా కిమ్ క్లిమౌస్కీ, డొమెస్టిక్ ఔట్ రీచ్ సీనియర్ అడ్వైజర్ జెన్నీఫర్ మిల్లర్; మహిళల ఆర్థిక సాధికారికత సీనియర్ అడ్వైజర్ రాధిక ప్రభు తదితరులు ఉన్నారు.
ప్రతినిధి బృందం ఈ సమావేశానికి హాజరైన ప్రవాస భారతీయులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన నృత్యరూపక ప్రదర్శన ఆహూతులను అలరించింది. ఈ సమావేశం విజయవంతం కావడానికి సహకరించిన అజయ్ భుటోరియాకు యూనివర్సిటీ కార్యవర్గం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వంద మందికి పైగా విచ్చేసిన సిలికాన్ వ్యాలీ ప్రవాస భారతీయ ప్రముఖులతో స్ఫూర్తిదాయకంగా జరిగిన ఈ సమావేశానికి హాజరైన ఆహూతులు, మీడియా బృందం వారికి, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. చివరగా కార్యకర్తలు ఏర్పాటుచేసిన విందు భోజనంతో కార్యక్రమం ముగిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
తాజా వార్తలు (Latest News)
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం