Chandrababu: వైకాపా డీఎన్ఏలోనే శవరాజకీయం: చంద్రబాబు
జగన్ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.
కొవ్వూరు: జగన్ విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘వైకాపా డీఎన్ఏలోనే శవరాజకీయం ఉంది. తండ్రి లేరు.. బాబాయ్ని చంపారంటూ జగన్ ఓట్లు అడిగారు. రక్తంలో మునిగిన వైకాపాకు ఓట్లు వేయవద్దని అతని చెల్లి కోరుతున్నారు. హత్యలు, శవరాజకీయాలు చేసేవారు ప్రజలకు కావాలా? రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మిత్రపక్షంతో వచ్చి కూటమిగా జట్టుకట్టాం.
మీపార్టీకి గొడ్డలి గుర్తు పెట్టుకో..
వాలంటీరు వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. కానీ, రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వొద్దు.. ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నా. మా ప్రభుత్వం వచ్చాక వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వీలుంది. ఎండలో సచివాలయానికి వెళ్లడం వల్ల ఒకరిద్దరు చనిపోయారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పింఛన్లు ఇవ్వాలని కోరుతున్నా. వైకాపా ఇవ్వలేకపోతే తెదేపా వచ్చాక రూ.4వేల చొప్పున పింఛను ఇస్తామన్నాం. భయపడి నిన్న డబ్బులు విడుదల చేశారు. ప్రశ్నిస్తే గొడ్డలిని చూపి బెదిరిస్తున్నారు. మీ (వైకాపా) పార్టీకి గొడ్డలి గుర్తు పెట్టుకోండి.. కానీ, రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు. రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో జనసేన రెండు చోట్ల పోటీ చేస్తోంది. ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి పోటీ చేస్తున్నారు. మిగిలిన ఐదుస్థానాల్లో ఒక సీటు భాజపాకు ఇచ్చాం. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫ్యాన్ను ముక్కలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
రైతు కూలీల కోసం కార్పొరేషన్
తెదేపా కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టించి పేదలకు పంచుతాం. వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్ మద్యం ఉండవు. ఇసుక కొరత ఉండదు. విద్యుత్ ఛార్జీలు పెరగవు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం. రైతు కూలీల కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి వారిని ఆదుకుంటామని హామీ ఇస్తున్నా. నేను టిడ్కో ఇళ్లు ఇస్తే.. ప్రజల్ని జగన్ ఇబ్బందులకు గురి చేశాడు. మా ప్రభుత్వం ఏర్పాటు కాగానే పేదలకు రెండు సెంట్ల భూమి ఇస్తాం. ఇప్పటికే ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా’’అని చంద్రబాబు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ నయవంచన
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఓ ప్రకటనలో విమర్శించారు. కేవలం సన్న రకం వడ్లకే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. దొడ్డు వడ్లకు ఇవ్వకుండా నయవంచనకు పాల్పడిందన్నారు. -
సీఎస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులపై చర్యలా?
పోలింగ్ అనంతర హింసపై ఎన్నికల సంఘం దర్యాప్తు చేయించకుండా.. కేవలం సీఎస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తోందని విశ్రాంత ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్కుమార్ అన్నారు. -
ఐప్యాక్తో పాటు ఖాళీ అయిన సీఐడీ కార్యాలయం
ఎన్నికల తర్వాత వైకాపా సోషల్ మీడియా, ఐప్యాక్ల బృందంతో పాటు జగన్ కనుసన్నల్లో నడిచిన సీఐడీ కార్యాలయం కూడా ఖాళీ అయిందని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. -
ప్రశాంత పల్నాడులో వైకాపా అశాంతి రేపింది
ప్రశాంత పల్నాడులో వైకాపా నేతలు అశాంతి రేపారని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సీపీఐ
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని విడనాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. -
రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే
రైతుల ఆత్మహత్యలు నిస్సందేహంగా జగన్ ప్రభుత్వ హత్యలేనని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మండిపడ్డారు. ‘ -
అయిదో దశ పోలింగ్తో విపక్షాల విచ్ఛిన్నానికి నాంది: మోదీ
లోక్సభ ఎన్నికల అయిదోదశ పోలింగు ముగియడంతో తృణమూల్ సహా ఇండియా కూటమి ఓటమికి మరింత చేరువైందని.. విపక్షాల విచ్ఛిన్నానికి ఇది నాందిగా ప్రధాని మోదీ తెలిపారు. -
టీఎంసీ గెలిచే సీట్లన్నీ ఇండియా కూటమికే!
పశ్చిమ బెంగాల్లో టీఎంసీని అత్యధిక సీట్లతో గెలిపిస్తే కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అది గరిష్ఠ స్థాయిలో ఉపయోగపడుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. -
అధీర్ మా సైనిక యోధుడు
ఇండియా కూటమికి మమతా బెనర్జీ మద్దతు విషయంలో కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన చిచ్చు సోమవారం కొంత మేరకు చల్లారింది. -
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. 30 వేల నియామకాలు ఎలా చేపట్టారు?
అభయహస్తం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలపై భస్మాసుర హస్తం మోపుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలుపొందాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు. -
నాయకులను కొనుగోలు చేస్తున్న సీఎం
రాష్ట్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా సీఎం రేవంత్రెడ్డి ఓట్లు, నాయకులను కొనుగోలు చేస్తున్నారని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలు అంశానికి అతీగతీ లేదని విమర్శించారు. -
ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపావైపే కనిపిస్తోందని దిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్కుమార్ తెలిపారు. -
రాళ్లదాడి ఘటనలో 47 మందిపై కేసు
వైఎస్సార్ జిల్లా కడప రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధి గౌస్నగర్లో ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న రాత్రి వైకాపా, తెదేపా నేతలు, కార్యకర్తల మధ్య జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు సోమవారం కేసులు నమోదు చేశారు. -
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. -
బాధితులకు అండగా నిలిచిన మీడియాపై కేసులా?
వైకాపాకు ఓట్లేయలేదన్న కక్షతో విశాఖ కంచరపాలెంలోని ఓ కుటుంబంపై ఆ పార్టీ నేతలు చేసిన దాడి ఘటనను తప్పుదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎన్డీయే నేతలు మండిపడ్డారు. -
ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
వైకాపా నాయకుడిగా చలామణి అవుతున్న బోరుగడ్డ అనిల్, తన అనుయాయులతో కలిసి కర్రలు పట్టుకుని సోమవారం రాత్రి గుంటూరు వేళాంగిణినగర్లో హల్చల్ చేశారు. -
సిట్ సభ్యులు మాచర్ల ఎందుకు వెళ్లలేదు?
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్.. అసలు మాచర్ల పట్టణానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్రెడ్డే బాధ్యుడు
రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలకు సీఎస్ జవహర్రెడ్డే బాధ్యుడని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. -
వైకాపాకు ఓటేయకపోతే దాడులే
ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని కక్షగట్టి సామాన్యులపై దాడులకు దిగడం వంటి ఘటనల్ని ఇది వరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం.
తాజా వార్తలు (Latest News)
-
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
-
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!