Congress: రాహుల్ యాత్ర.. లోగో విడుదల చేసిన కాంగ్రెస్
Bharat Jodo Nyay Yatra: ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లోగోను కాంగ్రెస్ పార్టీ తాజాగా విడుదల చేసింది.
దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో మహాయాత్రకు కాంగ్రెస్ (Congress) సన్నద్ధమైన విషయం తెలిసిందే. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’ చేపట్టనుంది. దీనికి సంబంధించిన లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం విడుదల చేశారు. ఈ యాత్ర ‘న్యాయం జరిగే వరకు’ అనే నినాదమిచ్చారు.
ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. పార్లమెంట్లో సమస్యలు లేవనెత్తేందుకు ప్రభుత్వం అనుమతించట్లేదని, అందుకే తాము ఈ న్యాయ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ‘‘మణిపుర్లో ఇటీవల ఎన్నో దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటి గురించి ప్రధాని మోదీ అనేక చోట్ల ప్రసంగాలిచ్చారు కానీ.. ఆ రాష్ట్రానికి మాత్రం వెళ్లలేదు. దీని గురించి పార్లమెంట్లో మేం మాట్లాడేందుకు ప్రయత్నించినా మాకు అవకాశం ఇవ్వలేదు. దేశ చరిత్రలోనే తొలిసారి 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అందుకే, మా గళాన్ని వినిపించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మేం ఈ యాత్ర చేపడుతున్నాం’’ అని ఖర్గే వివరించారు.
వైకాపాకు మరో షాక్.. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్బై
ఇక, నూతనంగా తీసుకొచ్చిన కార్మిక చట్టాలు, క్రిమినల్ చట్టాల గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలో జనవరి 14న ప్రారంభమయ్యే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. అయితే, తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. గతంలో రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4,500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సినీనటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్ల దాడి!
మిడ్నాపుర్లో సినీ నటుడు మిథున్ చక్రవర్తి పాల్గొన్న ఎన్నికల ప్రచార రోడ్ షోపై కొందరు వ్యక్తులు రాళ్లు, బాటిళ్లతో దాడి చేశారు. -
సందేశ్ఖాలీకి వెళ్తాను: మమతా బెనర్జీ
ఎన్నికల వేళ అన్ని ప్రాంతాలతో పాటు సందేశ్ ఖాలీకి కూడా వెళ్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)అన్నారు. -
శత్రువు ప్రశంసించిన నేతకు అధికారమా..: రాజ్నాథ్ సింగ్
రాజ్యాంగాన్ని మారుస్తుందని భాజపాపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని.. కానీ, కాంగ్రెస్ హయాంలో 90 సార్లు ప్రభుత్వాలు కూలిపోయాయని రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు. -
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్
ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. -
రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్
పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తాళం చెవులు మాయం కావడంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎమ్కే స్టాలిన్ మండిపడ్డారు. -
కొత్త బ్రాండ్ల మద్యం కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు: మంత్రి జూపల్లి
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ
సంపన్న కుటుంబంలో జన్మించిన వారికి సామాన్యుల కష్టాలు తెలియవని రాహుల్, అఖిలేశ్, తేజస్వీ యాదవ్లను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
ఆ ముగ్గురి కనుసన్నల్లోనే దాడులు: మాజీ ఎంపీ కనకమేడల
గతంలో మాచర్లలో నడిరోడ్డుపై తెదేపా కార్యకర్త గొంతుకోసి చంపారని తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని తెదేపా నేత బొండా ఉమ హెచ్చరించారు. -
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
వర్షాలకు తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు: సోమిరెడ్డి
బెంగళూరు రేవ్పార్టీతో సంబంధం లేదని మంత్రి కాకాణి చెబుతున్నారని.. ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్ అక్కడ ఎలా దొరికిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు. -
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
విపక్ష కూటమి బలంగా పుంజుకొందని కాంగ్రెస్ అధినేత అభిప్రాయపడ్డారు. ఉత్తరాదిన భాజపా గణనీయంగా సీట్లను కోల్పోతోందని జోస్యం చెప్పారు. -
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారని.. తెదేపా నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. -
అట్టహాసంగా నియామక పత్రాలిచ్చారు.. 4 నెలలుగా జీతాలివ్వలేదు: హరీశ్రావు
నర్సింగ్ ఆఫీసర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలివ్వలేదని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. -
ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపావైపే కనిపిస్తోందని దిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్కుమార్ తెలిపారు. -
సిట్ సభ్యులు మాచర్ల ఎందుకు వెళ్లలేదు?
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్.. అసలు మాచర్ల పట్టణానికి వెళ్లలేదని తెలుస్తోంది. -
వైకాపాకు ఓటేయకపోతే దాడులే
ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయలేదని కక్షగట్టి సామాన్యులపై దాడులకు దిగడం వంటి ఘటనల్ని ఇది వరకు ఫ్యాక్షన్ ప్రభావితమైన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చూసేవాళ్లం. -
ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
వైకాపా నాయకుడిగా చలామణి అవుతున్న బోరుగడ్డ అనిల్, తన అనుయాయులతో కలిసి కర్రలు పట్టుకుని సోమవారం రాత్రి గుంటూరు వేళాంగిణినగర్లో హల్చల్ చేశారు. -
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా.. 30 వేల నియామకాలు ఎలా చేపట్టారు?
అభయహస్తం అంటూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలపై భస్మాసుర హస్తం మోపుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలుపొందాక ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల నియామకాలు ఎలా చేపట్టిందో చెప్పాలని ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం
-
బ్రిజ్ భూషణ్కు షాక్.. అభియోగాలు నమోదు
-
సందేశ్ఖాలీకి వెళ్తాను: మమతా బెనర్జీ
-
రూ.3.22 కోట్లు కాజేసిన అమెజాన్ ఉద్యోగి అరెస్ట్
-
ఏసీపీ నివాసంలో 12 గంటలుగా సోదాలు.. బయట పడుతున్న నోట్ల కట్టలు