జాట్ల చేతిలో హరియాణా!
హరియాణా.. వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. అక్కడ రైతులంటే జాట్లు.. జాట్లంటే రైతులు. ఈ రాష్ట్రంలో పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంతోపాటు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు తీవ్రంగా సాగుతున్నాయి.
పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్న రైతు వర్గం
భాజపా, జేజేపీలకు ప్రతిఘటన
హరియాణా.. వ్యవసాయ ప్రధాన రాష్ట్రం. అక్కడ రైతులంటే జాట్లు.. జాట్లంటే రైతులు. ఈ రాష్ట్రంలో పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంతోపాటు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు తీవ్రంగా సాగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వాలు వారి నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయి. లోక్సభ ఎన్నికల్లోనూ, ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ జాట్లు ఎటు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. తమ ఆందోళనల పట్ల కేంద్రం నిర్లక్ష్యం చూపుతుందనే కోపం హరియాణా జాట్లలో స్పష్టంగా కనిపిస్తోంది. జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) పట్ల కూడా వారు ఆగ్రహంగానే ఉన్నారు.
ప్రచారంలో నిరసనలు
భాజపా, జేజేపీలకు ప్రచారంలో నిరసనలు ఎదురవుతున్నాయి. గ్రామాల్లోకి ఈ పార్టీల నేతలు వెళ్లినప్పుడు ప్రతిఘటనను చవిచూడాల్సి వస్తోంది. సోనీపత్లోని దహియా ఖాప్ పరిధిలో ఉన్న 24 గ్రామాలవారు భాజపాను బాయ్కాట్ చేశారు. సిర్సాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫతేహాబాద్లో భాజపా నేత అశోక్ తన్వర్ ర్యాలీల్లో రైతులు నల్ల జెండాలను ప్రదర్శిస్తున్నారు. జాట్ల ప్రాబల్యమున్న హిసార్లోని నారాలో ప్రజలు మాజీ ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌటాలాను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.
రిజర్వేషన్లు
వెనుకబడిన వర్గాలపై ఆధారపడిన భాజపా, జేజేపీలకు రిజర్వేషన్ల అంశమూ ఇబ్బందికరంగా మారింది. జాట్ నేతలపై నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆరోపణలతో భాజపాపై మరింత ఆగ్రహం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది అధికంగా ఉంది. దీని నుంచి బయటపడటానికి స్థానిక జాట్ నేతలను మచ్చిక చేసుకునే పనిలో భాజపా పడింది.
అధికారం కోసం ఆరాటం
దాదాపు పదేళ్లపాటు జాటేతర నేత అధికారం చెలాయించడంతో జాట్లలో అధికారం సాధించాలనే కాంక్ష మళ్లీ మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల కంటే వాటి తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలే జాట్ నేతలకు ముఖ్యంగా కనిపిస్తోంది.
1966 నుంచి జాట్ల ప్రాభవం
1966లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ హరియాణాలో జాట్లే చక్రం తిప్పుతున్నారు. రాష్ట్రంలో జాట్లు 26శాతం నుంచి 28శాతం వరకూ ఉన్నారు. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 చోట్ల వారి ప్రాబల్యం అధికం. 10 లోక్సభ నియోజకవర్గాల్లో 4 చోట్ల ఎన్నికలను ప్రభావితం చేయగలరు. ఇందులో రెండు చోట్ల కాంగ్రెస్ నుంచి వచ్చిన అశోక్ తన్వర్, నవీన్ జిందాల్లకు భాజపా టికెట్లిచ్చింది. 58ఏళ్ల రాష్ట్ర చరిత్రలో 33ఏళ్లపాటు జాట్ నేతలే సీఎంలుగా ఉన్నారు. రాష్ట్రాన్ని దేవీలాల్, బన్సీలాల్, భూపేందర్సింగ్ హుడ్డా లాంటి జాట్ నేతలే పదేళ్ల కిందటి వరకూ శాసించారు.
2019లో భాజపాకే మొగ్గు
2019 లోక్సభ ఎన్నికల్లో 42.4 శాతం మంది జాట్లు భాజపాకు మద్దతిచ్చారు. 39.8 శాతం మంది కాంగ్రెస్కు ఓటేశారు. మిగిలిన వారు జేజేపీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్కు (ఐఎన్ఎల్డీ) మద్దతిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం జేజేపీకి 12.7 శాతం మంది ఓటేశారు. కాంగ్రెస్కు 38.7శాతం మంది, భాజపాకు 33.7శాతం మంది మద్దతిచ్చారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఆరుగురు జాట్ నేతలకు టికెట్లు ఇస్తే ఐదుగురు ఓడిపోయారు.
ఓబీసీల మద్దతుతో..
జాట్ల మద్దతు లేకపోయినా జాటేతరులు, ఓబీసీల అండతో భాజపా హరియాణాలో నెగ్గుకొస్తోంది. గత రెండు ఎన్నికల్లో మిగిలిన అన్ని వర్గాల ఓట్లను సాధించడంద్వారా జాట్ల ఓట్లకు ప్రాధాన్యం లేకుండా చేయగలిగింది. ఇటీవలే పంజాబీ వర్గానికి చెందిన ఖట్టర్ను తప్పించి ఓబీసీ వర్గానికి చెందిన నాయబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిని చేసింది.
కాంగ్రెస్కు కలిసివచ్చేనా?
పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేందర్సింగ్ హుడ్డా జాట్ల ఓట్లను స్థిరీకరించడంలో విజయం సాధించారు. ఇపుడు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకే ప్రాధాన్యమిస్తున్నారు. మరో జాట్ నేత బీరేంద్ర సింగ్ కూడా పోటీ చేయడం లేదు. 2019 లోక్సభ ఎన్నికలు మినహా అన్నిసార్లూ జాట్లు కాంగ్రెస్కే మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం భూపేందర్ సింగ్ హుడ్డా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, బీరేంద్ర సింగ్ లాంటి జాట్ నేతలతో కాంగ్రెస్ పటిష్ఠంగానే ఉంది.
చౌటాలాలకూ మద్దతు
జాట్ ఓట్లను ఐఎన్ఎల్డీ కూడా భారీగానే సాధించగలుగుతుంది. ఓం ప్రకాశ్ చౌటాలా ఉన్నప్పుడు కలిసి ఉన్న పార్టీ ఆ తర్వాత కుమారుల హయాంలో చీలిపోయింది. అజయ్ చౌటాలా జేజేపీని స్థాపించారు. ఆయన కుమారుడు దుశ్యంత్ 2019లో ఖట్టర్ ప్రభుత్వంలో చేరారు. ఇటీవలే బయటికొచ్చారు.
జేజేపీతో విడిపోవడమూ ఇబ్బందే
ఇటీవల జేజేపీతో విడిపోవడమూ భాజపాకు ఇబ్బందికరంగానే ఉంది. దీంతో జాట్ ఓటర్లను అది ప్రభావితం చేయలేకపోతోంది. పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నా జాట్లలో విశ్వసనీయతను సాధించడంలో భాజపా విఫలమైంది. ప్రముఖ జాట్ నేతలైన ఓపీ ధన్ఖడ్, కెప్టెన్ అభిమన్యులను లోక్సభ ఎన్నికల్లో పట్టించుకోకపోవడమూ భాజపాకు ఇబ్బందికరంగానే మారింది. మరో జాట్ నేత బీరేంద్ర సింగ్ ఇటీవల భాజపాను వీడి కాంగ్రెస్లో చేరారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రాకేశ్రెడ్డి విజయం కోసం కృషి చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. -
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం: సీపీఐ నేత నారాయణ
కేంద్రం, ఏపీలో ప్రభుత్వం మారే అవకాశం ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. -
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
పశ్చిమబెంగాల్ కాంగ్రెస్లో అధిర్ రంజన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్టీ జాతీయాధ్యక్షుడు మాటలు వినే పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. -
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్