YS Sunitha: వైఎస్సార్‌ ఉంటే అలాంటివి సహించేవారా?: సునీత

వైఎస్‌ షర్మిలను ఎంపీ చేయాలని తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఎంతగానో తాపత్రయపడ్డారని ఆయన కుమార్తె సునీత అన్నారు.

Updated : 05 Apr 2024 18:17 IST

కాశినాయన: వైఎస్‌ షర్మిలను ఎంపీ చేయాలని తన తండ్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఎంతగానో తాపత్రయపడ్డారని ఆయన కుమార్తె సునీత అన్నారు. రాజకీయాల కోసమే తన తండ్రిని క్రూరంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య చేయించిన వాళ్లే మళ్లీ ఎంపీ బరిలో ఉన్నారని మండిపడ్డారు. కడపలో తన తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. శుక్రవారం వైఎస్సార్‌ జిల్లా కాశినాయన మండలం వరికుంట్లలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన బస్సు యాత్రలో సునీత మాట్లాడుతూ.. ‘వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉంటే దీన్ని సహించేవారా? పదవుల కోసం తమ్ముణ్ని చంపితే చూసి తట్టుకొనేవారా? కడప ఎంపీగా షర్మిలను దీవించి అవినాశ్‌ రెడ్డిని ఓడించాలని’ అని ప్రజలకు పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని