Team India: టాప్ ఆర్డర్ ఇలానే ఆడితే.. బుమ్రా - షమీతో ఆసీస్కు కష్టాలే: టీమ్ పైన్
ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ టిమ్ పైన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. మరీ ముఖ్యంగా టాప్ ఆర్డర్ విఫలం కావడం ఆందోళనకరమని అతడు వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా అతికష్టంగా విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను ఆసీస్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అయితే, తమ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఏమీ లేదని ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ విమర్శించాడు. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడమే దీనికి కారణమని వ్యాఖ్యానించాడు. ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివర్లో భారత్తో జరిగే సిరీస్లో ఆసీస్కు కష్టాలు తప్పవని హెచ్చరించాడు.
‘‘టెస్టు సిరీస్ను మేం గెలిచినా.. నేను మాత్రం తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యా. న్యూజిలాండ్, వెస్టిండీస్ కంటే కూడా మాదే బలమైన టీమ్. కివీస్పై కష్టపడి గెలిచాం. విండీస్ చేతిలో ఓ మ్యాచ్ను ఓడిపోయాం. టాప్ ఆర్డర్ విఫలమవుతోంది. కానీ, కెప్టెన్తోపాటు కోచ్, సెలక్టర్లు ‘మాకు ఎలాంటి ఆందోళన లేదు’ అని చెబుతారు. ఇప్పుడంతా బాగానే ఉంది. టాప్ ఆర్డర్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్మిత్, ఖవాజా, మార్నస్ లబుషేన్ ఫామ్లో లేరు. గత నాలుగు టెస్టుల్లోనూ వారు పెద్దగా రాణించలేదు. దీనిపై మనం లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. ఇప్పుడున్న బ్యాటింగ్ లైనప్ భారత ఫాస్ట్ బౌలింగ్ దళాన్ని సమర్థంగా ఎదుర్కోలేదు. బుమ్రా, షమీ పేస్ దాడి దెబ్బకు ఇక్కట్లు తప్పవు. ఇంగ్లాండ్ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగితే ఆ జట్టునూ అడ్డుకోవడం కష్టమే. ఇక భారత్ నుంచి అశ్విన్, జడేజా, సిరాజ్ నుంచి కూడా ముప్పు తప్పదు. వీటన్నింటికీ త్వరగా సమాధానం వెతకాలి’’ అని టిమ్ పైన్ వ్యాఖ్యానించాడు.
కివీస్పై విక్టరీ.. రెండో స్థానానికి ఆసీస్
న్యూజిలాండ్పై రెండో టెస్టులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఒక దశలో 80/5 స్కోరుతో కష్టాల్లో పడింది. అయితే, మిచెల్ మార్ష్ (80), అలెక్స్ కేరీ (98*) ఆరో వికెట్కు 140 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. ఒకే ఓవర్లో మార్ష్తోపాటు స్టార్క్ (0) ఔటైనప్పటికీ.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (32*)తో కలిసి కేరీ జట్టును గెలిపించాడు. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC 2023-25) పాయింట్ల పట్టికలో ఆసీస్ రెండో స్థానానికి చేరింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా 62.50 శాతంతో కొనసాగుతోంది. భారత్ (68.51 శాతం) అగ్రస్థానంలో ఉంది. న్యూజిలాండ్ (50) మూడో స్థానానికి పడిపోయింది.
కేరీ 98* మీద ఉన్నాడని తెలియదు: కమిన్స్
కివీస్ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించిన అలెక్స్ కేరీ 98 పరుగులు సాధించాడు. మరో రెండు రన్స్ చేస్తే సెంచరీ పూర్తయ్యేదే. కానీ, విన్నింగ్ షాట్ను కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బాదేశాడు. దీంతో కేరీకి శతకం చేజారింది. మ్యాచ్ అనంతరం దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరూ విజయం కోసం కష్టపడ్డారు. అభిమానులు కూడా ఉత్కంఠకు గురయ్యారు. చివరికి మేం విజయం సాధించాం. అయితే, కేరీ సెంచరీకి చేరువగా ఉన్నాడనే దానిపై అప్పటికి అవగాహన లేదు’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat vs Bengaluru: గుజరాత్పై బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విన్నింగ్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి.
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో నెగ్గి సంచలనం సృష్టించిన తెలుగు కుర్రాడు గుకేశ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ నగదు ప్రోత్సాహకంతో సన్మానించారు. -
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. -
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!