ODI WC 2023: సెమీస్లో భారత్-పాక్? తలపడతాయా? దక్షిణాఫ్రికా అరుదైన రికార్డు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్!
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) మ్యాచ్లు ఉత్కంఠగా సాగుతున్నాయి. టాప్ జట్లకూ షాక్లు తప్పడం లేదు. వరుసగా విజయాలు సాధించిన టీమ్లూ ఓటములను చవిచూస్తున్నాయి. అలాగే కీలక సమయాల్లో ఆటగాళ్లు దూరం కావడం కూడా ఆయా జట్లను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి వరల్డ్ కప్ విశేషాలు మీ కోసం..
సెమీస్లో దాయాదుల పోరు.. ఇంగ్లాండ్ మాజీకి షోయబ్ సమాధానం
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ వరుసగా విజయాలు సాధించి సెమీస్ రేసులో ముందుంది. మరోవైపు పాకిస్థాన్ ఓటములతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప పాక్ సెమీస్కు చేరుకోవడం కష్టమే. తర్వాతి రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో పాక్ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ‘‘భారత్-పాక్ జట్ల మధ్య కోల్కతా వేదికగా సెమీస్.. ఎవరైనా చెప్పగలరా?’’ అని వాన్ సరదాగా పోస్టు చేశాడు. దీనికి పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ‘‘గతంలోనూ ఇలాంటివే మా ఆశలను వమ్ముచేశాయి. నిన్ను కూడానూ’’ అంటూ నవ్వుతున్న ఎమోజీని ట్వీట్ చేశాడు.
దక్షిణాఫ్రికా సిక్స్ల రికార్డు
వన్డే ప్రపంచకప్లో అసాధారణ ఆటతీరుతో సెమీస్ రేసులో ముందున్న దక్షిణాఫ్రికా జట్టు తాజాగా న్యూజిలాండ్ను కూడా 190 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. క్వింటన్ డికాక్, వాన్డర్ డసెన్ సెంచరీలు బాదేశారు. ఇదే సమయంలో మరో అరుదైన రికార్డును దక్షిణాఫ్రికా తన ఖాతాలో వేసుకుంది. ఈ వరల్డ్ కప్లో ఇప్పటి వరకు సఫారీ జట్టు బ్యాటర్లు 82 సిక్స్లు కొట్టారు. దీంతో 2019 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ పేరిట ఉన్న 76 సిక్స్ల రికార్డును దక్షిణాఫ్రికా అధిగమించింది. లీగ్ దశలోనే ఇంకా రెండుమ్యాచ్లతోపాటు సెమీస్లోనూ దక్షిణాఫ్రికా ఆడనుంది. దీంతో ఆ సిక్స్ల సంఖ్య సెంచరీ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దక్షిణాఫ్రికా చేసిన 82 సిక్స్ల్లో డికాక్ 18, క్లాసెన్ 17, మిల్లర్ 14, మార్కో జాన్సెన్ 9, మార్క్రమ్ 8, వాన్డర్ డసెన్ 7 చొప్పున సిక్సర్లు బాదారు.
వరల్డ్ కప్లోని మిగతా మ్యాచ్లకు మిచెల్ మార్ష్ దూరం
కీలక దశలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ వరల్డ్ కప్లోని మిగతా మ్యాచ్లకు దూరం కావడం గమనార్హం. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల మిచెల్మార్ష్ మెగా టోర్నీ దూరమైనట్లు మేనేజ్మెంట్ వెల్లడించింది. ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోయాడని బోర్డు తెలిపింది. పాక్పై సెంచరీతో అలరించిన మార్ష్ మిగతా మ్యాచుల్లో పెద్దగా రాణించలేదు. మొత్తం 6 మ్యాచుల్లో 225 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు గ్లెన్ మ్యాక్స్వెల్ నవంబర్ 4న ఇంగ్లాండ్తో మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు. గోల్ఫ్ కార్ట్ నుంచి కిందపడటంతో మ్యాక్స్వెల్ ముఖానికి గాయాలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?