IPL 2024: ధోనీ - సచిన్ ఒక్కటే.. వీల్ఛైర్లో కూర్చోనైనా మహీ ఆడేస్తాడు: మాజీ క్రికెటర్లు
ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం ఐపీఎల్ 17వ సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మార్చి 22న తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు. సీఎస్కేను ఆరోసారి విజేతగా నిలపాలనే ఉద్దేశంతో బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు అతడికిదే చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మాజీ క్రికెటర్లు ఓ చర్చా కార్యక్రమంలో అద్భుతమైన సమాధానం ఇచ్చారు.
ధోనీ ముందే రావడం శుభపరిణామం: సురేశ్ రైనా
‘‘కెప్టెన్ ఎంఎస్ ధోనీ టోర్నీ ప్రారంభానికి ముందే చెన్నైకు రావడం శుభ పరిణామం. కఠిన వాతావరణ పరిస్థితుల్లో నాలుగైదు గంటలపాటు సాధన చేయడం అద్భుతం. జిమ్లోనూ సమయం గడిపేస్తున్నాడు. ఇలాంటప్పుడే జట్టుతో చాలా అనుబంధం కలుగుతుంది. ఆటగాళ్లు కూడా స్వేచ్ఛగా సీనియర్లతో కలిసేందుకు అవకాశం ఉంటుంది’’ అని సీఎస్కే మాజీ ఆటగాడు సురేశ్ రైనా అన్నాడు.
వారిద్దరి మధ్య పోలికలు ఉన్నాయి: అనిల్ కుంబ్లే
‘‘నేను ధోనీతో కలిసి ఐపీఎల్లో ఆడలేదు. కానీ.. భారత జట్టుకు ఆడా. నన్ను ఒకసారి పైకి ఎత్తాడు. నాలాంటి బరువున్న వ్యక్తిని లేపాలంటే అతడు చాలా బలంగా ఉండాలి. టీమ్ఇండియా తరఫున నాకు అదొక అద్భుత క్షణం. నేను కోచ్గా ఉన్నప్పుడు ధోనీ కెప్టెన్సీ చేస్తున్నాడు. రాంచీ వేదికగా వన్డే మ్యాచ్ అనుకుంటా. ప్రాక్టీస్ సెషన్ ఏర్పాటు చేశాం. అది ఆప్షనల్. రాంచీ ధోనీ సొంతూరు. అతడు రావాల్సిన అవసరమే లేదు. కానీ, వచ్చాడు. ‘నువ్వేం చేస్తున్నావు? మన మ్యాచ్కు ఇంకా రెండు రోజుల సమయం ఉంది’ అని అడిగా. ‘లేదు. నేను ఇక్కడ ఉండాలని భావించా’ అని సమాధానం ఇచ్చాడు. ఇలాంటి లక్షణమే సచిన్లోనూ గమనించా. దాదాపు పాతికేళ్లపాటు క్రికెట్ ఆడిన సచిన్.. ఆప్షనల్ రోజుల్లోనూ అందరికంటే ముందు బస్సులో ఉంటాడు. అందుకే, ధోనీ సీఎస్కే తరఫున కొనసాగడంపై నేను ఆశ్చర్యపోవడం లేదు. అతడికి ఆటపట్ల ఉన్న అభిరుచి ఆ స్థాయిలో ఉంటుంది’’ అని కుంబ్లే వ్యాఖ్యానించాడు.
ధోనీకి సీఎస్కే అలాంటి ఆఫర్ ఇస్తుంది: రాబిన్ ఉతప్ప
‘‘ఒకవేళ ధోనీ వీల్ఛైర్లో ఉన్నా సరే సీఎస్కే అతడికి ఆడేందుకు అవకాశం ఇస్తుంది. బ్యాటింగ్ విషయంలో అతడికి సమస్యేమీ లేదు. వికెట్ కీపింగ్లోనే ఏదైనా ఇబ్బంది ఎదురు కావచ్చు. మోకాళ్లు అరిగిపోతున్నప్పటికీ కీపింగ్ చేయడమంటే ధోనీకి చాలా ఇష్టం’’ అని రాబిన్ ఉతప్ప తెలిపాడు.
అతడి స్క్రిప్ట్ను అతడే రాసుకుంటాడు: ఇయాన్ మోర్గాన్
‘‘ధోనీ రిటైర్మెంట్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అతడి స్క్రిప్ట్ను అతడే రాసుకునే వైవిధ్యభరితమైన క్రికెటర్. రాబిన్ ఉతప్ప చెప్పినట్లుగా అతడి మోకాలు ఇబ్బంది పెట్టినా.. ధోనీ మాత్రం తన స్థానాన్ని వదిలిపెట్టాలనుకోడు. ఫ్రాంచైజీని విజయవంతంగా నడిపించేందుకు సిద్ధంగా ఉంటాడు. సమయాన్ని గౌరవిస్తూనే... ఎవరైనా వచ్చి బాధ్యతలు తీసుకునే వరకూ జట్టుతోపాటే ఉంటాడు’’ అని మోర్గాన్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat vs Bengaluru: గుజరాత్పై బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విన్నింగ్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి.
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో నెగ్గి సంచలనం సృష్టించిన తెలుగు కుర్రాడు గుకేశ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ నగదు ప్రోత్సాహకంతో సన్మానించారు. -
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. -
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..