IND vs AUS: వాన కాదు.. మనోళ్లు పడ్డారు
విశాఖపట్నం టీమ్ఇండియాకు బాగా కలిసొచ్చిన వేదిక. ఇక్కడ ఎన్నోసార్లు పరుగుల వరద పారించి, వికెట్ల వేటలో విజయవంతమైన ప్రత్యర్థులను మట్టికరిపించిన చరిత్ర భారత్ది.
విశాఖలో కుప్పకూలిన టీమ్ఇండియా
117 పరుగులకే ఆలౌట్
కంగారూల చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తు
విశాఖ నుంచి ఈనాడు క్రీడా ప్రతినిధి
విశాఖపట్నం టీమ్ఇండియాకు బాగా కలిసొచ్చిన వేదిక. ఇక్కడ ఎన్నోసార్లు పరుగుల వరద పారించి, వికెట్ల వేటలో విజయవంతమైన ప్రత్యర్థులను మట్టికరిపించిన చరిత్ర భారత్ది. కానీ ఇక్కడ ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు వర్షం ముప్పుందని వార్తలొచ్చేసరికి విశాఖ అభిమానుల్లో నిరుత్సాహం! వరుణుడా కరుణించు అంటూ ఉదయం నుంచి వేడుకుంటూ వచ్చారు. మధ్యాహ్నానికి వరుణుడు కరుణించాడు. మ్యాచ్ జరగనిచ్చాడు. కానీ మ్యాచ్ అయ్యేసరికి వర్షం వద్దని ఎందుకు కోరుకున్నామా అని పశ్చాత్తాపం! వాన వల్ల మ్యాచ్ రద్దయిపోయినా బాగుండే అన్న నిట్టూర్పు! ఇప్పటిదాకా ఎక్కువగా భారత జట్టుకు తీపి గుర్తులనే మిగులుస్తూ వచ్చిన విశాఖ.. ఈసారి ఎప్పటికీ మరిచిపోలేని చేదు జ్ఞాపకాన్ని అందించింది. 117 పరుగులకే కుప్పకూలి.. కంగారూల చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తయింది రోహిత్ సేన.
విశాఖపట్నంలో టీమ్ఇండియా తేలిపోయింది. మొదట బ్యాటింగ్.. తర్వాత బౌలింగ్లో ఘోరంగా విఫలమైంది. ఆసీస్కు ఏమాత్రం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. పేసర్ మిచెల్ స్టార్క్ (5/53) బంతితో నిప్పులు చెరిగిన వేళ.. ఆదివారం రెండో వన్డేలో ఆసీస్ 10 వికెట్ల తేడాతో రోహిత్ సేనను చిత్తుగా ఓడించి మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 26 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టార్క్తో పాటు అబాట్ (3/23), ఎలిస్ (2/13)ల దెబ్బకు రోహిత్ సేన విలవిలలాడింది. అనంతరం ఆసీస్ కేవలం 11 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51 నాటౌట్; 30 బంతుల్లో 10×4), మిచెల్ మార్ష్ (66 నాటౌట్; 36 బంతుల్లో 6×4, 6×6) తొలి వికెట్కు అజేయంగా 121 పరుగులు జోడించి మ్యాచ్ను ముగించేశారు. బుధవారం చెన్నైలో నిర్ణయాత్మక మూడో వన్డే జరుగుతుంది.
గంటలోపే స్వాహా: 118 పరుగులంటే స్వల్ప లక్ష్యమే. పోరాడేందుకు అవకాశాలు తక్కువే. కానీ మ్యాచ్ గెలవకపోయినా.. రెండు మూడు వికెట్లయినా పడగొట్టి పోటీలో ఉన్నాం అనిపించుకోవాలి. ముంబయిలో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ నుంచి అలాంటి పోటీనే చూశాం. కానీ భారత బౌలర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. సాయంత్రం 4.32 గంటలకు ఆసీస్ బ్యాటింగ్ ఆరంభం కాగా.. 5.29 గంటలకు మ్యాచ్ పూర్తయింది. అంటే.. సరిగ్గా 57 నిమిషాలు. భారత ఇన్నింగ్స్లో జట్టంతా కలిపి 9 ఫోర్లు కొడితే.. మార్ష్ ఒక్కడే 6 సిక్సర్లు బాదాడు. హెడ్, మార్ష్ కలిసి 16 బౌండరీలు కొట్టారు. 121 స్కోరులో 100 పరుగులు ఫోర్లు, సిక్సర్ల రూపంలో వచ్చాయంటే భారత బౌలింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. షమి వేసిన తొలి ఓవర్లో 2 పరుగులే వచ్చేసరికి ఛేదనలో ఆసీస్ కష్టపడుతుందనుకున్నారు. కానీ రెండో ఓవర్ నుంచి ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. బౌండరీల మోత మోగిస్తూ ఇంకో పది ఓవర్లకే మ్యాచ్ను ముగించేశారు మార్ష్, హెడ్,. మార్ష్ 28 బంతుల్లో అర్ధశతకం సాధిస్తే.. హెడ్ 29 బంతుల్లోనే ఆ మార్కును చేరుకున్నాడు.
వాంఖడేను మించి..: వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి చాలా కష్టపడ్డ భారత్.. విశాఖలో మొదట బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా తడబడింది. రాత్రి నుంచి ఉదయం వరకు వర్షం కురవడం.. పిచ్ నుంచి పేసర్లకు సహకారం లభిస్తుందన్న అంచనా.. మళ్లీ వాన పడినా లక్ష్య ఛేదన చేయొచ్చన్న ఉద్దేశంతో టాస్ గెలవగానే కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆ ఆలోచన సరైందని తేలడానికి ఎంతోసేపు పట్టలేదు. మొదటి బంతి నుంచే స్టార్క్ స్వింగ్కు ప్రయత్నించాడు. మూడో బంతికే శుభ్మన్ గిల్ (0) వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అచ్చం తొలి వన్డేలో మాదిరిగానే దూరంగా వెళ్తున్న బంతిని పుష్ చేసిన గిల్.. పాయింట్లో లబుషేన్ చేతికి చిక్కాడు. తర్వాత రోహిత్ (13), విరాట్ (31; 35 బంతుల్లో 4×4) ఇన్నింగ్స్ను గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మ్యాచ్ సాగుతున్నాకొద్దీ స్టార్క్ స్వింగ్ మరింత పదునెక్కింది. అతడి ధాటికి రోహిత్ వెనుదిరక్క తప్పలేదు. మంచి సీమ్తో ఆఫ్స్టంప్ ఆవల సంధించిన బంతిని రోహిత్ కవర్స్ మీదుగా డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కాని బ్యాటును తాకుతూ వేగంగా దూసుకొచ్చిన బంతిని స్లిప్లో స్మిత్ తడబడుతూనే ఒడిసిపట్టుకున్నాడు. ఆ తర్వాతి బంతికే సూర్యకుమార్ యాదవ్ (0) ఔటయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ నిర్లక్షంగా ఆడి డకౌటయ్యాడు. తొలి వన్డే మాదిరే స్టార్క్ బౌలింగ్లోనే మొదటి బంతికే వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. సమీక్ష కూడా అవసరం లేదంటూ కోహ్లి చెప్పడంతో సూర్య నిరాశగా వెనుదిరిగాడు. తొలి వన్డే హీరో కేఎల్ రాహుల్ (9) ఈసారి నిలవలేకపోయాడు. అతణ్ని కూడా స్టార్కే వికెట్ల ముందు బలిగొన్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే భారత్కు మరో ఎదురుదెబ్బ. అబాట్ బౌలింగ్లో హార్దిక్ పాండ్య (1) దూరంగా వెళ్తున్న బంతినిని ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. స్మిత్ కుడివైపు పూర్తిగా గాల్లోకి దూకుతూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. పది ఓవర్లయినా అవ్వకముందే భారత్ 49/5కు చేరుకుంది.
కోహ్లి కూడా..: పిచ్ నుంచి పేసర్లకు సహకారం లభిస్తుండటంతో కోహ్లి కాస్త ఆచితూచి ఆడాడు. జడేజా (16) సహకారంతో ఇన్నింగ్స్ను నడిపించాడు. అడపాదడపా బౌండరీలు సాధిస్తూ 15 ఓవర్ల వరకు బండిని లాంగించాడు. స్టార్క్ 6 ఓవర్ల తన మొదటి స్పెల్లో ఒక మెయిడిన్ వేసి.. 31 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. స్టార్క్ స్పెల్ ముగియగానే అబాట్తో కలిసి ఎలిస్ దాడి కొనసాగించాడు. ఇన్నింగ్స్ను నిలబెట్టేలా కనిపిస్తున్న కోహ్లీని ఎలిస్ ఔట్ చేయడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. మంచి సీమ్తో ఫుల్ లెంగ్త్లో నేరుగా వికెట్లను లక్ష్యంగా సంధించిన బంతిని ఆడటంలో కోహ్లి లైన్ తప్పాడు. వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి స్కోరు 71/6. ఈ దశలో అక్షర్ (29 నాటౌట్; 29 బంతుల్లో 1×4, 2×6) పోరాడినా.. మరో ఎండ్లో జడేజా, కుల్దీప్ (4), షమి (0) పెవిలి యన్కు వరుస కట్టారు. జట్టు స్కోరును 100 దాటించిన అక్షర్.. స్టార్క్ వేసిన 26వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. కానీ అదే ఓవర్లో చివరి బంతికి సిరాజ్ (0)ను క్లీన్బౌల్డ్ చేసిన స్టార్క్.. భారత ఇన్నింగ్స్కు తెరదించాడు.
117
సొంతగడ్డ మీద వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత్కిదే అత్యల్ప స్కోరు. మొత్తంగా వన్డేల్లో టీమ్ఇండియాకిది నాలుగో అతి తక్కువ స్కోరు.
ఆస్ట్రేలియా 234 బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. బంతుల తేడా పరంగా భారత్కు వన్డేల్లో ఇదే అతి పెద్ద ఓటమి.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) స్మిత్ (బి) స్టార్క్ 13; గిల్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 0; కోహ్లి (ఎల్బీ) (బి) ఎలిస్ 31; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; రాహుల్ (ఎల్బీ) (బి) 9; హార్దిక్ (సి) స్మిత్ (బి) అబాట్ 1; జడేజా (సి) కేరీ (బి) ఎలిస్ 16; అక్షర్ నాటౌట్ 29; కుల్దీప్ (సి) హెడ్ (బి) అబాట్ 4; షమి (సి) కేరీ (బి) అబాట్ 0; సిరాజ్ (బి) స్టార్క్ 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం: (26 ఓవర్లలో ఆలౌట్) 117; వికెట్ల పతనం: 1-3, 2-32, 3-32, 4-48, 5-49, 6-71, 7-91, 8-103, 9-103; బౌలింగ్: స్టార్క్ 8-1-53-5; గ్రీన్ 5-0-20-0; అబాట్ 6-0-23-3; ఎలిస్ 5-0-13-2; జంపా 2-0-6-0
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ నాటౌట్ 51; మార్ష్ నాటౌట్ 66; ఎక్స్ట్రాలు 4; మొత్తం: (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 121; బౌలింగ్: షమి 3-0-29-0; సిరాజ్ 3-0-37-0; అక్షర్ 3-0-25-0; హార్దిక్ 1-0-18-0; కుల్దీప్ 1-0-12-0
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్