Ravindra Jadeja: కట్టిపడేస్తున్నాడు..
సాధారణంగా బ్యాటింగ్ అనుకూల పిచ్లపై తన కచ్చితత్వంతో కూడిన బౌలింగ్తో జట్టుకు జడేజా ఎంతో ఉపయోగపడతాడు.
దిల్లీ
రవీంద్ర జడేజా..! ఈ ఆల్రౌండర్ ఎంత విలువైన ఆటగాడో కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ప్రపంచకప్ మొదలైనప్పటి నుంచి అది మరింత స్పష్టంగా అర్థమవుతోంది. టోర్నీలో ఇప్పటివరకు అతడికి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు కానీ.. బంతితో ఇంతకుముందు కన్నా మిన్నగా ప్రభావం చూపిస్తుండడం విశేషం.
సాధారణంగా బ్యాటింగ్ అనుకూల పిచ్లపై తన కచ్చితత్వంతో కూడిన బౌలింగ్తో జట్టుకు జడేజా ఎంతో ఉపయోగపడతాడు. అదే పిచ్ కాస్త అనుకూలించిందా.. జట్టుకు ప్రమాదకర ఆయుధంగా మారతాడు. ఇప్పుడు అతడు ప్రపంచకప్లో తన స్పిన్తో టీమ్ఇండియాకు అత్యంత కీలకమవుతున్నాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టోర్నీలో జడేజా గణాంకాలు అద్భుతంగా ఏమీ అనిపించకపోవచ్చు. నాలుగు మ్యాచ్ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. కానీ మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థి పరుగుల వేగానికి బ్రేకులు వేస్తూ ఇన్నింగ్స్ గమనాన్నే మార్చేస్తున్నాడు. బ్యాటర్లను కట్టిపడేసే అతడి కచ్చితత్వమే.. మరోవైపు నుంచి కుల్దీప్ యాదవ్ మరింతగా ఎటాక్ చేయడానికి వీలు కల్పిస్తోంది.
131 డాట్ బాల్స్: ఈ ప్రపంచకప్లో జడేజా మరింత మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. నాలుగు మ్యాచ్లో కలిపి 37.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు ఏకంగా 131 డాట్ బాల్స్ వేశాడంటే.. బ్యాటర్లకు ఎలా కళ్లెం వేస్తున్నాడో, పరుగుల వేగాన్ని ఎలా నియంత్రిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. జడేజా 21.5 ఓవర్ల డాట్ బాల్స్ వేశాడు. అంటే.. అతడి బౌలింగ్లో డాట్ బాల్స్ శాతం 58.22. బౌండరీ బాల్స్ 11 మాత్రమే. అందులో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్స్లు ఉన్నాయి.
ఇలా ఎలా..: మరి ఈ టోర్నీలో జడేజా ఇంత ప్రభావవంతంగా బౌలింగ్ చేయడానికి కారణమేంటి? ఇదే విషయాన్ని తొలి మ్యాచ్ అనంతరం ఓ విలేకరి అతణ్ని అడిగితే.. ‘‘నా గేమ్ప్లాన్ను నేను వెల్లడించను. చెబితే.. ఇంగ్లిష్లో రాసేస్తారు. ప్రత్యర్థులు చదివి తెలుసుకుంటారు’’ అని జడ్డూ నవ్వుతూ జవాబిచ్చాడు. అయితే మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్.. జడేజా బౌలింగ్ ఇంతకుముందు కంటే పదునెక్కడానికి కారణాన్ని విశ్లేషించాడు. ‘‘జడేజా ఇంతకుముందు రౌండ్ ఆర్మ్తో బౌలింగ్ చేసేవాడు. దీని వల్ల బంతి ఎక్కువగా టర్న్ కాదు. పిచ్ స్పిన్కు బాగా సహకరించినప్పుడు ఈ డెలివరీలు ప్రమాదకరమవుతాయి. కానీ మంచి పిచ్లపై నాణ్యమైన అంతర్జాతీయ బ్యాటర్లను ఈ డెలివరీలు పెద్దగా ఇబ్బంది పెట్టలేవు. ఇప్పుడు జడేజా రౌండ్ ఆర్మ్ బౌలింగ్ చేయడం మానేశాడు. తన బంతి నిలకడగా సీమ్పై ల్యాండవుతోంది. దాంతో అతడికి అదనపు బౌన్స్తో పాటు తగినంత టర్న్ లభిస్తోంది. బ్యాటర్లను బీట్ చేయగలుగుతున్నాడు’’ అని కార్తీక్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?