SA vs IND: సిరీస్ చిక్కేదెవరికో?
వన్డే సిరీస్లో ఆఖరి సమరానికి వేళైంది. గురువారం జరిగే చివరి వన్డేలో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా పైచేయి సాధించిన సంగతి తెలిసిందే.
భారత్, దక్షిణాఫ్రికా చివరి వన్డే నేడు
సాయంత్రం 4.30 నుంచి
పార్ల్ (దక్షిణాఫ్రికా): వన్డే సిరీస్లో ఆఖరి సమరానికి వేళైంది. గురువారం జరిగే చివరి వన్డేలో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ప్రస్తుతం రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. మరి నిర్ణయాత్మక పోరులో గెలిచి సిరీస్ను చేజిక్కించుకునేదెవరో! ఆసక్తికర పోరు ఖాయం.
ఓపెనర్లు పుంజుకుంటేనే..!: టీమ్ఇండియా ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఒకే ఒక్కసారి (2018లో) వన్డే సిరీస్ గెలుచుకుంది. మరోసారి నెగ్గాలంటే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ నుంచి బలమైన ఆరంభం అవసరం. కొత్త కుర్రాడు సుదర్శన్ ఆట జట్టుకు సంతోషాన్నిస్తోంది. అతడు గత రెండు మ్యాచ్ల్లో వరుసగా 55, 62 పరుగులతో ఆకట్టుకున్నాడు. కానీ మరోవైపు నుంచి రుతురాజే అతడికి సహకారాన్ని ఇవ్వలేకపోయాడు. రెండు మ్యాచ్ల్లోనూ అతడు విఫలమయ్యాడు. వరుసగా 5, 4 పరుగుల వద్ద ఔటయ్యాడు. తొలి వన్డేలో 23 వద్ద, రెండో వన్డేలో నాలుగు వద్ద ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ నిర్ణయాత్మకలో భారత్ ఇన్నింగ్స్ ఎలా మొదలవుతుందో చూడాలి. మరోవైపు తిలక్ వర్మ ఆట జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. కెరీర్ ఆరంభంలో చక్కని ఆటతో ఆశలు రేపిన ఆ యువ ఆటగాడు ఇటీవల తడబడుతున్నాడు. పరుగుల వేటలో బాగా వెనుకబడ్డాడు. భారత్ మంచి స్కోరు చేయాలంటే ఈ హైదరాబాదీ బ్యాటర్ ఫామ్ను అందుకోవడం అవసరం. అయితే ఈ మ్యాచ్లో అతణ్ని ఆడిస్తారా లేదా రజత్ పటీదార్కు అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి.
టెస్టు మ్యాచ్లకు సిద్దం కావడం కోసం శ్రేయస్ అయ్యర్ చివరి రెండు వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. సంజు శాంసన్కు మరో అవకాశం దక్కొచ్చు. ఇక బౌలింగ్లో ముకేశ్ పుంజుకోవాల్సివుంది. గత రెండు మ్యాచ్లో అతడు ఒక్క వికెట్టూ పడగొట్టలేదు. అర్ష్దీప్, అవేష్ ఖాన్ తొలి మ్యాచ్లోలా విజృంభించాలని జట్టు కోరుకుంటోంది. మరోవైపు రెండో వన్డేలో నెగ్గిన దక్షిణాఫ్రికా.. రెట్టించిన ఉత్సాహంతో మ్యాచ్కు సిద్ధమైంది. రెండో వన్డేలో శతకం సాధించిన జోర్జి.. డికాక్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం చూస్తున్న ఆ జట్టు ఆశలు రేపాడు. ఈ మ్యాచ్లో అతడు ఎలా ఆడతాడో చూడాలి. మూడో వన్డే వేదికలో పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్-పాక్ మ్యాచ్.. ఆ టికెట్లకు భారీ ధరపై లలిత్ మోదీ ఫైర్!
టీ20 ప్రపంచ కప్లో భాగంగా త్వరలో భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లపై ఐసీసీ నిర్ణయించిన ధర చర్చనీయాంశంగా మారింది. -
ఫినిషర్ డీకే వీడ్కోలు.. కెరీర్లో అదొక్కటే లోటు!
భారత క్రికెట్లో చాలామంది క్రికెటర్లు ఉన్నారు. కానీ, ఎవరి నోటనైనా ఒక పేరు వచ్చిందంటే వెంటనే గుర్తుకురావాలి. అలాంటి జాబితాలోని క్రికెటర్ దినేశ్ కార్తిక్. -
ఇప్పుడు భారత ప్రధాన కోచ్గా రాలేను..: రికీ పాంటింగ్
భారత ప్రధాన కోచ్ పదవికి ఉన్నంత డిమాండ్ మరెక్కడా ఉండదేమో. అదే సమయంలో ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టును నడిపించడం సాధారణ విషయం కాదు. -
భారీ స్కోర్లకు ‘ఇంపాక్ట్’ రూలే కారణం కాదు: అశ్విన్
ప్రస్తుతం ఐపీఎల్లో అన్ని జట్లూ 12 మంది ప్లేయర్లతో ఆడుతున్నాయి. దానికి కారణం ‘ఇంపాక్ట్’ ప్లేయర్ రూల్. అదనంగా ఒక బ్యాటర్ లేదా బౌలర్ను ఎంచుకొనే వెసులుబాటు ఉంటుంది. -
‘‘ఐపీఎల్ కప్ కొట్టడం.. సంబరాలు చేసుకున్నంత సులువు కాదు’’
కీలకమైన ప్లేఆఫ్స్ మ్యాచ్లో బెంగళూరు ఓడిపోయింది. ఈసారైనా కప్ను కొట్టాలనే ఆశలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో సీఎస్కే మాజీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. -
కోల్కతా ‘ఫైనల్’ ప్రత్యర్థి ఎవరు? గాయపడ్డ హైదరాబాదా.. జోరు మీదున్న రాజస్థానా?
శుక్రవారం చెన్నై వేదికగా ఐపీఎల్ 17వ సీజన్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్కు చేరి కోల్కతాను ఢీకొట్టనుంది. -
షారుక్ ఖాన్ ఐపీఎల్ ఫైనల్కు వచ్చేస్తాడు: జూహీ చావ్లా
కోల్కతా ఓనర్ షారుక్ ఖాన్ డీహైడ్రేషన్కు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై తాజాగా సహ యజమాని జూహీ చావ్లా స్పందించారు. -
పొత్తికడుపు గాయంతో బాధపడ్డా.. వయసు పెరుగుతోంది కదా: అశ్విన్
ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరును చిత్తు చేసి రాజస్థాన్ రెండో క్వాలిఫయర్లో అడుగు పెట్టింది. ఆర్ఆర్ విజయంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. -
‘డీకే’ను ఓదార్చిన విరాట్ కోహ్లీ.. ఘనంగా ‘గార్డ్ ఆఫ్ ఆనర్’
కీలకమైన మ్యాచ్లో ఓడిన బెంగళూరు జట్టు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆ ఫ్రాంచైజీ ఆటగాడు దినేశ్ కార్తిక్ కూడా మెగా లీగ్కు వీడ్కోలు పలికాడు. -
మా స్పెషాలిటీ చూపించలేకపోయాం.. ‘ఇంపాక్ట్’ రూల్తో ఆ స్కోరు సరిపోదు: డుప్లెసిస్
Bengaluru Vs Rajasthan: కీలక ఎలిమినేటర్లో రాజస్థాన్ చేతిలో బెంగళూరు ఓటమిపాలై టోర్నీ నుంచి బయటకొచ్చింది. ఈ సందర్భంగా తమ ప్లేయర్ల ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ డుప్లెసిస్ మరో 20 పరుగులు చేసుండాల్సిందని అభిప్రాయపడ్డాడు. -
దినేశ్ కార్తిక్.. ఆ ఎల్బీ నాటౌటా?
ఆర్సీబీ ఇన్నింగ్స్లో సమీక్షలో దినేశ్ కార్తీక్ ఎల్బీ నాటౌట్గా తేలడం వివాదాస్పదమైంది. 15వ ఓవర్ రెండో బంతికి రజత్ను అవేశ్ ఔట్ చేశాడు. -
నేనైతే మొదట కోహ్లినే ఎంపిక చేస్తా
విరాట్ కోహ్లిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి భారత్లో జనం కారణాలు వెతుకుతారని, తానైతే టీ20 ప్రపంచకప్కు మొదట అతణ్నే ఎంచుకుంటానని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు. -
ఐపీఎల్కు కార్తీక్ టాటా
వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్కు వీడ్కోలు పలికాడు. తన జట్టు బెంగళూరు బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆ మ్యాచ్ అయిన వెంటనే కార్తీక్ ఐపీఎల్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. -
ఈ సాలా కన్నీళ్లే!
ఐపీఎల్-17లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అసామాన్య పోరాటం ముగిసింది. బుధవారం ఎలిమినేటర్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడింది. -
తుదిపోరుకు జ్యోతి బృందం
ఆర్చరీ ప్రపంచకప్ల్లో ప్రపంచ నంబర్వన్ భారత మహిళల కాంపౌండ్ జట్టు దూకుడు కొనసాగిస్తోంది. గత నెలలో షాంఘైలో జరిగిన తొలి అంచె ప్రపంచకప్లో పసిడి నెగ్గిన జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి స్వామి త్రయం.. తాజాగా రెండో అంచె పోటీల్లోనూ ఫైనల్కు దూసుకెళ్లింది. -
సచిన్ రికార్డు స్వర్ణం
పారిస్ పారాలింపిక్స్కు ముందు భారత అథ్లెట్లు ఆశాజనక ప్రదర్శన చేస్తున్నారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాల పంట పండిస్తున్నారు. -
రెండో రౌండ్లో సింధు
మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు శుభారంభం చేసింది. -
కోహ్లి మూడులోనే..
ఆర్సీబీ ఓపెనర్గా ఐపీఎల్లో కోహ్లి గొప్ప ప్రదర్శన చేశాడు. కానీ వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచకప్లో అతణ్ని మూడో స్థానంలో ఆడించడమే మంచిదని దక్షిణాఫ్రికా బ్యాటింగ్ గ్రేట్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. -
అర్జెంటీనాపై భారత్ విజయం
ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ ఐరోపా అంచెను భారత పురుషుల జట్టు విజయంతో ఆరంభించింది. బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో షూటౌట్లో 5-4తో అర్జెంటీనాను ఓడించింది. -
పంత్ ఉంటేనే బాగుంటుంది
టీ20 ప్రపంచకప్లో సంజు శాంసన్ కన్నా రిషబ్ పంతే వికెట్ కీపర్గా ఉంటే బాగుంటుందని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
నాపై ఒత్తిడేమీ ఉండదు: ప్రజ్ఞానంద
నార్వే చెస్ టోర్నమెంట్ సందర్భంగా మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)ను అతడి సొంతగడ్డపై ఎదుర్కొనేటప్పుడు తనపై ఒత్తిడేమీ ఉండదని ప్రజ్ఞానంద అన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
కలలు కనడం మానొద్దు: నాగ్ అశ్విన్పై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
భారత్-పాక్ మ్యాచ్.. ఆ టికెట్లకు భారీ ధరపై లలిత్ మోదీ ఫైర్!
-
ముగిసిన ఆరో దశ ప్రచారం.. అందరి చూపు ఎర్రకోట వైపు!
-
జూన్ 6వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు
-
క్షిపణులతో విరుచుకుపడిన రష్యా.. ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మృతి
-
ఐఫోన్ 15, శాంసంగ్ ఎం34 5జీ ఫోన్లపై డిస్కౌంట్