Harbhajan Singh: ప్రపంచకప్లో భారత్ ఓటమి.. దయ చేసి అలా చేయొద్దు: హర్భజన్ సింగ్
ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమి అనంతరం ఆసీస్ ఆటగాళ్లు, వారి కుటుంబాలపై ట్రోలింగ్ చేయడాన్ని టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) తప్పుబట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కొంతమంది అభిమానులు ఆస్ట్రేలియా ఆటగాళ్లపై, వారి కుటుంబాలపై ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఖండించాడు. దయచేసి ఆసీస్ ఆటగాళ్లు, వారి కుటుంబాలపై ట్రోలింగ్ చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. భారత్ ఫైనల్ ఓడిపోయిన అనంతరం ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ భార్య వినీ రామన్పై కొంతమంది అనుచిత కామెంట్స్ చేశారు. దీనికి ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హర్భజన్ సింగ్ ట్రోలింగ్ అంశంపై స్పందించాడు.
‘‘ఆస్ట్రేలియా క్రికెటర్ల కుటుంబ సభ్యులపై ట్రోలింగ్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. మన జట్టు బాగా ఆడింది. కానీ, ఫైనల్లో ఆసీస్ మెరుగైన ఆటతీరు కనబర్చడంతో మనం ఓడిపోయాం. ఆటగాళ్లు, వారి కుటుంబాలపై ట్రోలింగ్ చేయడం ఎందుకు? అలా చేయొద్దని క్రికెట్ అభిమానులందరినీ కోరుతున్నా. చిత్తశుద్ధి, గౌరవం చాలా ముఖ్యమైనవి’’ అని హర్భజన్ సింగ్ ఎక్స్ (X)లో పోస్ట్ చేశాడు.
బాబర్ అజామ్, కోహ్లీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్
నవంబర్ 23 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉండటంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటాడు. తొలి మ్యాచ్ నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఇదిలా ఉండగా.. టీ20ల్లో పాక్ ఆటగాడు బాబర్ అజామ్, భారత ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డుపై సూర్యకుమార్ యాదవ్ కన్నేశాడు. అతడు వచ్చే మ్యాచ్లో 159 పరుగులు చేస్తే టీ20ల్లో వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్గా రికార్డు సృష్టిస్తాడు. అలా జరగని పక్షంలో.. సూర్య మరో రెండు ఇన్నింగ్స్ల్లో 159 పరుగులు చేస్తే బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ (52 ఇన్నింగ్స్ల్లో) సరసన నిలుస్తాడు. సూర్యకుమార్ మరో ఐదు ఇన్నింగ్స్ల్లో 159 పరుగులు చేస్తే కోహ్లీని అధిగమించి భారత్ తరఫున టీ20ల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.
పాకిస్థాన్కు బౌలింగ్ కోచ్లు
పాకిస్థాన్ జట్టుకు ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్ కోచ్లను పీసీబీ నియమించింది. పాక్ మాజీ ఆటగాడు ఉమర్ గుల్ను పేస్ బౌలింగ్, సయ్యద్ అజ్మల్ను స్పిన్ బౌలింగ్ కోచ్గా ఎంపిక చేసింది. ఉమర్ గుల్కు గతంలో పాక్ జట్టుకు బౌలింగ్ కోచ్గా పనిచేసిన అనుభవముంది. డిసెంబరులో పాక్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆసీస్తో డిసెంబర్ 14 నుంచి జనవరి 7 వరకు రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అనంతరం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ కివీస్తో జనవరి 12 నుంచి జనవరి 21 వరకు ఐదు టీ20లు ఆడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!