IND vs PAK: అప్పుడు నా బౌలింగ్ను అర్థం చేసుకోవడం వారికి కష్టమే: కుల్దీప్
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) భారత్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా పాక్ను చిత్తు చేసిన టీమ్ఇండియా (IND vs PAK) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వచ్చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా పాక్తో (IND vs PAK) జరిగిన మ్యాచ్లో తొలుత బౌలర్లకు సహకారం లభించలేదని.. 270 పరుగులైనా ఛేజ్ చేసేందుకు అవకాశం ఉందని భారత క్రికెటర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) తెలిపాడు. పాకిస్థాన్పై ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టిన కుల్దీప్ ఈ ప్రపంచ కప్లో అద్భుత బౌలింగ్తో అలరిస్తున్నాడు. అతడి బౌలింగ్లో స్వీప్ షాట్లకు యత్నించి మరీ బ్యాటర్లు పెవిలియన్కు చేరడం గమనార్హం. పాక్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ కూడా ఇలానే స్వీప్ షాట్ కొట్టేందుకు యత్నించి బౌల్డయ్యాడు. ఇఫ్తికార్ను ఔట్ చేసేందుకు ఏదైనా ప్లాన్ చేశారా..? అనే ప్రశ్నకు కుల్దీప్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
‘‘ఇఫ్తికార్ కోసం ఎలాంటి ప్రణాళికలు వేయలేదు. లెగ్ స్టంప్ మీదుగా బంతిని విసరాలని ప్రయత్నించా. అయితే, గూగ్లీ పడింది. కానీ కాస్త దూరంగా పడిందనిపించింది. ఇలాంటి బాల్ను స్వీప్ చేయాలంటే చాలా కష్టం. అయితే, ఇఫ్తికార్ వికెట్ లక్కీగా వచ్చింది. దీంతో మిగతా వారిపై ఒత్తిడి పెరిగిపోయింది. నా చేతి నుంచి బంతి విడుదలయ్యేటప్పుడు బ్యాటర్లు అర్థం చేసుకోవడం కష్టం. దానిని మామూలు షాట్గా ఆడదామా..? స్వీప్ షాట్ కొడదామా..? అనే సందిగ్ధత కలుగుతుంది.
స్వీప్ షాట్కు ప్రయత్నిస్తున్నారంటే వారికి ఆ షాట్ తెలిసి ఉంటుంది. అయితే ఎక్స్ట్రా బౌన్స్ అయిన బంతిని ఆడేందుకు వారు ఛాన్స్ తీసుకోరు. ఇదే విషయంపై నేను కెప్టెన్తో మాట్లాడా. అప్పుడే రెండు వికెట్లు ఒకే ఓవర్లో వచ్చాయి. సిరాజ్ బౌలింగ్లో బాబర్ వికెట్ రావడమే టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ఓకే ఓవర్లో రెండు వికెట్లు తీయడంతో వారు కోలుకోలేకపోయారు. అయితే, ఇంత స్కోరుకే పరిమితం చేయాలని అనుకోలేదు. పిచ్ను బట్టి 270 పరుగులైనా ఛేదించవచ్చు. సింగిల్స్ చాలా సులువుగా వస్తాయి. వికెట్ తీయడమే చాలా కష్టం. ఫుల్లర్ డెలివరీలతో బ్యాటర్లు సులభంగా బౌండరీలు కొట్టేయగలరు. దీంతో లెంగ్త్కు కట్టుబడి బౌలింగ్ చేశాం. మరీ ఎక్కువగా సీమ్కైనా, స్పిన్కైనా పిచ్నుంచి సహకారం లభించలేదు. అయితే, సింగిల్స్ను కట్టడి చేయడంతో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెరిగిపోయింది. ఆ తర్వాత వికెట్లు వాటంతటవే వచ్చేశాయి’’ అని కుల్దీప్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!