భారత్‌ - ఆస్ట్రేలియా మ్యాచ్‌కి వర్షం అడ్డంకి

బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో వరణుడు అడ్డంకిగా నిలిచాడు. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 7.1 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 21 పరుగులు...

Updated : 07 Jan 2021 08:07 IST

సిడ్నీ: బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో వరణుడు అడ్డంకిగా నిలిచాడు. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 7.1 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 21 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం పడడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అద్భుత బంతితో ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ వార్నర్‌ను బోల్తా కొట్టించాడు. జట్టు స్కోరు 6 పరుగుల వద్ద సిరాజ్‌ బౌలింగ్‌లో వార్నర్‌ స్లిప్‌లో పూజారా చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి లబుషేన్‌ వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో విల్‌ పకోస్కీ, లబుషేన్‌ ఉన్నారు. 
 

ఇవీ చదవండి..

 

ఆకలిగొన్న సింహంలా స్మిత్‌

 

 

ఆటగాడే అభిమానై..

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు