‘నాలుగు’ కెమెరాలతో ఎల్‌జీ కొత్త ఫోన్లు..

ఎల్‌జీ కంపెనీ డబ్ల్యూ సిరీస్‌లో మూడు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎల్‌జీ W41, W41 ప్లస్‌, W41 ప్రో పేరుతో వీటిని పరిచయం చేశారు. ఈ మోడల్స్‌లో క్వాడ్ రియర్ కెమెరా, 5K బ్యాటరీ, పంచ్‌ హోల్ డిస్‌ప్లే డిజైన్‌ వంటి ఫీచర్స్ ఇస్తున్నారు.... 

Published : 23 Feb 2021 23:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎల్‌జీ కంపెనీ డబ్ల్యూ సిరీస్‌లో మూడు కొత్త ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎల్‌జీ W41, W41 ప్లస్‌, W41 ప్రో పేరుతో వీటిని పరిచయం చేశారు. ఈ మోడల్స్‌లో క్వాడ్ రియర్ కెమెరా, 5K బ్యాటరీ, పంచ్‌ హోల్ డిస్‌ప్లే డిజైన్‌ వంటి ఫీచర్స్ ఇస్తున్నారు. ర్యామ్‌, మెమొరీ మినహా మూడు మోడల్స్‌లో ఒకే రకమైన ఫీచర్స్ ఉన్నాయి. మరి ఎల్‌జీ తీసుకొచ్చిన ఈ W సిరీస్‌ ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం రండి.

* ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 10 ఆధారిత క్యూ ఓఎస్‌తో పనిచేస్తాయి. 

* 6.5-అంగుళాల హెచ్‌డీ+ హెచ్‌ఐడీ ఫుల్ విజన్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 

* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ ఉపయోగించారు.

* W41 సిరీస్‌లో మొత్తం ఐదు కెమెరాలున్నాయి. వెనుక నాలుగు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. 

* వెనుకవైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్, 2 ఎంపీ, 5 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 

* 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫోన్ వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తున్నారు. 

* W41 మోడల్‌ 4జీబీ ర్యామ్‌/64జీబీ మెమొరీ ధర రూ.13,490. W41+ మోడల్ 4జీబీ/128జీబీ ధర రూ.14,490. W41 ప్రో 6జీబీ/128జీబీ ధర రూ. 15,490. లేజర్ బ్లూ, మ్యాజిక్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని