ఇది మొదటి ప్రమాద హెచ్చరిక
‘‘ఇది మనకు మొదటి ప్రమాద హెచ్చరిక లాంటిది. మొదటి, రెండోదశ ఉద్ధృతులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా వచ్చాయి. అదృష్టవశాత్తూ దక్షిణాఫ్రికా వేరియంట్ గురించి ముందే తెలిసింది. అందువల్ల అన్ని రకాల కొవిడ్
మాస్కులే టీకాలుగా పనిచేస్తాయి
రెండు డోసులు తీసుకుంటేనే రక్షణ
జాగ్రత్తగా లేకపోతే ముప్పు తప్పదు
ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు
ఈనాడు- హైదరాబాద్: ‘‘ఇది మనకు మొదటి ప్రమాద హెచ్చరిక లాంటిది. మొదటి, రెండోదశ ఉద్ధృతులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా వచ్చాయి. అదృష్టవశాత్తూ దక్షిణాఫ్రికా వేరియంట్ గురించి ముందే తెలిసింది. అందువల్ల అన్ని రకాల కొవిడ్ నిబంధనలను పాటించడం ద్వారా ఈ ముప్పు నుంచి బయటపడొచ్చు’’ అని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. ముప్పు ఎప్పుడైనా రావొచ్చనీ, మనం తీసుకునే జాగ్రత్తలే మనకు శ్రీరామరక్షగా ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు కూడా సహకరించి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మన మాస్కే వ్యాక్సిన్ లాగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంకా రెండోడోసు తీసుకోని వ్యక్తులు సుమారు 25 లక్షలమంది ఉన్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా హైదరాబాద్లో 5.90 లక్షల మంది, మేడ్చల్ మల్కాజిగిరిలో 4.89 లక్షలు, రంగారెడ్డిలో 4.15 లక్షల మంది గడువు తీరినా రెండోడోసు వేసుకోలేదని పేర్కొన్నారు. రెండు డోసులు వేసుకుంటేనే కొవిడ్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని, అప్రమత్తంగా లేకపోతే మూడోముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో గురువారం విలేకరులతో ప్రజారోగ్య సంచాలకులు మాట్లాడారు.
వైరస్ కనుమరుగు కాలేదు
‘‘వ్యాక్సిన్ ఈరోజు వేసుకున్నంత మాత్రాన రేపటినుంచి మనకు రక్షణ దొరికే అవకాశం లేదు. రక్షణ లభించడానికి సుమారు 2-4 వారాల సమయం పడుతుంది. జనవరి, ఫిబ్రవరిల్లో మరో దశ ఉధ్ధృతి రావొచ్చనే ప్రచారం జరుగుతోంది. మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇదే నిజం అయ్యే ప్రమాదముంది. ఎందుకంటే కరోనా వైరస్ ప్రవర్తన.. ప్రజల ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుంది. మళ్లీ మన అనాలోచిత చర్యల వల్ల అలాంటి పరిస్థితులు పునరావృత్తం కానీయొద్దు. 18 సంవత్సరాలు పైబడిన వ్యక్తులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. శుభకార్యాలు, వివాహాలు, ఇతరత్రా ఏ కార్యక్రమాల్లోనైనా కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో ఇప్పటికే మనం చూశాం. ఉదాహరణకు ఒక పాఠశాలలో తొలిరోజు ఒక కేసు వెలుగులోకి వస్తే.. మరుసటి రోజు పరీక్షల్లో 48 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈరోజు ఒక జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి కూడా కొవిడ్ సోకింది. మొన్ననే శాసనసభ స్పీకర్ కూడా పాజిటివ్గా తేలారు. దీన్నిబట్టి వైరస్ ఇంకా కనుమరుగు కాలేదనేది స్పష్టమవుతోంది. టీకా తీసుకోకపోతే మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో నెట్టుకున్నట్లే.
మాస్కు లేకుంటే రూ. 1000 జరిమానా
మాస్కు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధించాల్సిందిగా పోలీసు వారిని కోరాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గతంలోనే జారీ చేసింది. వచ్చే 2, 3 నెలలు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరిస్తే... మూడోదశ ఉధ్ధృతి రాకుండా అడ్డుకోవచ్చు. అన్ని రకాల పని ప్రదేశాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, ప్రయాణాల్లో టీకా ధ్రువపత్రాన్ని కూడా ఆరోగ్య సిబ్బంది పరిశీలిస్తారు. అందరూ రెండు డోసులు తీసుకున్నట్లుగా ధ్రువపత్రాన్ని తమ వెంట తీసుకెళ్లాలి. రానున్న రోజుల్లో ధ్రువపత్రం వెంట తీసుకెళ్లడాన్ని తప్పనిసరి చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించనున్నాం’’ అని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ