మనోళ్లు.. విశ్వగురువులు
మనదేశానికి చెందిన అనేక మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే విషయం తెలిసిందే. అలాగే పలు బహుళజాతి సంస్థల నిర్వహణలోనూ మనవారు కీలకస్థానాల్లో ఉన్న సంగతీ విదితమే. మరి దేశానికే చెందిన అనేక మంది ప్రవాసులు పలు దేశాల్లో పెద్దఎత్తున ఆచార్యులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలుసా?..ముఖ్యంగా అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి పలు దేశాలు ప్రవాసభారతీయులు/ప్రవాసాంధ్రులకు ఆచార్యులుగా పట్టం కడుతున్నాయి.
అమెరికా, యూకేలో భారీగా ప్రవాస భారతీయ ఆచార్యులు
డీన్లు, విభాగాధిపతులుగానూ వందల మంది
కొన్ని వర్సిటీలకు అధ్యక్షులుగా బాధ్యతలు
ఈనాడు, హైదరాబాద్: మనదేశానికి చెందిన అనేక మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే విషయం తెలిసిందే. అలాగే పలు బహుళజాతి సంస్థల నిర్వహణలోనూ మనవారు కీలకస్థానాల్లో ఉన్న సంగతీ విదితమే. మరి దేశానికే చెందిన అనేక మంది ప్రవాసులు పలు దేశాల్లో పెద్దఎత్తున ఆచార్యులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలుసా?..ముఖ్యంగా అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి పలు దేశాలు ప్రవాసభారతీయులు/ప్రవాసాంధ్రులకు ఆచార్యులుగా పట్టం కడుతున్నాయి. అంతేకాదు పరిపాలనా వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నాయి. తాజాగా తెలుగు మహిళ నీలి బెండపూడి అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి తొలి మహిళా ప్రెసిడెంట్గా నియమితులు కావడం గమనార్హం.
భారత్ నుంచి విద్యార్థులు 1980 ప్రాంతంలో అమెరికాతోపాటు యూరప్ దేశాల్లో ఇంజినీరింగ్, పీహెచ్డీ చేసేందుకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అలాంటి వారు ఎంతో మంది అక్కడే బోధనా వృత్తి వైపు ఆసక్తి చూపారు. 990 వరకు అదే పరిస్థితి కొనసాగింది. అలా ఆచార్యవృత్తిలో రాణిస్తున్నవారిని ఆయా వర్సిటీలు ముఖ్యమైన స్థానాల్లో నియమిస్తూ మనవారికి సముచిత స్థానాలు కట్టబెడుతున్నాయి. ఇలా ఎంతో మంది ప్రవాస భారతీయులు(ప్రవాసాంధ్రులు/ప్రవాస తెలంగాణీయులు) మంచి హోదాల్లో నిలుస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్ ఆచార్య తుమ్మల పాపిరెడ్డి విశ్లేషించారు.
అమెరికాలో 2010లోనే దాదాపు 300-400 మంది తెలుగు ఆచార్యులు పలు వర్సిటీల్లో వివిధ హోదాల్లో ఉన్నట్లు అంచనా వేశారు. వారు ఆచార్యులుగా, విభాగాధిపతులుగా, డీన్లుగా, ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. దశాబ్దం తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగి ఉంటుందని అంచనా. తాజాగా వైజాగ్కు చెందిన నీలి బెండపూడి పెన్సిల్వేనియా రాష్ట్ర వర్సిటీ ప్రెసిడెంట్గా తాజాగా నియమితులయ్యారు.
ఓయూలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన జేఎన్ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో అగ్రశ్రేణి వర్సిటీల్లో ఒకటైన టెక్సాస్ ఏ అండ్ ఎంలోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ మెకానిక్స్ ఫర్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇంద్రా కె.రెడ్డి టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీలోని ఫార్మసీ కళాశాల వ్యవస్థాపక డీన్గా ఉన్నారు. కాకతీయ వర్సిటీలో ఆయన బీఫార్మసీ చదివారు.
* అమెరికాలో ఇంజినీరింగ్ విద్యకు అత్యంత ప్రసిద్ధి చెందిన కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన సుబ్ర సురేష్ 2013లో ఎన్నికయ్యారు. ఆసియా దేశాలకు చెంది ఎంఐటీ డీన్గా పనిచేసిన మొదటి వ్యక్తి ఆయనే. బ్రౌన్ వర్సిటీలో అత్యంత చిన్న వయసులో ఆచార్యుడిగా నియమితులైన మొదటి భారతీయుడు కూడా ఆయనే.
* ప్రవాస భారతీయుడైన ప్రదీప్ ఖోస్లా కాలిఫోర్నియా వర్సిటీ ఛాన్స్లర్గా పనిచేయడం విశేషం.
* యూకేలోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అమర్త్యసేన్, సుగతా మిత్ర, కుమార్ భట్టాచార్య, సుమంత్ర బోస్ తదితరులు, కేంబ్రిడ్డి వర్సిటీలో జైదీప్ ప్రభు తదితరులు పనిచేశారు.
* ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, యూనివర్సిటీ కాలేజ్ లండన్, కింగ్స్ కాలేజ్ లండన్, మాంచెస్టర్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ తదితర ప్రసిద్ధి చెందిన విద్యాసంస్థల్లో పదుల సంఖ్యలో భారతీయులు గురువులుగా వ్యవహరిస్తున్నారు.
* కొలంబియా విశ్వవిద్యాలయంలోని హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2011లో విడుదల చేసిన సర్వే ప్రకారం 5.4 శాతం ఆసియన్లు బోధనా వృత్తిలో ఉంటే వారిలో 2-3 శాతం శాతం మంది భారతీయులే ఉంటారని అంచనా వేశారు.
* ఆచార్య అఖిల్ బిల్గ్రామి అగ్రదేశానికి చెందిన కొలంబియా వర్సిటీలోని ఫిలాసఫీ విభాగంలో 1985 నుంచి పనిచేస్తున్నారు. ముంబయికి చెందిన ఆయన అంతకు ముందు మిషిగన్ వర్సిటీలో సేవలందించారు.
ఎందరో తెలుగు వాళ్లు...
* ఓయూలో చదివిన రవి బెల్లంకొండ కొద్ది నెలల క్రితమే ఎమొరి వర్సిటీ అకడమిక్ వ్యవహారాలకు ప్రోవోస్ట్గా, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.
* హైదరాబాద్లోని ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) డీన్గా నియమితులైన మదన్ పిల్లుట్ల కూడా లండన్ బిజినెస్ స్కూల్ ఆచార్యుడే. అక్కడ పనిచేస్తూనే ఇక్కడకు వచ్చారు.
* గణితం, సాంఖ్యక శాస్త్రంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సీఆర్ రావు ఇప్పటికీ అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీలో ఎమిరిటీస్ ప్రొఫెసర్గా ఉన్నారు.
* ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ(ఏఎన్యూ) ముఖ్య ఆచార్యుడు చెన్నుపాటి జగదీష్ వచ్చే మే నెలలో ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
* అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యేల్ వర్సిటీ పొలిటికల్ సైన్స్లో కరుణ మంతెన సహ ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు. ఆమె హార్వర్డ్ వర్సిటీ నుంచి 2004లో పీహెచ్డీ పొందారు. ఆమె రచించిన పలు పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి.
* అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీలో రాములు మామిడాల సీనియర్ ఆచార్యుడిగా కొనసాగుతున్నారు. ఈయన ఓయూలోనే మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆయన 1985-86లోనే ఆ వర్సిటీలో టాప్ టెన్ ఆచార్యుల్లో ఒకరిగా పురస్కారం పొందారు. 2012లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.
* యూఎస్లోని ది న్యూ స్కూల్ ఫర్ సోషల్ రీసెర్చ్లో సంజయ్ జి రెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. ఆ వర్సిటీలో ఇండియా-చైనా ఇన్స్టిట్యూట్కు కో అకడమిక్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు పలు భాషాల్లోకి అనువాదమయ్యాయి. ఆయన హార్వర్డ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పొందారు.
యూకేలో భారతీయ గురువులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..
Indian Student Missing: షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. -
తానా ఆధ్వర్యంలో సౌతెర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీ విద్యార్థులకు రిఫ్రెష్ వర్క్షాప్
సౌతెర్న్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీకి కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం తానా న్యూ ఇంగ్లాండ్ ఛాప్టర్ ‘తానా రిఫ్రెష్ వర్క్షాప్’ను నిర్వహించింది. -
సింగపూర్లో ఎన్నారైలతో ఘనంగా డా.రామ్మాధవ్ పుస్తక పరిచయ కార్యక్రమం
'శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో సింగపూర్లో ప్రవాస భారతీయులతో డా.రామ్మాధవ్ రచించిన నూతన గ్రంథం ‘ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్’ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. -
ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో కువైట్లో ఎన్నికల ప్రచారం
ఎన్నారై తెదేపా కువైట్ ఆధ్వర్యంలో తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతుగా విస్త్రృత ప్రచారం నిర్వహించారు. -
లండన్లో వైభవంగా ‘తాల్’ ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
‘సామెతలు.. తెలుగు భాషకు సింగారం..’
సామెతలు మన తెలుగు భాషకు సింగారం అని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత మన అందరిదీ అని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు అన్నారు. తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచ సాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వ సమావేశం ‘తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు’ అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగింది. -
యూకేలో ఘనంగా ఉగాది సంబరాలు.. TAS నూతన కార్యవర్గం ఎన్నిక
యూకేలోని స్కాట్లాండ్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
ఘనంగా ‘కెంటకీ తెలుగు సంఘం’ ఉగాది వేడుకలు
కెంటకీ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ
-
మాటలు రావట్లేదు.. అలాంటి బ్యాటింగ్ టీవీల్లోనే చూశాం: కేఎల్ రాహుల్
-
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
-
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
-
భారత క్రికెట్లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్
-
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..