‘ఇన్స్పైర్’.. విజేతలకు ఉచితంగా బీటెక్ సీట్లు
మీ పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలైన ఇన్స్పైర్, హ్యాక్థాన్, కిషోర్ వైజ్ఞానిక ప్రోత్సాహన్ యోజన, నాసా కాంటెస్ట్ వంటి వాటిల్లో ప్రతిభ చూపారా? అయితే వారు జేఈఈ మెయిన్, ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలు రాయకున్నా..
ఎంసెట్, జేఈఈలలో ర్యాంకు రాకున్నా సరే..
సూపర్ న్యూమరరీ కింద ఒక్కో కళాశాలలో 2 సీట్లు
మార్గదర్శకాలు జారీ చేసిన ఏఐసీటీఈ
ఈనాడు, హైదరాబాద్: మీ పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలైన ఇన్స్పైర్, హ్యాక్థాన్, కిషోర్ వైజ్ఞానిక ప్రోత్సాహన్ యోజన, నాసా కాంటెస్ట్ వంటి వాటిల్లో ప్రతిభ చూపారా? అయితే వారు జేఈఈ మెయిన్, ఎంసెట్ లాంటి ప్రవేశ పరీక్షలు రాయకున్నా.. రాసినా ర్యాంకు రాకున్నా ఉన్నత ప్రమాణాలున్న కళాశాలల్లో బీటెక్లో చేరొచ్చు. అంతేకాదు వారు ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) తాజాగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
చదువులో ర్యాంకులు సాధించని ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తుంటారు. సమస్యలను లోతుగా అర్థం చేసుకొని వినూత్న పరిష్కారాలకు రూపం ఇచ్చి పరికరాలు, యంత్రాలు తయారు చేస్తుంటారు. అలాంటి ప్రతిభావంతులకు (గిఫ్టెడ్ చిల్డ్రన్)కు ఒక్కో కళాశాలల్లో 2 సీట్లు కేటాయిస్తామని ఏఐసీటీఈ ప్రకటించింది. ఆమేరకు మార్గదర్శకాలు జారీచేసింది.
త్వరలో కళాశాలల ఎంపిక..
విద్యాసంస్థ పనితీరు, కేంద్ర విద్యాశాఖ ఇచ్చే జాతీయ ర్యాంకింగ్(ఎన్ఐఆర్ఎఫ్), ఏఐసీటీఈ అటల్ ర్యాంకింగ్తోపాటు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు తదితర కొలమానాల ఆధారంగా ఈ సీట్లు కేటాయించాల్సిన కళాశాలలను త్వరలో ఎంపిక చేస్తామని ఏఐసీటీఈ పేర్కొంది.
ప్రస్తుతానికి ఏఐసీటీఈ గుర్తించిన పోటీలు ఇవీ...
* రాష్ట్ర, జాతీయ స్థాయి హ్యాకథాన్
* సీఎస్ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు
* ఇన్స్పైర్ అవార్డు
* ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ పురస్కారం
* కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)
* గూగుల్ సైన్స్ ఫెయిర్
* అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్
* ప్రధానమంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్- ధ్రువ్
* నాసా రోవర్ ఛాలెంజ్
* ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్, ఇంజినీరింగ్ ఫెయిర్
* వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్ ఇండియా
* ఫస్ట్ లెగో లీగ్ ఇండియా
* ఫస్ట్ టెక్ ఛాలెంజ్
* ఫస్ట్ రోబోటిక్స్ కాంపిటీషన్
* ఇండియన్ రోబో కప్ జూనియర్
* నేషనల్ సైన్స్ కాంకర్స్
* ఎన్ఎస్ఎస్, నాసా స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్
* ఇమేజిన్ కప్ (మైక్రోసాఫ్ట్)
* రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే ఒలింపియాడ్
* ఇన్నోవేటివ్ స్టార్టప్ అవార్డ్
ఎవరు అర్హులు..
* ప్రభుత్వ, ప్రతిష్ఠాత్మక సంస్థలు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజేతలు.
* కేంద్ర సైన్స్- టెక్నాలజీ విభాగం(డీఎస్టీ), బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ), సీఎస్ఐఆర్, ఎన్సీఈఆర్టీ, కేంద్ర విద్యాశాఖ, డీఆర్డీఓల నుంచి ప్రాజెక్టులకు నిధులు పొందిన వారు.
* గుర్తింపు పొందిన బహుళ జాతి, స్వచ్ఛంద సంస్థల (గూగుల్, బెల్ ల్యాబ్స్, ఇంటెల్, టీసీఎస్, ఐబీఎం, టెస్లా, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, లాక్హీడ్ మార్టిన్, స్టెమ్ తదితర) నుంచి నిధులు పొందిన వారు.
* యూజీసీ గుర్తించిన కేర్-2 జర్నళ్లలో పరిశోధన పత్రాలు ప్రచురితమైన వారు
* జాతీయ, అంతర్జాతీయ పేటెంట్లు పొందిన వారు.
ఇంటర్ ఉత్తీర్ణులవ్వాలి...
* ఆయా విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలైతే 40 శాతం, ఇతరులు 45 శాతంతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.
* ఇంజినీరింగ్ చదవాలన్న ఆసక్తి ఉండటంతోపాటు తనకు సీటు కేటాయించాలని కళాశాలకు దరఖాస్తు చేసుకోవాలి. నిపుణుల కమిటీ ముఖాముఖికి హాజరుకావాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్