AP 3 Capitals: 3 రాజధానులపై మెరుగైన బిల్లు తెస్తాం
ఏపీలో పాలనా వికేంద్రీకరణపై ప్రభుత్వం మళ్లీ సమగ్రమైన, మెరుగైన బిల్లుల్ని రూపొందించి శాసనసభ ముందుకు తెస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.
పాలన వికేంద్రీకరణపై అవసరమైన మార్పుల్ని పొందుపరుస్తాం
వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల ఉపసంహరణపై శాసనసభలో ఏపీ సీఎం జగన్
ఈనాడు - అమరావతి: ఏపీలో పాలనా వికేంద్రీకరణపై ప్రభుత్వం మళ్లీ సమగ్రమైన, మెరుగైన బిల్లుల్ని రూపొందించి శాసనసభ ముందుకు తెస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ బిల్లులపై ఒకటిన్నర, రెండేళ్లుగా రకరకాలుగా వక్రీకరించడంతోపాటు అపోహలు, న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే ప్రకటన చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సోమవారం అసెంబ్లీలో వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రకటన సందర్భంగా మళ్లీ బిల్లు తెస్తామనే పదాలను నొక్కి వక్కాణించారు. ‘అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టాలని చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయం వివాదమైనదనీ, శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి చేసిందనీ తెలుసు.. అయినా 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాంతం అంటే నాకెలాంటి వ్యతిరేకత లేదు.. నా ఇల్లు ఇక్కడే ఉంది’ అని వివరించారు.
కనీస వసతులకే రూ.లక్ష కోట్లు
‘అమరావతి నుంచి విజయవాడ, గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరం.. అక్కడ కనీస మౌలిక వసతుల కల్పనకు.. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు కావాలి. ఈ రోజు లెక్కల ప్రకారం రూ.లక్ష కోట్లు.. పదేళ్లు పోతే ఖర్చు ఆరేడు లక్షల కోట్లకు పెరుగుతుంది’ అని జగన్ పేర్కొన్నారు. ‘కనీస వసతుల్ని ఏర్పాటు చేసుకునేందుకే డబ్బులేని పరిస్థితి ఉంటే.. రాజధాని అనే ఊహాచిత్రం సాధ్యమవుతుందా? చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాలకు ఎప్పుడూ పెద్ద నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లాల్సిందేనా? ఎప్పటికీ మనకు మార్పు ఉండదా? మన పిల్లలకు ఉద్యోగాలొచ్చే నగర స్థాపన ఎప్పటికి?’ అని ప్రశ్నించారు.
ఈ ఆలోచనల నుంచే రాష్ట్రంలోని పెద్ద నగరమైన విశాఖపట్నంపై దృష్టి పెట్టామని సీఎం చెప్పారు. ‘విశాఖపట్నంలో సౌకర్యాలు ఇప్పటికే ఉన్నాయి. కొద్దిగా సుందరీకరణ, ఇతర వసతులకు కొద్దిగా అదనపు విలువ జోడిస్తే.. అయిదు, పదేళ్లకైనా హైదరాబాద్ వంటి పెద్ద నగరాలతో పోటీ పడుతుందనేది వాస్తవం’ అని జగన్ స్పష్టం చేశారు.
వికేంద్రీకరణే సరైనదని బలంగా నమ్మాం
‘నాటి శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో రాజధానుల వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టాం. అది ఆమోదం పొందిన వెంటనే మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే.. ఈపాటికే మంచి ఫలితాలు అందేవి. అయితే వికేంద్రీకరణపై రెండేళ్లుగా అనేక అపోహలు, అనుమానాలు సృష్టించారు. దుష్ప్రచారాలు చేశారు. అనేక కోర్టు కేసులు, న్యాయపరమైనవివాదాలు తీసుకొచ్చారు. అందరికీ న్యాయం చేయాలనే ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కన పెట్టి.. కొందరికి అన్యాయం జరుగుతోందనే వాదనను కొంతమంది ముందుకు తెచ్చారు’ అని వివరించారు.
గతంలోని కేంద్రీకరణ ధోరణుల్ని (ఒకే చోట అభివృద్ధి) ప్రజలెంత వ్యతిరేకించారో.. 2019 ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటమైంది. మరోసారి హైదరాబాద్ లాంటి సూపర్ రాజధాని వద్దే వద్దని, అటువంటి చారిత్రక తప్పిదానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజాతీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణ సరైన విధానమని బలంగా నమ్మి అడుగులు వేశాం. అన్ని ప్రాంతాలు, కులాలు, మతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకున్నాం కాబట్టే.. ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు మా ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు.
- అసెంబ్లీలో సీఎం జగన్ మోహన్రెడ్డి
అనూహ్య ఆనందం... అంతలోనే కన్నీటి పర్యంతం
మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకోవాలని సోమవారం ఉదయం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడంతో రాజధాని రైతుల దీక్షా శిబిరాల్లో ఆనందం వెల్లి విరిసింది. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని 700 రోజులకు పైగా ఉద్యమిస్తున్న రైతులకు బిల్లు రద్దు విషయం తెలియగానే మిఠాయిలు పంచుకున్నారు. అయితే... ఎలాంటి ఇబ్బందులు, చిక్కులు ఎదురుకాకుండా మళ్లీ వికేంద్రీకరణ బిల్లుని శాసనసభలో మరోసారి ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి ప్రకటన చేయగానే శిబిరాల్లో రైతులు విచారంతో కన్నీటి పర్యంతమయ్యారు.
-ఈనాడు అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?