సింగరేణికి సెగ
సింగరేణి సంస్థకూ ప్రైవేటు పోరు తప్పేలా లేదు. ఇంతకాలం నిల్వలున్న ప్రాంతాల్లో కొత్త గనులు తవ్వుకుంటూ వస్తోన్న సంస్థ నెత్తిన కేంద్రం ‘వేలంలో పాడుకుంటేనే’ అనే కొత్త కుంపటి పెట్టడమే దానికి కారణం. దీని ప్రభావం నూతన థర్మల్ విద్యుత్తు
కేంద్రం తెచ్చిన వేలం విధానంతో చిక్కులు
సంస్థ మనుగడకు ముప్పేనంటున్న కార్మిక సంఘాలు
కేంద్రం వేలానికి పెట్టిన సత్తుపల్లి ఉపరితల బొగ్గు గని
ఈనాడు, హైదరాబాద్: సింగరేణి సంస్థకూ ప్రైవేటు పోరు తప్పేలా లేదు. ఇంతకాలం నిల్వలున్న ప్రాంతాల్లో కొత్త గనులు తవ్వుకుంటూ వస్తోన్న సంస్థ నెత్తిన కేంద్రం ‘వేలంలో పాడుకుంటేనే’ అనే కొత్త కుంపటి పెట్టడమే దానికి కారణం. దీని ప్రభావం నూతన థర్మల్ విద్యుత్తు కేంద్రాలపైనా పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలోని గనుల వేలానికి సంబంధించి కేంద్రం ఇటీవల ‘ఖనిజాలు, గనుల అభివృద్ధి’ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గనులను వేలంవేసి అధిక ధర కోట్ చేసిన వారికి కేటాయించడమే ఈ విధానం. వేలం జాబితాలో తొలిసారి తెలంగాణలోని నాలుగు కొత్త బొగ్గు గనులను నమోదు చేసింది. ఈ నెల 13న వేలం జరగనున్న నేపథ్యంలో కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మిక సంఘాలు ఈ నెల 9 నుంచి 3 రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చాయి.
చేసిన ఖర్చంతా వృథాయేనా?
గోదావరి పరీవాహక ప్రాంతంలో బొగ్గు తవ్వకాల కోసం నిజాం ప్రభుత్వ హయాంలోనే సింగరేణి సంస్థకు 44 అనుమతులు (లైసెన్సులు) ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రాంతాలకు బయట ఉన్న గనులను కేంద్రం వేలం జాబితాలో చేర్చింది. నిజానికి ఈ నాలుగు గనుల్లో బొగ్గు నిల్వల అన్వేషణ, మౌలిక సదుపాయాల కోసం సంస్థ కొన్నేళ్లుగా రూ.167 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ నాలుగు.. పాత గనుల పక్కనే ఉండటం వల్ల వాటి నుంచి బొగ్గు తవ్వడం సులభం. అవి ప్రైవేటుపరమైతే ఇప్పటివరకూ చేసిన ఖర్చు వృథా కావడంతో పాటు, ఆయా కంపెనీలకు ఆయాచిత లబ్ధి చేకూర్చినట్లవుతుందని సంస్థ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
థర్మల్ కేంద్రాలపైనా ప్రభావం
తెలంగాణలో ఎన్టీపీసీ, రాష్ట్ర జెన్కో కొత్త విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తున్నాయి. వీటికి నిత్యం లక్షలాది టన్నుల బొగ్గు కావాలి. కనీసం 10 కోట్ల టన్నులు ఏటా తవ్వితేనే 2025 నాటి మార్కెట్ అవసరాలను తీర్చగలుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఏటా కోటి టన్నుల ఉత్పత్తికి అవకాశమున్న నాలుగు కొత్త గనులను కేంద్రం వేలంలో పెట్టిందని, అవి దక్కకపోతే 10 కోట్ల టన్నుల లక్ష్యాన్ని చేరడం సాధ్యం కాదని సింగరేణి వర్గాలు పేర్కొంటున్నాయి.
పోటీపడటం సాధ్యమా?
సింగరేణి సంస్థలో వేలాది ఉద్యోగుల జీతభత్యాలు తదితర ప్రమాణాల రీత్యా టన్ను బొగ్గు తవ్వకానికి సగటున రూ.2 వేలకు పైగా ఖర్చవుతోంది. ప్రైవేటు కంపెనీలు తక్కువ సిబ్బందితో ఇంత కంటే తక్కువ వ్యయానికి బొగ్గుతవ్వి లాభాలకు అమ్ముతాయి. ఆ పరిస్థితుల్లో సింగరేణి వాటితో పోటీపడటం అసాధ్యమనే అభిప్రాయాన్ని కార్మిక సంఘా వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు సంస్థ మనుగడకు ముప్పుగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడి వేసవిలో వణికించిన వాన
భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. మంగళవారం ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. -
మేడిగడ్డ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి
‘కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్ కుంగిన ఏడో బ్లాకులో తెరుచుకోని ఎనిమిది రేడియల్ గేట్లలో రెండింటిని పూర్తిగా తొలగించాలి. -
‘రైతు భరోసా’ బంద్
‘రైతు భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారులకు అందజేసే పంట సాయం పంపిణీని తక్షణం నిలుపుదల చేయాలి. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. -
అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్
యూఎస్లో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఈ నెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ సమయాల (స్లాట్స్)ను అమెరికా ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. -
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బీసీ, సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
రైతుభరోసాపై త్వరలో విధివిధానాలు
రాష్ట్రంలోని అర్హులైన రైతులకే రైతుభరోసా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. -
20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కేసులో మే 14 వరకు, సీబీఐ కేసులో 20 వరకు పొడిగించింది. -
ఓట్ల ప్రయాణంలో.. నోట్ల దోపిడీ
ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడా లేదు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్ లిస్టులు వందలు దాటేశాయి. -
50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి
తెలంగాణలో 50 శాతం ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలని పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
కనీస వేతనం రూ.30 వేలు ఉండాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ.30 వేలు, గరిష్ఠ వేతనం రూ.2,48,150, ఫిట్మెంట్ 30 శాతంతో కొత్త పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్యూటీఎఫ్) శివశంకర్ను కోరింది. -
ముఖ గుర్తింపు విధానం నుంచి మినహాయించండి!
తెలంగాణలోని పాఠశాలల్లో హాజరు నమోదుకు కొత్త విద్యాసంవత్సరం నుంచి చేపడుతున్న ముఖగుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) విధానం నుంచి అంధ ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలని రాష్ట్ర అంధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.మల్లేశం, రాఘవేందర్రెడ్డి, ఇతర నేతలు అనిల్కుమార్, జి.మల్లేశ్, నాగేంద్రమ్మలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశాన్ని కోరారు. -
గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ ఆర్ట్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కోర్సులు
గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని మహిళల ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ-డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఆసక్తి కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తెలిపారు. -
టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. -
కర్ణాటకలో నేడు కృష్ణా జలాల విడుదల
కర్ణాటక నుంచి తెలంగాణకు బుధవారం కృష్ణా జలాలు విడుదల చేయనున్నారు. ఆ రాష్ట్రంలోని నారాయణపూర్ నుంచి 1.9 టీఎంసీల నీటిని దిగువకు వదిలేందుకు అక్కడి జలవనరుల శాఖ అంగీకరించింది. -
భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!
రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరగనుంది. -
ఇదీ సంగతి!