ఎర మొక్కలుంటే.. మిరప దక్కేది
ఒకప్పుడు మిరప చేలకు వెళితే చుట్టూ గట్టుపై బంతి లేదా జొన్న, మొక్కజొన్న వరసలు కనిపించేది. ఇప్పుడు అవి కనిపించడం లేదు. చేను చుట్టూ సహజ రక్షణ కోసం ఇలాంటి సహజ కంచెలు వేయడంలో రైతులు చూపుతున్న
ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు
పురుగులు, తెగుళ్లతో నష్టాల పాలు
చేల చుట్టూ బంతి మొక్కలుంటే పంటను కాపాడుకోవచ్చు
తెగుళ్లపై భారత వ్యవసాయ పరిశోధన మండలి అధ్యయనం
భద్రాద్రి జిల్లాలో మిరప తోటను పరిశీలిస్తున్న ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు
ఈనాడు, హైదరాబాద్: ఒకప్పుడు మిరప చేలకు వెళితే చుట్టూ గట్టుపై బంతి లేదా జొన్న, మొక్కజొన్న వరసలు కనిపించేది. ఇప్పుడు అవి కనిపించడం లేదు. చేను చుట్టూ సహజ రక్షణ కోసం ఇలాంటి సహజ కంచెలు వేయడంలో రైతులు చూపుతున్న నిర్లక్ష్యమే ఇప్పుడు పంటలను కబళిస్తోందని ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’ (ఐసీఏఆర్) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిరప, పత్తి, పసుపు, మొక్కజొన్న తదితర పంటలకు పురుగులు, తెగుళ్లు సోకకుండా వాటి చుట్టూ ఎరగా ఇతర మొక్కల సాగు మంచి ఫలితాలనిస్తుంది. ఏవైనా పురుగులు వస్తే తొలుత ఈ మొక్కలపై చేరతాయి. రైతులు వాటిని గుర్తించి నియంత్రించడం ద్వారా అసలు పంటను కాపాడుకోవచ్చు. మిరప రైతులు ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరా కౌలుకు రూ.30 వేలకు పైగా చెల్లించి ఈ పంట వేస్తే తెగుళ్లతో పంట దెబ్బతిని నిలువునా నష్టపోతున్నారు. తామర పురుగుతో పాటు కొత్త రకం తెగుళ్లు సోకి మిరప చెట్లు పూత, కాత లేక నాశనమవుతున్నాయని వారు చెబుతున్నారు. అప్పుల పాలై ఆవేదనతో మిరప తోటలను దున్నేస్తున్నారు. రాష్ట్ర ఉద్యానశాఖ సూచనల మేరకు ఐసీఏఆర్కు చెందిన బెంగళూరులోని ‘భారత ఉద్యాన పరిశోధనా సంస్థ’(ఐఐహెచ్ఆర్) శాస్త్రవేత్తలు తెలంగాణలోని పలు జిల్లాల్లో తెగుళ్లు సోకిన మిరప తోటలపై అధ్యయనం చేశారు. ఈ తెగుళ్లకు ప్రధాన కారణం సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడమేనని వారు స్పష్టంచేశారు. వచ్చే ఏడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన అధికారులతో కలసి జాతీయ శాస్త్రవేత్తలు మిరప సాగుపై రైతులకు శిక్షణ ఇస్తామని ఉద్యానశాఖ రాష్ట్ర సంచాలకుడు ఎల్.వెంకట్రాంరెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు. నర్సరీలు పెట్టి మిరప నారు పెంచుతున్న వ్యాపారులకు కూడా శిక్షణ అవసరమని జాతీయ శాస్త్రవేత్తలు సిఫారసు చేశారని తెలిపారు. తెగుళ్ల నివారణకు వారు గుర్తించిన అంశాలపై ఐసీఏఆర్కు నివేదిక పంపారు.
నివేదికలో ముఖ్యాంశాలు...
* రాష్ట్రంలో మిరప ఆకు ముడతకు కారణమైన పురుగులు ఆగ్నేయాసియా దేశాల నుంచి వచ్చినవని అనుమానిస్తున్నారు. నిర్ధరణ కోసం నమూనాలు సేకరించి ‘జాతీయ వ్యవసాయ కీటక వనరుల పరిశోధనా మండలి’కి పంపారు. గత జూన్ నుంచి నవంబరు వరకు రాష్ట్రంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నమోదయ్యాయి. తెగుళ్లు సోకడానికి ఇవే ప్రధాన కారణం. దీనిపై శాస్త్రీయ అధ్యయనానికి వాతావరణ సమాచారాన్ని సమగ్రంగా ఐఐహెచ్ఆర్కు రాష్ట్ర ఉద్యానశాఖ పంపాలి.
* ప్రతి మిరపతోట చుట్టూ రెండు వరసల బంతి, సజ్జ, మొక్కజొన్న, జొన్న మొక్కల్లో ఏదో ఒకటి కచ్చితంగా రెండు వరసలు నాటాలి. మిరప నాటేందుకు 20 రోజుల ముందే వీటిని నాటాలి. కిలోకు 8 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ రసాయనంతో మిరప విత్తనాలను శుద్ధి చేశాకే నారు పెంచాలి. మిరప నాట్లు వేశాక 15 రోజులకు నేలలో ఎకరానికి 8 కిలోల చొప్పున ‘ఫిప్రోనిల్’ 10 జీ గుళికలను వేయాలి. వేప చెక్కను ఎకరానికి 250 కిలోలు వేయాలి. లీటరు నీటిలో 3 గ్రాముల కాపరాక్సీక్లోరైడ్ చొప్పున కలిపి మిరప చెట్టు వేళ్ల వద్ద వేయాలి. పది రోజుల దాకా నీరు పెట్టవద్దు. ప్రస్తుతం తోటలో తెగుళ్లు సోకిన కొమ్మలను కత్తిరించి తగులబెట్టాలి.
* మొక్కకు మొక్కకు మధ్య కనీసం 60 సెంటీమీటర్ల దూరం ఉండేలా నాట్లు వేయాలి. మొక్కలు ఏపుగా పెరుగుతాయని అధికంగా యూరియా వేస్తున్నారు. అలా వేయడం వల్ల పురుగులు, తెగుళ్లు అధికంగా సోకుతున్నాయి. భూసార పరీక్షలు చేయించి అవసరాన్ని బట్టి మాత్రమే యూరియా వేయాలి. మిరప నాట్లు వేసేముందు అదే పొలంలో జీలుగ, జనుము, పిల్లిపెసర వంటి పైర్లు వేసి మిరప నాట్లకు ముందు కలియదున్నితే భూమికి అవసరమైన పోషకాలు అందుతాయి. మిరపపొలాలకు కాల్వల ద్వారా నీరు పెట్టడం వల్ల అధిక తేమతో తెగుళ్లు సోకుతున్నాయి. బిందుసేద్యం విధానంలో నీరివ్వడం మంచిది. తెగుళ్లు సోకాయనే అనుమానంతో విపరీతంగా రసాయన పురుగుమందులు చల్లడం మానేయాలి.
* జింకు, బోరాన్, మాంగనీసు వంటి సూక్ష్మపోషకాలను రైతులు వాడటం లేదు. వీటిని కచ్చితంగా వినియోగించాలి.
* మిరప కోతలు కోసే ముందు కచ్చితంగా నెల ముందు నుంచే రసాయన పురుగుమందులు వాడకం ఆపివేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మత్తు దందాపై ఆబ్కారీ నిఘా..!
మత్తు దందాపై ఆబ్కారీశాఖ నిఘా తీవ్రతరం చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాదకద్రవ్యాల రవాణా ముఠాలు, సారా తయారీ స్థావరాలు, సుంకం చెల్లించని మద్యం విక్రయాలపై దాడులు ముమ్మరం చేసింది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ను జులై 8 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
నిర్మాణాల తొలగింపునకు ఆదేశాలిచ్చే పరిధి లోకాయుక్తకు లేదు: హైకోర్టు
ప్రైవేటు వ్యక్తులకు చెందిన నిర్మాణాలను తొలగించాలంటూ ఆదేశాలిచ్చే పరిధి లోకాయుక్తకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. -
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా.. కూర్చున్నా.. నిల్చున్నా.. మన నీడ వెన్నంటే ఉంటుంది కదా.. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మాత్రం అలా ఉండదు. -
సికింద్రాబాద్ నుంచి ఖుర్దారోడ్కు 10, 11 తేదీల్లో ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్ నుంచి ఒడిశాలోని ఖుర్దారోడ్ స్టేషన్కు రెండు రోజులపాటు రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. -
వేతనాల్లో వ్యత్యాసాలను సవరించాలి
గ్రూప్-1 పోస్టుల వేతనాల్లో వ్యత్యాసాలను సవరించాలని, ఆ పోస్టుల్లో పనిచేసే వారికి సమాన వేతనాలు ఇవ్వాలని తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను కోరింది. -
దేశంలోనే అత్యుత్తమ పంటల బీమా పథకం తెస్తాం
‘‘గడిచిన ఐదేళ్లుగా కేసీఆర్ అనుసరించిన విధానాలు రైతులకు అనుకూలంగా లేవు. కఠినతర నిబంధనలతో రైతులందరికీ పంటల బీమా వర్తించలేదు. -
కాంగ్రెస్ సామాజిక మాధ్యమ కార్యదర్శులపై.. కఠిన చర్యలు తీసుకోకుండా దిల్లీ పోలీసులను ఆదేశించండి
దిల్లీలో నమోదైన ఎఫ్ఐఆర్లో దర్యాప్తు పేరుతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) సామాజిక మాధ్యమ రాష్ట్ర కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకోకుండా దిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ పీసీసీ హైకోర్టును ఆశ్రయించింది. -
గౌరవెల్లి వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ నీటిపారుదల శాఖ కరీంనగర్ ఈఎన్సీకి గోదావరి బోర్డు మెంబర్ సెక్రటరీ అజిగేషన్ తాజాగా లేఖ రాశారు. -
దేవాదాయ భూములు కాపాడటానికి చర్యలు తీసుకోండి
దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. -
ఫారెస్ట్ సర్వీస్లో తెలుగువారి సత్తా
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి సత్తా చాటారు. -
నేడు.. రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ బుధవారం పేర్కొంది. -
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఐదోతరగతిలో ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్ ఇటీవల ముగిసింది. -
నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను ఈ నెల 9వ తేదీ (గురువారం) నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. -
దలైలామాకు పీవీ స్మారక పురస్కారం
ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ‘భారతరత్న పీవీ నరసింహారావు స్మారక పురస్కారా’న్ని అందించింది. -
ఇక త్వరత్వరగా ధాన్యం తూకం!
అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడుస్తుండటం.. లారీల కొరత, హమాలీల సమస్యతో రవాణాలో, తూకం వేయడంలో జాప్యమవుతున్న నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ దృష్టి సారించింది. -
నేనూ కేసీఆర్ బాధితుడినే!
తాను కేసీఆర్ బాధితుడినంటూ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు సంచలన విషయాలను వెల్లడించారు. -
రైతులెవరూ ఆందోళన చెందొద్దు..
ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. -
రాజధానిలో భారీ వర్షాలకు 14 మంది మృత్యువాత
రాజధాని నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో 14 మంది మృత్యువాతపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్