అభిషేక్‌ బోయిన్‌పల్లి మధ్యంతర బెయిల్‌ పొడిగింపు

దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్‌ బోయిన్‌పల్లి మధ్యంతర బెయిల్‌ను జులై 8 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 09 May 2024 03:57 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్‌ బోయిన్‌పల్లి మధ్యంతర బెయిల్‌ను జులై 8 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌దత్తలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన భార్య అనారోగ్యం కారణంగా కోర్టు మార్చి 20న తొలుత ఈయనకు 5 వారాల మధ్యంతర బెయిల్‌ ఇచ్చి ఏప్రిల్‌ 29కి తదుపరి విచారణను వాయిదా వేసింది. అయితే ఏప్రిల్‌ 18న అభిషేక్‌ తరఫు న్యాయవాదులు మళ్లీ ఈ కేసును ధర్మాసనం ముందుంచగా కోర్టు మధ్యంతర బెయిల్‌ను తదుపరి విచారణ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు చెబుతూ కేసును మే 7కు వాయిదా వేసింది. మరోసారి తదుపరి విచారణ జులై 8కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని