సంక్షిప్త వార్తలు (6)
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఐదోతరగతిలో ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్ ఇటీవల ముగిసింది.
ముగిసిన ఐదో తరగతి తొలివిడత కౌన్సెలింగ్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఐదోతరగతిలో ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్ ఇటీవల ముగిసింది. తొలివిడతలో దాదాపు 90 శాతానికి పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు సమాచారం. రాష్ట్రంలో 643 ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 51,924 సీట్లు ఉండగా, 1.13 లక్షల మంది విద్యార్థులు ప్రవేశపరీక్ష రాశారు. విద్యార్థికి ఏ పాఠశాలలో సీటు కేటాయిస్తున్నామో తెలియజేస్తూ ఎలాట్మెంట్ ఆర్డర్లను ఎస్సీ గురుకుల సొసైటీ ఇచ్చింది. తొలివిడత సీట్ల భర్తీ ముగిసిన వెంటనే మిగిలిన సీట్లకు రెండోవిడత ప్రవేశాలు నిర్వహించాలని సొసైటీ నిర్ణయించింది.
గవర్నర్కు కాగ్ నివేదిక అందజేత
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పద్దులపై ఆడిట్ నివేదికను కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్(కాగ్) కార్యాలయం అధికారులు బుధవారం గవర్నర్కు అందజేశారు. ఈ మేరకు కాగ్ ఒక ప్రకటనలో తెలిపింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ ఆదాయ, వ్యయాలు, బడ్జెట్పై ఆడిట్ నివేదికలను అందజేశారు.
ఈఏపీసెట్కు 91.67 శాతం హాజరు
ఈనాడు, హైదరాబాద్: టీఎస్ ఈఏపీసెట్కు రెండోరోజు బుధవారం 91.67 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన వ్యవసాయ, ఫార్మసీ పరీక్షకు మొత్తం 33,427 మందికి 30,641 మంది పరీక్షలు రాసినట్లు సెట్ కన్వీనర్ తెలిపారు.
నారాయణపూర్ నుంచి నీటి విడుదల
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని తాగునీటి అవసరాలకుగాను బుధవారం కర్ణాటకలోని నారాయణపూర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. కర్ణాటకలోని రాయిచూర్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రానికి ఒక టీఎంసీని విడుదల చేసిన ఆ రాష్ట్రం తెలంగాణకు ఇవ్వనున్న నీటిని విడతల వారీగా వదిలినట్లు ఇంజినీర్లు తెలిపారు. గురు, శుక్రవారాల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని జూరాల ప్రాజెక్టుకు ఈ నీరు చేరుకుంటుందని పేర్కొన్నారు.
ఇద్దరు ఎస్ఈలకు సీఈలుగా పదోన్నతులు
ఈనాడు, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో ఇద్దరు పర్యవేక్షక ఇంజినీర్లకు ముఖ్య ఇంజినీర్లుగా పదోన్నతి కల్పిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి ఎస్ఈ ఎ.మురళీధర్కు పదోన్నతి కల్పిస్తూ మంచిర్యాల సీఈగా నియమించారు. ఇక్కడి సీఈగా ఉన్న జి.శ్రీనివాస్ రెడ్డి ఇటీవల పదవీ విరమణ పొందడంతో ఖాళీ ఏర్పడింది. జగిత్యాల ఎస్ఈ జి.అశోక్కుమార్కు పదోన్నతి అనంతరం వరంగల్ సీఈగా నియమించారు. ఇక్కడ సీఈగా పనిచేసిన ఎం.విష్ణు ప్రసాద్ ఇటీవల పదవీ విరమణ పొందారు. ఇటీవల కార్యనిర్వాహక ఇంజినీర్ల పదవీ విరమణతో ఖాళీ అయిన ఎనిమిది పోస్టుల్లో అదనపు బాధ్యతలతో ఈఈలను నియమించారు.
మొక్కజొన్న సాగు విస్తరించాలి
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మొక్కజొన్నల సాగు పెరగాలని, వరి, పత్తిలకు ప్రత్యామ్నాయంగా దీన్ని ప్రోత్సహించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, లూథియానా భారత మొక్కజొన్న పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయ ఆవరణలో 67వ మొక్కజొన్న పరిశోధన కేంద్రాల వార్షిక సమావేశం బుధవారం ప్రారంభమైంది. 32 సంస్థల నుంచి 140 మంది మొక్కజొన్న శాస్త్రవేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. జాతీయ మొక్కజొన్న పరిశోధనల మండలి డైరెక్టర్ హెచ్ఎస్ జాట్, ఏడీసీ ప్రథాన్, సీనియర్ శాస్త్రవేత్త సైందాస్, విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు రఘురామిరెడ్డిలు ఈ సందర్భంగా ప్రసంగించారు. మొక్కజొన్న సాగుపై అన్నదాతల్లో చైతన్యం తేవాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మత్తు అనర్థాలపై అవగాహన: ఐఎంఏ
మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది. -
తగ్గిన గనులశాఖ ఆదాయం
రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. -
తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రెండు, మూడు నెలల్లో… బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ పనులు
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో లైన్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. -
థింపూలో ఏబీటీవో కార్యాలయం ప్రారంభం
భూటాన్ రాజధాని థింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది. -
29, 30 తేదీల్లో వనదేవతల గద్దెలకు తాళాలు
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. -
నేటి నుంచే ‘టెట్’
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభం కానుంది. జూన్ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్కు 99,958 మంది, రెండో పేపర్కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రారంభించింది. -
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. -
వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. -
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఎస్.మురళీధర్ అన్నారు. -
ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు
ములుగు జిల్లా వెంకటాపూర్లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. -
ఆధార్ అనుసంధానం కాకున్నా..‘డెత్ క్లెయిమ్’లు పరిష్కరించండి
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
మంత్రి మండలి సమావేశం నేడు
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..