MLC Eletions: ముగ్గురు తెరాస అభ్యర్థుల ఏకగ్రీవం!
తెలంగాణలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుధవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సాంకేతిక తప్పిదాల కారణంగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా చోట్ల తెరాస అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డిల ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. మరోవైపు మిగిలిన ఏడు జిల్లాల్లో పరిశీలన అనంతరం 71 నామినేషన్లు
కల్వకుంట్ల కవిత, శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డిల ఎన్నిక లాంఛనమే
ఏడు జిల్లాల్లో 71 మంది ‘స్థానిక ఎమ్మెల్సీ నామినేషన్ల’కు ఆమోదం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుధవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సాంకేతిక తప్పిదాల కారణంగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆయా చోట్ల తెరాస అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డిల ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. మరోవైపు మిగిలిన ఏడు జిల్లాల్లో పరిశీలన అనంతరం 71 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఈ నెల 26 వరకు ఉపసంహరణకు గడవు ఉంది. అనంతరం ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో డిసెంబర్ 10న పోలింగ్ జరుగుతుంది. 14న ఓట్లు లెక్కించి ఫలితాల్ని వెల్లడిస్తారు.
26న ఆ ముగ్గురికి ధ్రువీకరణ పత్రాలు..
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం తెరాస అభ్యర్థి కవిత నామినేషన్ వేయగా.. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ సైతం దాఖలు చేశారు. ఆయన సరైన ఫార్మాట్లో అఫిడవిట్ ఇవ్వకపోవడంతో నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ.. ఆయనను బలపరిచినట్లు పేర్లున్న ఎంపీటీసీ సభ్యులు నవనీత, మనోహర్, కార్పొరేటర్ రజియా సుల్తానా సైతం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లాలో శంభీపూర్ రాజు, పట్నం మహేందర్రెడ్డిలతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేసినా ఆయనకు మద్దతుగా ఎవరూ సంతకాలు చేయకపోవడంతో దాన్ని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన ఈ నెల 26న కవిత, శంభీపూర్ రాజు, మహేందర్రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. తెరాస అధిష్ఠానం ఆదేశాల మేరకు.. ఏడు జిల్లాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు శిబిరాలకు తరలివెళ్లారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ప్రత్యర్థులు ఉన్నచోట.. పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని తెరాస ఆదేశించింది.
మహబూబ్నగర్ తెరాస అభ్యర్థుల ఆస్తుల వివరాలు..
ఈనాడు డిజిటల్, మహబూబ్నగర్: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస తరఫున నామినేషన్లు వేసిన సిట్టింగులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి తమ ఆస్తుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిచారు.
కసిరెడ్డి నారాయణరెడ్డి : (భార్య మాధవిరెడ్డి పేరిట ఉన్నవి కలిపి) చరాస్తులు : రూ.13,00,88,841 ; స్థిరాస్తులు (మార్కెట్ విలువ) : రూ.23,73,82,520 ; అప్పులు : రూ.1,75,02,766.
కూచుకుళ్ల దామోదర్రెడ్డి : చరాస్తులు : రూ.1,20,19,712 ; స్థిరాస్తులు (మార్కెట్ విలువ) : రూ.2,51,00,000.
ఆ ఫిర్యాదుపై తక్షణం నివేదిక ఇవ్వండి: శశాంక్ గోయల్
రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలు చింపుల శైలజ ఫిర్యాదుపై గురువారం ఉదయంలోగా నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ను ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో పోటీకి నామినేషన్ వేసేందుకు వచ్చిన తన నుంచి తెరాస నాయకులు పత్రాలు లాక్కుని చించివేశారని శైలజ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణరెడ్డి గోయల్కు ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
నేలపైనే గూడు.. ఒకే భాగస్వామి తోడు..
కంటి చుట్టూ పసుపురంగు వలయంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ చిన్న పక్షి హైదరాబాద్లోని కాప్రా చెరువు వద్ద కనిపించింది. ‘‘ఇది ‘లిటిల్ రింగ్డ్ ప్లవర్’ (శాస్త్రీయనామం చరడ్రియస్ డుబియస్) జాతికి చెందిన పక్షి. -
రామయ్య హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 35 రోజులకు రూ.1,31,84,181 నగదు రూపంలో సమకూరింది. -
టెట్ సమస్యకు త్వరలో పరిష్కారం
ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియకు అడ్డంకిగా మారిన టెట్ అర్హత సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. -
టెట్ వాయిదా అంశాన్ని పరిశీలించండి
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నిక దృష్ట్యా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి సూచించారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్రమే
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
దండకారణ్యం ‘కోట’కు బీటలు!
మావోయిస్టుల కోట బీటలు వారుతోంది. ఇన్నాళ్లూ వారికి పెట్టనికోటగా ఉన్న ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం.. క్రమంగా భద్రతా బలగాల అధీనంలోకి వస్తోంది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
సంక్షిప్త వార్తలు
-
ఇదీ సంగతి!