Aryan Khan: ఆర్యన్కు బెయిలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు ఎట్టకేలకు కొంత ఊరట లభించింది. బెయిలు కోసం ఆయన చేసిన నిరీక్షణ ఫలించింది. ఎన్నెన్నో మలుపులు,
ఫలించిన షారుక్ తనయుడి నిరీక్షణ
డ్రగ్స్ కేసులో బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట
నేడో రేపో విడుదలయ్యే అవకాశం
అర్బాజ్, మున్మున్లకూ బెయిలు మంజూరు
ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్కు ఎట్టకేలకు కొంత ఊరట లభించింది. బెయిలు కోసం ఆయన చేసిన నిరీక్షణ ఫలించింది. ఎన్నెన్నో మలుపులు, వివాదాలతో ముందుకు సాగుతున్న ఈ కేసులో ఆర్యన్తో పాటు మరో ఇద్దరు నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచలకు బాంబే హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేసింది. ఇప్పటికే 25 రోజుల పాటు జైల్లో ఉన్న ఆర్యన్.. కోర్టు ఆదేశాల ప్రకారం లాంఛనాలన్నీ పూర్తిచేశాక శుక్రవారం లేదా శనివారం విడుదలయ్యే అవకాశాలున్నాయి. తాజా పరిణామంతో షారుక్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ముంబయి తీరంలోని నౌకలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటనకు సంబంధించి ఆర్యన్ సహా మొత్తం 20 మందిని ఎన్సీబీ ఈ నెల 3న అరెస్టు చేసింది. షారుక్ కుమారుడు ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఆర్యన్, అర్బాజ్, మున్మున్ల బెయిలు పిటిషన్లపై జస్టిస్ ఎన్.డబ్ల్యూ.సంబ్రే నేతృత్వంలోని ఏక సభ్య ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. తొలుత ఎన్సీబీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. 23 ఏళ్ల ఆర్యన్ గతంలో వాణిజ్య వినియోగ స్థాయిలో డ్రగ్స్ను సమీకరించినట్లు ఏ ప్రాతిపదికన చెబుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఆయన వాట్సప్ చాట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని సింగ్ పేర్కొన్నారు. నిందితుడి ఫోన్ నుంచి ఎన్సీబీ ఈ మేరకు ఆధారాలు సంపాదించిందన్నారు. నౌకలో 11 మంది మాదకద్రవ్యాలను వాడనున్నట్లు ఎన్సీబీకి సమాచారం అందిందని, వారిలో 8 మంది వద్ద డ్రగ్స్ దొరికాయని చెప్పారు. అర్బాజ్ వద్ద ఉన్న డ్రగ్స్నే ఆర్యన్ నౌకలో తీసుకుని ఉండేవారని పేర్కొన్నారు. వారిద్దరికీ మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులతో సంబంధాలున్నాయని బలంగా వాదించారు. ఆర్యన్ తరచూ డ్రగ్స్ వినియోగిస్తుంటారన్నారు. ప్రస్తుతం ఆయన విడుదలైతే సాక్షులను ప్రభావితం చేసే ముప్పుందని చెప్పారు. తమ అరెస్టు అక్రమమని నిందితులు ఇప్పుడు వాదించడంలో అర్థం లేదన్నారు. మేజిస్ట్రేటు కోర్టు ఇంతకుముందు ఎన్సీబీ కస్టడీకి అప్పగించినప్పుడే దానిపై వారు సవాలు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ‘డ్రై డే’గా పాటించే అక్టోబరు 2న నిందితులు ఇలాంటి విహార విందును ఏర్పాటుచేసుకోవాల్సింది కాదంటూ సింగ్ కాస్త చమత్కారంతో వ్యాఖ్యానించారు.
పూచీకత్తు ఉండాల్సిందే
అనంతరం ఆర్యన్ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తిరిగి వాదనలను వినిపించారు. నౌకలో ఉన్నవారిలో అర్బాజ్ తప్ప ఇతరులెవరూ ఆర్యన్కు తెలియదని చెప్పారు. డ్రగ్స్కు సంబంధించిన కుట్రలో ఆయన పాత్ర ఉన్నట్టు నిరూపించే సాక్ష్యాధారమేదీ లేదన్నారు. ఆపై జస్టిస్ సంబ్రే మధ్యలో కలుగజేసుకొని.. ‘‘ముగ్గురికీ బెయిలు మంజూరు చేస్తున్నా. సమగ్ర ఉత్తర్వులను రేపు (శుక్రవారం) సాయంత్రానికల్లా జారీ చేస్తా’’ అని పేర్కొన్నారు. డబ్బు చెల్లించి బెయిలు (క్యాష్ బెయిల్) తీసుకునేందుకు ఆర్యన్ తరఫు న్యాయవాదులు అనుమతి కోరగా.. న్యాయమూర్తి నిరాకరించారు. పూచీకత్తు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. బెయిలు మంజూరుకు షరతులను వివరిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేశాక, ఆ లాంఛనాలను పూర్తిచేస్తే.. ఆర్యన్ విడుదలవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..