బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చెయ్యొద్దు
బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలన్న కర్ణాటక వాదనను తెలంగాణ వ్యతిరేకించింది. 2013లో ట్రైబ్యునల్ తీర్పు వస్తే ఇప్పటివరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, సుప్రీంకోర్టు ఇచ్చే తుది
ప్రాజెక్టులు కట్టలేకపోతున్నామన్న కర్ణాటక వాదన అవాస్తవం
దాని అభ్యర్థనను తిరస్కరించండి
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ
కర్ణాటక మధ్యంతర పిటిషన్పై నేడు విచారణ
ఈనాడు హైదరాబాద్: బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేయాలన్న కర్ణాటక వాదనను తెలంగాణ వ్యతిరేకించింది. 2013లో ట్రైబ్యునల్ తీర్పు వస్తే ఇప్పటివరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని, సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి అమలుచేసేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కర్ణాటక ఈ నెల తొలివారంలో సర్వోన్నత న్యాయస్థానంలో మధ్యంతర పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో కర్ణాటక అభ్యర్థనను వ్యతిరేకిస్తూ కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్.. తాజాగా తెలంగాణ, మహారాష్ట్రలు అఫిడవిట్లు దాఖలు చేశాయి. కర్ణాటక వినతికి తెలంగాణ వ్యతిరేకత తెలపగా, మహారాష్ట్ర అనుకూలంగా స్పందించింది.
బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్ 2010లో అంతర్రాష్ట్ర జలవివాద చట్టంలోని సెక్షన్ 5(2) ప్రకారం మొదటి తీర్పు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే కోరగా, అభ్యంతరాలను ట్రైబ్యునల్కే చెప్పుకొనే వీలున్నందున దానిని వినియోగించుకోవాలంది. తర్వాత అవసరమైతే తమను ఆశ్రయించవచ్చంది. తదుపరి వాదనల అనంతరం 2013 నవంబరులో తుది తీర్పు ఇవ్వగా, దానిని వ్యతిరేకిస్తూ మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్.ఎల్.పి.) వేసింది. పునర్విభజన తర్వాత తెలంగాణ ఇందులో భాగస్వామి అయ్యింది. అప్పటి నుంచి ఈ ఎస్.ఎల్.పి.లు విచారణలో ఉండగా, తుది తీర్పునకు లోబడి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశించాలని కర్ణాటక మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
మా అవసరాలను పట్టించుకోలేదు: తెలంగాణ
కృష్ణా జలవివాద ట్రైబ్యునల్-1, 2 తెలంగాణ అవసరాలను పట్టించుకోలేదని, న్యాయపరంగా దక్కాల్సిన వాటాను రాబట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విఫలమైందని తెలంగాణ పేర్కొంది. బచావత్ ట్రైబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటకలకు చేసిన కేటాయింపులపై సమస్య లేదంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాదనలు జరుగుతున్నాయని తెలిపింది. కృష్ణా ట్రైబ్యునల్-2 ఇచ్చిన రెండు తీర్పులను వ్యతిరేకిస్తామని పేర్కొంది. 75 శాతం నీటి లభ్యత ప్రకారం కేటాయింపులు జరపడం వల్లే ఎగువన ప్రవాహాన్ని ఆపుతున్నారంది. ఆక్కడ ప్రాజెక్టులు నిండి, వినియోగం కూడా జరిగాకే దిగువకు వదులుతున్నారని తెలిపింది. కృష్ణా, తుంగభద్ర రెండు నదుల్లోనూ ఈ పరిస్థితి ఉందని పేర్కొంది. ఫలితంగా నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాల్లో తెలంగాణకు దైన్యస్థితి తప్పటం లేదని వివరించింది. మొదటి ట్రైబ్యునల్ 2130 టీఎంసీల నీటి లభ్యత తర్వాత క్యారీఓవర్ స్టోరేజికి అవకాశం కల్పించగా, ట్రైబ్యునల్-2 ఇందులో మార్పులు చేసిందని తెలంగాణ తెలిపింది. కర్ణాటక ఆలమట్టిలో 130 టీఎంసీల వినియోగానికి ట్రైబ్యునల్-2 తీర్పునకు ముందే ఏర్పాటు చేసుకొందని, గేటుపైన ప్లేటు పెట్టడమే మిగిలిందని, సింగటలూరు, అప్పర్తుంగ సహా అన్నిచోట్లా ఇదే పరిస్థితని పేర్కొంది. బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పును నోటిఫై చేయకపోవడంతో నీటి కేటాయింపుల ఆధారంగా ప్రాజెక్టులు కట్టుకోలేకపోతున్నామని కర్ణాటక పేర్కొనడం సత్యదూరమంది. వారి వాదన సరైంది కానందున పిటిషన్ను తిరస్కరించాలని కోరింది.
వినియోగానికి అనుమతించాలి: కర్ణాటక
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల అభ్యంతరాలపై తన సమాధానాలను కర్ణాటక తాజాగా సుప్రీంకోర్టుకు సమర్పించింది. తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నిరంతరం ప్రయత్నిస్తోందని పేర్కొంది. అప్పర్ కృష్ణాలో 2022 జూన్ నుంచి 75 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి అనుమతించాలని కోరింది. తుది తీర్పునకు లోబడి అది అమలై గెజిట్లో ప్రచురించేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్థించింది. ఎనిమిదేళ్లుగా కృష్ణా ట్రైబ్యునల్-2 తీర్పును అమలుచేయకపోవడం వల్ల కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోతున్నామని మహారాష్ట్ర పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!