ఛూమంతర్.. భూమాయ!
ఆకాశాన్నంటుతున్న భూముల విలువలు అవకాశవాదులకు రూ.కోట్లు కురిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు స్థిరాస్తి మోసాలు మామూలయ్యాయి. పోలీస్స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో 40 శాతం ఇలాంటివే ఉంటున్నాయి. ఏటా రూ.వందల కోట్లలో జరుగుతున్న ఈ తరహా మోసాలు ఎప్పటికప్పుడు కొత్త రూపు ధరిస్తున్నాయి
స్థిరాస్తి గాలం.. మొదటికే మోసం
మాయగాళ్ల లీలలు ఎన్నో
ఏటా రూ. వందల కోట్ల మేర వంచన
ఈనాడు - హైదరాబాద్
ఆకాశాన్నంటుతున్న భూముల విలువలు అవకాశవాదులకు రూ.కోట్లు కురిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు స్థిరాస్తి మోసాలు మామూలయ్యాయి. పోలీస్స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో 40 శాతం ఇలాంటివే ఉంటున్నాయి. ఏటా రూ.వందల కోట్లలో జరుగుతున్న ఈ తరహా మోసాలు ఎప్పటికప్పుడు కొత్త రూపు ధరిస్తున్నాయి. ఒకరిద్దరు స్థిరాస్తి వ్యాపారులు కలిసి ముందుగా ఎకరం భూమి నామమాత్రపు ధరకు కొంటారు. అందులో వాణిజ్య సముదాయం నిర్మిస్తానని పెట్టుబడులు ఆకర్షిస్తారు. నమ్మకం కలిగించేందుకు ఒక్కొక్కరికి అవిభాజ్య వాటాగా 30 గజాల చొప్పున ఒప్పంద పత్రం రాసిస్తారు. ఎకరాకు 4,840 గజాల స్థలం వస్తుంది. డెవలప్మెంట్కు వదలగా మిగిలిన 3,000 గజాల స్థలాన్ని 100 మందికి తలా 30 గజాలను రూ. 50 లక్షల చొప్పున అమ్ముతారు. అంటే రూ. 50 కోట్ల ఆర్జన. మరే వ్యాపారంలోనూ ఇంత కళ్లు చెదిరే సంపాదన ఉండదు! అనుమతులు వచ్చాక అభివృద్ధి పేరుతో వాటాలు కొన్న వారితో మళ్లీ ఒప్పందం చేసుకుంటారు.
లేని భూమి ఉన్నట్లు..: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో భూమి కొనుక్కోవడం సామాన్యులకు కలలా మారింది. ఇదే అదునుగా లేని భూమి ఉన్నట్లు నమ్మించి ఎడాపెడా అమ్మేస్తున్నారు. తీరా కొనుక్కున్నవారు స్థలం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు అసలు యజమానులు రంగంలోకి దిగుతున్నారు. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు చిరు వ్యాపారులను దళారులు ఇలానే బోల్తా కొట్టించారు. వారిద్దరూ చెరో వంద గజాలు కొనుక్కున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక స్థలానికి కంచె వేసుకునేందుకు వెళ్లగా అసలు బండారం బయటపడింది. ధ్రువపత్రాల్లో సర్వే నంబరు, స్థలం వివరాలు ఉన్నప్పటికీ వాస్తవంగా అక్కడ భూమి లేదు. దీంతో దళారులను నిలదీస్తే తమకేం సంబంధం లేదని చేతులెత్తేశారు.
వెంచర్ పేరుతో
స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాం.. పెట్టుబడి పెట్టండి. భారీగా లాభాలు వస్తాయంటూ కొందరు ప్రచారంతో ఊదరగొడుతుంటారు. భూమి కొనకముందే అన్ని అనుమతులూ వచ్చినట్లు నమ్మిస్తారు. అందమైన బ్రోచర్లు.. ఫ్లెక్సీలు తయారుచేస్తారు. తీరా పెట్టుబడి పెట్టాక అసలు విషయం తెలుస్తుంది. లాభం సంగతి దేవుడెరుగు పెట్టిన డబ్బు కూడా తిరిగిరాదు. ఈ మోసాలు ఏకంగా దేశం దాటిపోయాయి. కాంబోడియాలో రియల్ ఎస్టేట్ వెంచర్ పేరుతో హైదరాబాద్వాసి నుంచి రూ.4 కోట్లు కొల్లగొట్టిన ఉదంతంపై సీసీఎస్లో కేసు నమోదైంది. ఇటీవల సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావుదీ ఇదే తీరు.
ప్రీ లాంచింగ్ ఆఫర్
నిర్మాణం మొదలుకాకముందే కొనుక్కుంటే తక్కువ ధరకు ఇస్తామంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆశపడి డబ్బు కట్టిన వారికి ఆనక చుక్కలు చూపిస్తున్నారు. కొన్ని సంస్థలు సకాలంలో నిర్మాణం పూర్తి చేస్తున్నా మరికొందరు దీన్నో అవకాశంగా మలచుకొని అనుమతులు రాని వెంచర్లకూ డబ్బువసూలు చేస్తున్నారు. చెప్పిన సమయానికి పూర్తిచేయకుండా చుక్కలు చూపిస్తున్నారు.
డబుల్ రిజిస్ట్రేషన్లు
ఇప్పుడు ఒకే భూమిని ఇద్దరు ముగ్గురికి రిజిస్టర్ చేయడం మామూలైపోయింది. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఓ చిరుద్యోగి దాచిపెట్టుకున్న డబ్బుతో ఇటీవల 150 గజాల స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నించగానే మరో వ్యక్తి వచ్చాడు. ఆ స్థలం పదేళ్ల క్రితమే తాను కొనుక్కున్నట్లు చెబుతూపత్రాలన్నీ చూపించాడు. దాంతో బాధితుడు తమకు స్థలం అమ్మిన వ్యక్తిని నిలదీస్తే, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకొమ్మని అతడు బెదిరించాడు.
అన్నీ చూసుకోవలసిందే..
ఆస్తులు కొనే ముందు దస్త్రాలు, అనుమతులు, ఆస్తి వివరాల వంటివాటిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. లేకపోతే తిప్పలు తప్పవు. ఉదాహరణకు ఏదైనా లేఅవుట్లో ప్లాట్ కొంటుంటే దానికి పంచాయతీ, పురపాలక సంస్థల అనుమతి ఉందో, లేదో చూసుకోవాలి. అవసరమైతే ఆ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీయాలి. కొనే ఆస్తి ఏదయినా ప్రభుత్వం జారీ చేసిన నిషేధిత చట్టం పరిధిలో లేదని నిర్ధారించుకోవాలి. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ వివరాలు ఉంటాయి. లింకు డాక్యుమెంట్లు అన్నీ ముందుగానే తెప్పించుకొని చూసుకోవాలి. వాటిలో పేరు, ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు ఒకేలా ఉన్నాయో, లేవో పరిశీలించాలి. అమ్మకందారు వారసుల సమ్మతి తీసుకోవాలి. సదరు ఆస్తి తాకట్టులో లేదని నిర్ధారించుకోవాలి. ఇక జనరల్ పవరాఫ్ అటార్నీ వంటివి రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు అయిందో, లేదో తెలుసుకోవాలి. కొనే ముందే స్థలం సర్వే చేయించుకోవాలి. కొన్న వెంటనే సరిహద్దు రాళ్లు పాతించుకొని తరచూ వెళ్లి పరిశీలిస్తుండాలి.
నిర్మాణాల విషయంలో
* నగరం, శివార్లలో నిర్మాణాలకు సంబంధించి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి అనుమతి ఉందో లేదో నిర్ధారించుకోవాలి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ వెబ్సైట్లలో అనుమతి ఇచ్చిన ప్రాజెక్టుల వివరాలు పొందుపరుస్తున్నారు. సంబంధిత కార్యాలయంలో సంప్రదించి కూడా నిర్ధారించుకోవచ్చు.
* లేఅవుట్లు అయితే హెచ్ఎండీఏ/ డీటీసీపీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అనుమతి కోసం దరఖాస్తు చేశారా? అనుమతి వచ్చిందా అనేది నిర్ధారించుకోవాలి.
* జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చాక ప్రతి ప్రాజెక్టును స్థిరాస్తి నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (రెరా)లో రిజిస్టర్ చేయించాలి. అన్నీ పరిశీలించాక రెరా నంబరు కేటాయిస్తారు. కాబట్టి తెలంగాణ రెరా వెబ్సైట్లో ఈ ప్రాజెక్టుల గురించి తెలుసుకోవచ్చు.
నయావంచన-2
* ఇటీవల సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలానే ఓ స్థిరాస్తి వ్యాపారి భూయజమానితో జీపీఏ చేసుకొని రూ. 10 కోట్లకు కొన్న ఎకరం స్థలం మీద రూ. 150 కోట్లు రాబట్టాడు. దాంతో భూయజమానికి ఆశపుట్టింది. మధ్యలో ఎదురు తిరిగాడు. ఇద్దరి మధ్యా వివాదం మొదలైంది.పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
* ఇలాంటి వెంచర్లు రాజధాని చుట్టుపక్కల 150 వరకూ నడుస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీరు ప్రధానంగా ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!