రెండు భాగాలుగా ఒక్కో పాఠ్య పుస్తకం
రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం(2022-23) ఒక్కో సబ్జెక్టుకు రెండు పాఠ్య పుస్తకాలను ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం
ప్రభుత్వ తాజా నిర్ణయంతో బడి సంచి బరువు పెరగకుండా మార్గం
భాషా సబ్జెక్టులు తప్ప మిగిలినవి రెండుగా ముద్రణ
సర్కారు బడుల్లో విద్యార్థులకు పంపిణీ
విక్రయ పుస్తకాలు మాత్రం యథావిధిగానే
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం(2022-23) ఒక్కో సబ్జెక్టుకు రెండు పాఠ్య పుస్తకాలను ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. టర్మ్-1కు ఒక పుస్తకం, టర్మ్-2కు మరో పాఠ్య పుస్తకాన్ని పంపిణీ చేస్తారు. వచ్చే ఏడాది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కూడా ప్రవేశపెడుతున్న నేపథ్యంలో 1-7 తరగతుల విద్యార్థులకు సౌలభ్యంగా ఉండేందుకు ఒకే పాఠ్య పుస్తకం తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఉండాలని, ఒక వైపు తెలుగు, మరో వైపు ఆంగ్లం ఉండేలా ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రకరకాల పుస్తకాలు, మంచినీటి బాటిళ్లు, ఇతరత్రా సామగ్రితో బడి సంచి బరువు అధికంగా ఉంటోంది. ఈ విషయం సర్వేలోనూ స్పష్టమైంది. ఈ క్రమంలో తెలుగు, ఆంగ్లం రెండు భాషలతో పుస్తకాలను ముద్రించి ఇస్తే సంచి బరువు భారీగా పెరుగుతుందని, అది అంతిమంగా విద్యార్థుల శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని విద్యాశాఖ అంచనాకు వచ్చింది. ప్రస్తుతం 1-10 తరగతులకు పరీక్షలు కూడా సమ్మేటివ్ అసెస్మెంట్(ఎస్ఏ)-1, సమ్మేటివ్ అసెస్మెంట్-2 పేరిట జరుపుతున్నారు. కాకపోతే ఎస్ఏ-1కు సగం సిలబస్ ఉంటుంది. ఎస్ఏ-2కు మొత్తం సిలబస్తో పరీక్షలు జరుపుతారు. అదేవిధంగా ఎస్ఏ-1 సిలబస్కు ఒక పాఠ్య పుస్తకం, ఎస్ఏ-2కు మిగిలిన పాఠ్య ప్రణాళికతో మరో పుస్తకాన్ని టర్మ్-1, 2 పేరిట విద్యా శాఖ ముద్రించి ఇవ్వనుంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ)లో ఫైనల్ ప్రూఫ్ను సిద్ధం చేస్తున్నారు. అధికారులు తుది సీడీలను అప్పగిస్తే త్వరలోనే ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణా విభాగం పుస్తకాల ముద్రణ ప్రారంభించనుంది.
భాషేతర పుస్తకాలు మాత్రమే
ఒకటి, రెండు తరగతులకు తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులు, 3-5వ తరగతి వరకు వాటికి అదనంగా పరిశీలన విజ్ఞానం, గణితం సబ్జెక్టు ఉంటుంది. 6, 7 తరగతుల్లో తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు గణితం, జనరల్ సైన్స్, సాంఘికశాస్త్రం సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో భాషాపరమైన తెలుగు, ఆంగ్లం, హిందీ లాంటివి ఏ మాధ్యమం వారికైనా పుస్తకాలు ఒకటే. ఇక మిగిలిన సబ్జెక్టు పుస్తకాలను మాత్రమే రెండు మాధ్యమాల్లో, రెండు పుస్తకాలుగా ముద్రించి ఇస్తారు.
మరో 50 లక్షల పుస్తకాలు అధికం!
ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో 1-10 తరగతులు చదివే సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు 1.45 కోట్ల పాఠ్య పుస్తకాలను అందజేస్తున్నారు. ఇప్పుడు రెండు పుస్తకాల విధానం వల్ల 1-7 తరగతుల కోసం కనీసం మరో 50 లక్షలు పుస్తకాలను అధికంగా ముద్రించాల్సి ఉంటుంది. ఇక ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు వాటిని గతంలో మాదిరిగానే ముద్రిస్తారు. ప్రైవేట్లో ప్రస్తుతం 97 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే చదువుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్ల పాలనలో భాజపా ఎన్ని హామీలు అమలు చేసింది?: బండి సంజయ్కు మంత్రి పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..
-
భారత్ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు