శత్రువులకు వణుకు పుట్టించే ‘తారా’జువ్వలు..
నగరంలో డీఆర్డీవోకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ), డీఆర్డీఎల్ అభివృద్ధి చేసిన 5 సరికొత్త అస్త్రాల్ని రాజ్పథ్లో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్లో బుధవారం తొలిసారి
హైదరాబాద్ ఆర్సీఐ నుంచి 5 సరికొత్త అస్త్రాలు
రిపబ్లిక్ డే పరేడ్లో తొలిసారి ప్రదర్శన
ఈనాడు, హైదరాబాద్: నగరంలో డీఆర్డీవోకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్(ఆర్సీఐ), డీఆర్డీఎల్ అభివృద్ధి చేసిన 5 సరికొత్త అస్త్రాల్ని రాజ్పథ్లో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్లో బుధవారం తొలిసారి ప్రదర్శించారు. యుద్ధ విమానం నుంచి ప్రయోగించే వీటికి అస్త్ర, రుద్రం, సా, గౌరవ్, తారా అనే పేర్లు పెట్టారు. శత్రువుల గుండెల్లో మోగే పాంచ్ పటాకాలుగా వీటిని అభివర్ణిస్తున్నారు. అస్త్ర, రుద్రం క్షిపణుల రూపకల్పనలో హైదరాబాద్ మిసైల్ కాంప్లెక్స్లోని డీఆర్డీఎల్ కీలక పాత్ర పోషించగా.. సా, గౌరవ్, తారా అభివృద్ధిలో ఆర్సీఐ పాలుపంచుకుంది. వీటితో పాటు తేలికపాటి యుద్ధ విమానం తేజస్ సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపర్చే లక్ష్యంతో డీఆర్డీవో అభివృద్ధి చేసిన అధునాతన ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే(ఏఈఎస్ఏ) రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జామర్ను డీఆర్డీవో శకటంలో ప్రదర్శించారు.
పాంచ్ పటాకాల ప్రత్యేకతలు..
అస్త్ర: గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. తేజస్ యుద్ధ విమానం నుంచి ఇప్పటికే పలుమార్లు ప్రయోగాత్మకంగా పరీక్షించారు.
రుద్రం: కొత్తతరం యాంటీ రేడియేషన్ క్షిపణి. శత్రు రాడార్లను, కమ్యూనికేషన్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంది. 250 కి.మీ. పరిధి వరకు పనిచేస్తుంది. 5.5 మీటర్ల పొడవు ఉంటుంది. 60 కిలోల వార్హెడ్ను మోసుకెళుతుంది. 2020లో దీన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
సా: స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్. 100 కి.మీ. పరిధిలో శత్రువుల బంకర్లు, వైమానిక స్థావరాలను కూల్చేస్తుంది. 80 కిలోల బరువు ఉంటుంది. హక్-ఐ విమానం, సుఖోయ్ నుంచి గత ఏడాది విజయవంతంగా ప్రయోగించారు. భారత వైమానిక దళానికి అందజేశారు.
గౌరవ్: లాంగ్ రేంజ్ గైడెడ్ గ్లైడ్ బాంబ్. వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగలదు. 4 మీటర్ల పొడవు, వెయ్యి కిలోల బరువు ఉంటుంది. సుఖోయ్ యుద్ధ విమానం నుంచి గత ఏడాది విజయవంతంగా ప్రయోగించారు.
తారా: బంకర్ల వంటి లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు టాక్టికల్ అడ్వాన్స్ రేంజ్ అగ్మెంటేషన్(తారా) ఆయుధాన్ని ఆర్సీఐ అభివృద్ధి చేస్తోంది. దీనిపై ప్రస్తుతానికి ఇంతకుమించి వివరాలు వెల్లడించలేమని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ప్రశ్నించడమే నేరమా?.. 8 నెలల గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM