వంటింటి దినుసులతో ఒమిక్రాన్ నుంచి ఉపశమనం
రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. బాధితుల్లో అత్యధికులకు ఒమిక్రాన్ సోకుతోందని ఇటీవల ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఒమిక్రాన్లో ఎగువ శ్వాసకోశ సంబంధిత సాధారణ
సాధారణ లక్షణాలున్న వారికి ఆయుర్వేద చిట్కాలు
ఇంట్లోనే ఉంటూ కోలుకునే వెసులుబాటు
రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. బాధితుల్లో అత్యధికులకు ఒమిక్రాన్ సోకుతోందని ఇటీవల ప్రభుత్వ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఒమిక్రాన్లో ఎగువ శ్వాసకోశ సంబంధిత సాధారణ ఇబ్బందులే తలెత్తుతున్నాయి. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించడం లేదు. అధిక శాతం బాధితులు ఇంటి వద్దే కోలుకుంటున్నారు. ఇలాంటి వారు వంటింటి దినుసులను ఉపయోగించుకుని కూడా కొంత ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, గొంతులో గరగర, గొంతు నొప్పి తదితర సాధారణ సమస్యలను ఇంట్లో వాడే పదార్థాలతోనే సాంత్వన పొందొచ్చని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.ఉమాశ్రీనివాస్ తెలిపారు. 14 ఏళ్లు పైబడిన వారందరికీ ఈ వైద్యం ఉపయోగపడుతుందన్నారు. ఆ చిట్కాలు ఆయన మాటల్లోనే...
* జ్వరం, జలుబు, దగ్గు: అమృత (గుడూచి) ఆకులను దంచి రసాన్ని తీసి, టీస్పూన్ చొప్పున మూడు పూటలా తీసుకోవాలి. ఇలా అయిదు రోజులు చేస్తే.. జ్వరం, గొంతు నొప్పి తగ్గుతాయి. లేదా మహాలక్ష్మి విలాసరస్, లక్ష్మి విలాసరస్ మాత్రలు ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున 5 రోజులపాటు వేసుకోవచ్చు.
* దగ్గు: నాలుగు మిరియాలు దంచి తులసి ఆకుల రసంలో కలిపి ఉదయం, సాయంత్రం టీ స్పూన్ వంతున నాలుగు రోజులు తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. గొంతునొప్పి పోవాలంటే పాలల్లో 5-6 గ్రాముల మిరియాల పొడి వేసి 5-7 రోజులపాటు తాగాలి.
* తలనొప్పి: శొంఠి అరగదీసి కణతలపై ఉదయం, సాయంత్రం పూసుకోవాలి.
* జలుబు, దగ్గు: పుదీనా ఆకు, తమలపాకుల రసం తీసి ఉదయం, సాయంత్రం టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. దీంతో పాటు ఒక లవంగ మొగ్గను నోట్లో వేసుకొని చప్పరించాలి.
* గొంతు నొప్పి: త్రిఫల చూర్ణాన్ని టీ స్పూన్ వంతున గ్లాసుడు గోరు వెచ్చటి నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం పుక్కిలించాలి.
పొడి దగ్గు: కరక్కాయ ముక్కను నోట్లో పెట్టుకొని రసం వచ్చేలా చప్పరిస్తూ ఉండాలి. ఇలా 3-5 రోజుల పాటు చేయాలి.
* మొండి దగ్గు: వాస (అడ్డసరం)ఆకు రసం తీసి టీ స్పూన్ వంతున ఉదయం, సాయంత్రం 5 రోజులపాటు తీసుకోవాలి.
* గొంతు గరగర: చిటికెడు పచ్చి పసుపును వేడి పాలలో వేసుకొని తాగాలి.
* ఇవి కాకుండా మహా సుదర్శన మాత్రలను ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున 5 రోజులు తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. చిత్రక హరిత లేహ్యం చెంచా వంతున ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు నుంచి బయట పడవచ్చు.
* సాధారణ లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఈ చిట్కాల్లో అందుబాటులో ఉన్నవి ఎంచుకుని వినియోగించవచ్చు. తీవ్రమైన లక్షణాలతో పాటు ఆక్సిజన్ తగ్గిపోవడం, అయిదు రోజులు దాటినా తగ్గని జ్వరం, తీవ్ర నీరసం, వాంతులు, విరేచనాలు, అపస్మారక స్థితి, పల్స్ తగ్గడం లాంటి లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే ఆసుపత్రిలో చేరాలి.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన జ్యుడిషియల్ విచారణలో భాగంగా నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెలలో మొదటి దఫా పర్యటన సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ అధికారులతో పలుమార్లు సమావేశమయ్యారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
పగలు నిప్పులు.. సాయంత్రం పిడుగులు
భరించలేని ఎండలు ఒకవైపు.. ఈదురుగాలులతో కూడిన వర్షాలు మరోవైపు. రాష్ట్రంలో ఆదివారం భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆరు జిల్లాల్లోని 15 మండలాలు ఎండల తీవ్రతతో ఉడికిపోయాయి. -
పనికెళ్లలేక.. పడుకోలేక..
వేసవి ఎండలు పగలే కాదు.. రాత్రుళ్లు కూడా ‘చెమట’ చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా.. ఫ్యాన్లు, కూలర్లు ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరవుతోంది. -
ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ అవసరం లేదు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ మండలి(ఎన్సీటీఈ) పంపిన వివరణ లేఖను వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేనపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేశాయి. -
రేపటిలోగా పంట నష్టపరిహారం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో గత మార్చి 16 నుంచి 24 వరకు కురిసిన వడగళ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారాన్ని మంగళవారంలోపు వారి ఖాతాల్లో జమ చేయాలని వ్యవసాయ శాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని మొదటి ఈఎంఈ సెంటర్లో జూన్ 20 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రజారోగ్యశాఖ ఈఎన్సీగా జియాఉద్దీన్
రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)గా జియాఉద్దీన్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్.శ్రీధర్ ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియాఉద్దీన్ను ప్రభుత్వం ఆదేశించింది. -
యాదాద్రికి పోటెత్తిన భక్తజనం
అసలే వేసవి సెలవులు.. ఆపై ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో క్షేత్ర పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. -
వాగులు, వంకలు దాటి.. ఓటు వేయించి
మంచిర్యాల జిల్లా పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమనపల్లి మండలంలో ఆరు గ్రామాల్లోని ఏడుగురు వయోవృద్ధులతో ఆదివారం మండుటెండలో ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియను అధికారులు పూర్తిచేశారు. -
నందిపాడు పరిసరాల్లో చిరుతపులి మృతి
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నందిపాడు-చింతల్కుంట గ్రామాల మధ్య ఉన్న ఓ వ్యవసాయ పొలంలో చిరుతపులి కళేబరం కనిపించింది. -
ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల జాప్యంపై స్పష్టత ఇవ్వండి
ఆర్టీసీ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదో యాజమాన్యం వివరణ ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్ చేశారు. -
వడదెబ్బ నివారణకు ఎన్సీడీసీ మార్గదర్శకాలు పాటించండి
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నందున.. కార్మికులకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఈఎస్ఐ ఆసుపత్రులను ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఆదేశించింది. -
ముగిసిన నీట్-యూజీ పరీక్ష
నీట్-యూజీ ఎంబీబీఎస్ ప్రవేశపరీక్ష ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉన్నట్లు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నీట్-యూజీ ప్రవేశపరీక్ష ఆదివారం ముగిసింది. -
బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
వేసవిలో ఉద్యానపంటలపై రైతులకు అవగాహన
వేసవిలో ఉద్యానపంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానవన సంచాలకుడు కె.అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!