సామాన్యులెవరూ క్రిప్టో జోలికి వెళ్లొద్దు
సామాన్యులెవరూ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడి పెట్టవద్దని రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ రామసుబ్రమణియమ్ గాంధీ సూచించారు. వాటి విలువల్లో వచ్చే ఆటుపోట్లతో కలిగే నష్టాలను వారు తట్టుకోలేరని ఆయన అన్నారు. ‘‘క్రిప్టోలపై ప్రజలు సంపాదించిన
వాటివల్ల వచ్చే నష్టాలను భరించడం కష్టం
కేంద్రం తీసుకురాబోతున్న డిజిటల్ కరెన్సీతో ఎన్నో ప్రయోజనాలు
ఈనాడు, ఈటీవీ భారత్ ఇంటర్వ్యూలో రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ రామసుబ్రమణియమ్ గాంధీ
ఎన్. విశ్వప్రసాద్
ఈనాడు - హైదరాబాద్
క్రిప్టోల ద్వారా త్వరగా ధనికులం కావొచ్చని ఎవరైనా దీనిలోకి దిగితే వారు జూదానికి సిద్ధపడినట్లే. ఇందులో సొమ్ములు పెట్టాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. నష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి చాలా ముఖ్యం. వాటిని భరిస్తూనే జీవితాన్ని సాఫీగా గడపగలగాలి. బాగా ఆస్తులు, విపరీతమైన ఆదాయాలు ఉన్నవారికే ఇది సాధ్యం.
సామాన్యులెవరూ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడి పెట్టవద్దని రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ రామసుబ్రమణియమ్ గాంధీ సూచించారు. వాటి విలువల్లో వచ్చే ఆటుపోట్లతో కలిగే నష్టాలను వారు తట్టుకోలేరని ఆయన అన్నారు. ‘‘క్రిప్టోలపై ప్రజలు సంపాదించిన ఆదాయంపై వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను విధించనున్నట్లు బడ్జెట్ ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. దీని అర్థం ఈ వాణిజ్యానికి ప్రభుత్వం చట్టపరంగా ఆమోదం తెలిపినట్లే. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులకే ఇది పరిమితం. వస్తువుల కొనుగోలుకు మారకద్రవ్యంగా వాటిని వాడరాదని ప్రజలు గుర్తించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ద్వారా తీసుకురాబోతున్న డిజిటల్ కరెన్సీ చాలా ఉపయోగకరమని అన్నారు. క్రిప్టోలపై వచ్చే ఆదాయాలపై పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన ఈనాడు, ఈటీవీ భారత్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
ఈ మధ్య క్రిప్టో యాప్లను డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రకటనను ఎలా చూడాలి?
క్రిప్టోలపై పన్ను వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం అంటే ఈ కరెన్సీ క్రయవిక్రయాలు చట్టవ్యతిరేకం కాదని అర్థం. ఈ వ్యవహారాలను ఆమోదిస్తున్నట్లు ప్రత్యక్షంగా ప్రకటించడమే. అయితే క్రిప్టో కరెన్సీల, ఆస్తుల కొనుగోళ్లు.. అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను వేసేవరకే కేంద్ర నిర్ణయం పరిమితంగా వర్తిస్తుంది. అంతేకాని క్రిప్టోను ఇతర సరకుల కొనుగోలుకు ఒక కరెన్సీగా, ఒక చెల్లింపు సాధనంగా ఉపయోగించడాన్ని ప్రభుత్వం అనుమతించలేదు. కేంద్ర నిర్ణయాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అలాగే క్రిప్టో యాప్ల డౌన్లోడ్లు పెరిగాయనడానికి ఆధారంగా ఎలాంటి గణాంకాలూ లేవు. ప్రభుత్వ ప్రకటన వల్ల వెంటనే పెద్ద మార్పులు వస్తాయని నేను అనుకోవడంలేదు.
తాజా పరిణామాలతో ద్రవ్యపరమైన విధానాల విషయంలో రిజర్వు బ్యాంకుకు ఉన్న విశేషాధికారాలపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు?
క్రిప్టోను వస్తువుల కొనుగోళ్లకు ఒక చెల్లింపు సాధనంగా అనుమతిస్తే దేశ ద్రవ్య సుస్థిరతపై తప్పకుండా ప్రభావం చూపుతుంది.
అప్పుడు ఉత్పన్నమయ్యే పర్యవసానాలు ఏమిటి?
ప్రధాన స్రవంతిలోని ఖాతాలతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా వసూళ్లు, చెల్లింపులు జరిగితే దేశ ద్రవ్యవిధానాన్ని నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులుంటాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో.. ద్రవ్య సరఫరాను పర్యవేక్షించడంలో రిజర్వు బ్యాంకుకు ఉండే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది.
ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వచ్చాక ఆర్థికపరమైన, ద్రవ్యపరమైన స్థిరత్వాన్ని కాపాడటంలో కేంద్రానికి, ఆర్బీఐకి ఎరురయ్యే సమస్యలేంటి.?
చట్టపరంగా గుర్తింపు ఉందని.. దీంతో మనం ఏదైనా చేయవచ్చు అనే అపోహ ప్రజల్లోకి వెళ్తే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. అందుకే క్రిప్టోను ఒక మారకద్రవ్యంగా మన దేశంలో అనుమతించరాదని రిజర్వుబ్యాంకు తన అభిప్రాయాన్ని పదేపదే ప్రకటిస్తోంది.
ప్రస్తుత పరిణామాలతో అతి త్వరగా డబ్బులు సంపాదించాలనే మనస్తత్వం ప్రజల్లో పెరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు.?
క్రిప్టోలకు సంబంధించి అత్యంత ప్రతికూల అంశం ఏమిటంటే వాటి విలువల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులుంటాయి. గత నెలలో వచ్చిన మార్పులనే చూస్తే... బిట్ కాయిన్ విలువ ఒకసారి 42 వేల డాలర్ల నుంచి 35 వేల డాలర్లకు పడింది. మళ్లీ 44 వేల డాలర్లకు పెరిగింది. తర్వాత మళ్లీ పడింది. ఈ తరహా హెచ్చుతగ్గులు ఏమాత్రం మంచివికాదు. సాధారణ ప్రజలు వీటిని తట్టుకోలేరు.
ఇతర దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
అనేక దేశాల్లో ప్రభుత్వాలు, కేంద్రీయ బ్యాంకులు అధికారిక డిజిటల్ కరెన్సీని తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలకు మూలాధారమైన బ్లాక్చెయిన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ఇది. ఈ సాంకేతికత భద్రత పరంగా ఉన్నతమైంది. ప్రపంచంలోని ప్రభుత్వాలు ఈ సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకుంటే దానివల్ల ప్రయోజనాలను పొందవచ్చు.
డిజిటల్ కరెన్సీ రూపురేఖలు ఎలా ఉంటాయి?
దీనికి భౌతిక రూపం ఉండదు. అంతా ఆన్లైన్ వ్యవహారమే. ఉదాహరణకు ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి మరొకరికి చెల్లింపులు జరిపితే ఆ నగదు ఆ వ్యక్తి ఖాతాలో జమవుతుంది. డిజిటల్ కరెన్సీ చెల్లింపుల్లో బ్యాంకుల ప్రమేయముండదు. మనం ఆర్బీఐ నుంచి రానున్న డిజిటల్ కరెన్సీ తీసుకుంటే మామూలు కరెన్సీ మాదిరే ఆన్లైన్ ద్వారా ఎవరికికావాలంటే వారికి నేరుగా పంపొచ్చు.
భారత్ త్వరలోనే డిజిటల్ కరెన్సీని తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవలి బడ్జెట్లో ప్రకటించారు. దీని మంచి చెడుల గురించి మీరేం చెబుతారు?
ఇప్పుడే ఏమీ చెప్పలేం. ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడులు పెడితే లాభాలు పొందవచ్చనే అభిప్రాయం ఈరోజు ప్రపంచం అంతా ఉంది. ప్రభుత్వ అధికారిక డిజిటల్ కరెన్సీవల్ల సొంత దేశంలో ఏ వ్యక్తీ అలాంటి ప్రయోజనాలను పొందలేడు. విలువ సాధారణ కరెన్సీతో సమానంగానే ఉంటుంది. అందువల్ల మన పౌరులు తమ నగదును డిజిటల్ కరెన్సీలోకి మార్చుకున్నంత మాత్రాన లాభాలను పొందలేరు.
* అధికారిక డిజిటల్ కరెన్సీ వస్తే ప్రజలకు సౌకర్యవంతమైన ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. కాగితపు కరెన్సీని కానీ, ఇప్పుడు వాడే ఈ వాలెట్స్ను కూడా ప్రజలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఈ వాలెట్స్కు ఉన్న భద్రత కంటే ఎక్కువ భద్రత డిజిటల్ కరెన్సీకి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!