Telangana News: ఒకే రోజు పెట్టుబడులు రూ.3,315 కోట్లు
అమెరికాలోని అంతర్జాతీయ జీవశాస్త్రాలు, ఔషధ రంగాలకు చెందిన నాలుగు సంస్థలు తెలంగాణలో పరిశ్రమల స్థాపన, విస్తరణకు ముందుకొచ్చాయి. ఒకే రోజు రాష్ట్రానికి రూ.3,315 కోట్ల
నాలుగు సంస్థల నిర్ణయం
ముగిసిన కేటీఆర్ అమెరికా పర్యటన
ఈనాడు, హైదరాబాద్: అమెరికాలోని అంతర్జాతీయ జీవశాస్త్రాలు, ఔషధ రంగాలకు చెందిన నాలుగు సంస్థలు తెలంగాణలో పరిశ్రమల స్థాపన, విస్తరణకు ముందుకొచ్చాయి. ఒకే రోజు రాష్ట్రానికి రూ.3,315 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అడ్వెంట్ ఇంటర్నేషనల్, స్లేబ్యాక్ ఫార్మా, యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకోపియా, క్యూరియా గ్లోబల్ సంస్థల ప్రతినిధులతో అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. ముందుగా న్యూయార్క్లో ప్రముఖ ప్రైవేటు ఈక్విటీ సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ మేనేజింగ్ పార్టనర్ జాన్ మాల్డోనాడోతో భేటీ అయ్యారు. 1984లో ఏర్పాటైన తమ సంస్థ 42 దేశాల్లో ఆరోగ్య, ఆర్థిక, రిటైల్, పారిశ్రామిక, టెక్నాలజీ రంగాల్లో రూ.4.60 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిందని మాల్డోనాడో తెలిపారు. తెలంగాణలో అనుకూలతల దృష్ట్యా ఇక్కడ భారీ పెట్టుబడులకు నిర్ణయించామన్నారు. హైదరాబాద్లోని ఆర్ఏ కెమ్ ఔషధ సంస్థ, అవ్రా ల్యాబొరేటరీలో రూ.1,750 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ఈ రెండు కంపెనీలకు ఆరు తయారీ యూనిట్లు, మూడు పరిశోధన కేంద్రాలుండగా 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, తమ పెట్టుబడుల ద్వారా ఆయా సంస్థల విస్తరణతో పాటు ఉపాధి రెట్టింపవుతుందన్నారు.
స్లేబ్యాక్ ఫార్మా రూ.1,500 కోట్లు
అనంతరం మంత్రితో స్లేబ్యాక్ ఫార్మా వ్యవస్థాపకులు, సీఈవో అజయ్సింగ్ భేటీ అయ్యారు. న్యూజెర్సీ కేంద్రంగా గల తమ సంస్థ హైడ్రాక్సీప్రొజెస్టెరాన్ తదితర జనరిక్ ఔషధాల తయారీలో అగ్రస్థానంలో ఉందని చెప్పారు. హైదరాబాద్లో వచ్చే మూడేళ్లలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. సీజీఎంపీ ల్యాబ్తో పాటు అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. గడిచిన అయిదేళ్లలో హైదరాబాద్ ఫార్మాలో తమ సంస్థ రూ. 2,300 కోట్ల పెట్టుబడులతో మూడు యూనిట్లు స్థాపించిందని, 106 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, కొత్త పెట్టుబడుల ద్వారా వెయ్యిమందికి ఉపాధి లభిస్తుందన్నారు. ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ యూఎస్ ఫార్మాకోపియా ముఖ్య ఆర్థిక అధికారి స్టాన్ బుర్హాన్స్, సీనియర్ ఉపాధ్యక్షుడు రీజియన్స్, వ్యూహ, నిర్వహణ అధికారి కేవీ సురేంద్రనాథ్లు మంత్రి కేటీఆర్ను కలిశారు. జినోమ్వ్యాలీలో రూ.15 కోట్లతో నిరంతర ఔషధ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఉన్నారు.
నేడు హైదరాబాద్కు పయనం
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ఆదివారంతో ముగిసింది. ఆయన సోమవారం తెల్లవారుజామున బయల్దేరి మంగళవారం హైదరాబాద్కు చేరుకోనున్నారు.
రూ. 50 కోట్లతో ‘క్యూరియా’ విస్తరణ
న్యూయార్క్ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ గత ఏడాది హైదరాబాద్లో క్యూరియా గ్లోబల్ షేర్డ్ సర్వీసెస్ సెంటర్ను ఏర్పాటు చేసిందని, దానిని రూ.50 కోట్లతో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్తో సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు, సీఐవో ప్రకాశ్పాండియన్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ 115 మంది ఉద్యోగులుండగా.. విస్తరణ ద్వారా మరో 100 మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా కేటీ రామారావు నాలుగు సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కొత్త పరిశ్రమల స్థాపనతో పాటు విస్తరణకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపారు. ఈ సంస్థల ద్వారా రాష్ట్ర ఔషధ, జీవశాస్త్రాల రంగం మరింత పురోగమిస్తుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.