దూదిని.. పూలపాన్పు చేయాలని!
రాష్ట్రంలో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. ఈ వానాకాలం(ఖరీఫ్) సీజన్లో కోటీ 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. అందులో 70 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగయ్యేలా చూడాలని ఆ శాఖ లక్ష్యంగా
పత్తి సాగుపై రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రచారం
70 లక్షల ఎకరాలకుపైగా పెంపునకు యోచన
ఎర్రచెలక నేలల్లో ఉత్పాదకత తక్కువ ఉందన్న కేంద్రం
తెలంగాణలో మూడేళ్లలో హెక్టారుకు పండిన సగటు పత్తి 5 క్వింటాళ్లే..
ఈనాడు, హైదరాబాద్
రాష్ట్రంలో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. ఈ వానాకాలం(ఖరీఫ్) సీజన్లో కోటీ 30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. అందులో 70 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగయ్యేలా చూడాలని ఆ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న కారణంగా ఈ పంటనే సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆ శాఖ యోచిస్తోంది.
తెలంగాణలోని ఎర్రచెలక, దుబ్బనేలల్లో పత్తి దిగుబడి తక్కువగా ఉంటోందని, దీన్ని పెంచడంపై దృష్టి సారించాలని కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్రానికి తాజాగా సూచించింది. రాష్ట్రంలో గత మూడేళ్ల(2019-22)లో సాగైన పత్తి విస్తీర్ణం, దిగుబడి, హెక్టారుకు సాధించిన సగటు దిగుబడి ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నట్లు కేంద్రం పేర్కొంది. దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో పంజాబ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో హెక్టారుకు సగటున 585 కిలోల(5.85 క్వింటాళ్ల) దూది పంట పండగా.. తెలంగాణలో 500 కిలోలు మాత్రమే వచ్చిందని వెల్లడించింది. తెలంగాణలో ఆదిలాబాద్ వంటి కొన్ని ప్రాంతాల్లో అనుకూల వాతావరణం, అనువైన భూములు ఉండటంతో కొందరు రైతులు హెక్టారుకు 25 నుంచి 30 క్వింటాళ్ల పత్తి పండిస్తున్నారు. ఎర్రచెలక నేలలు ఉన్న నల్గొండ, మహబూబ్నగర్, నారాయణపేట వంటి ప్రాంతాల్లో హెక్టారుకు 5 క్వింటాళ్లకు మించి ఉత్పాదకత రావడం లేదు. దీనివల్ల రాష్ట్రంలో సగటు ఉత్పాదకత చాలా తక్కువగా.. అంటే హెక్టారుకు 5 క్వింటాళ్లే నమోదైంది. గతేడాది రాష్ట్రంలో 47 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగయితే వ్యవసాయ మార్కెట్లకు 45 లక్షల క్వింటాళ్లకు మించి రాలేదు. గత సంవత్సరం అధిక వర్షాలు, తెగుళ్లు పంటను బాగా దెబ్బతీశాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా అకాల వర్షాలు, తుపాన్లు, రసం పీల్చు పురుగు తదితర కారణాల వల్ల ఉత్పాదకత తగ్గుతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వివరించింది.
కొత్త పద్ధతులతో అధిక దిగుబడి
- డాక్టర్ జగదీశ్వర్, పరిశోధనా సంచాలకుడు, ఆచార్య జయశంకర్ వర్సిటీ
తెలంగాణలో పత్తి సాగుకు అనువైన భూములు, అనుకూల వాతావరణం ఉంది. ఎర్రచెలక, దుబ్బనేలల్లో వర్షాలపై ఆధారపడి ఈ పంటను సాగుచేస్తే తక్కువ దిగుబడి వస్తున్నట్లు గుర్తించాం. ఇలాంటి నేలల్లో అధిక సాంద్రత విధానంలో సాగుచేస్తే దిగుబడి పెరుగుతుంది. సాధారణ పద్ధతిలో ఎకరానికి 7,500 పత్తి మొక్కలు వేస్తే.. అధిక సాంద్రత విధానంలో 25వేల మొక్కల దాకా వేయాలి. దీనివల్ల ఎక్కువ పత్తి చెట్ల నుంచి ఎక్కువ దూది వచ్చి సగటు దిగుబడి పెరుగుతుంది. సాగు పద్ధతులు మార్చి ఆధునిక పరిజ్ఞానంతో యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి పెరిగే అవకాశముంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
అనుమానం వచ్చిందంటే..ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్!
ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో.. ప్రయాణికుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ పెద్దసంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతోంది. -
మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమెవరు?.. వివరాలు కోరిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి బాధ్యులు.. నిర్మాణ సంస్థ ‘ఎల్అండ్టీ’నా లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అనేది నిర్ధారించాల్సిన పరిస్థితి నీటిపారుదల శాఖకు వచ్చింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల
ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్ అవార్డులు ప్రదానం చేశారు. -
అమెరికాలో హనుమకొండ విద్యార్థి అదృశ్యం
అమెరికాలో చదువుకుంటున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి కొద్ది రోజుల క్రితం షికాగోలో అదృశ్యమయ్యాడు. -
ఎర్రని ఎండ.. కానరాని నీడ
‘శూన్య నీడ దినం’ సందర్భంగా హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం 12:12 గంటలకు నడినెత్తిన సూర్యుడున్నా కాసేపు ‘నీడ’ మాయమైంది. దీన్ని వీక్షించేందుకు బీఎం బిర్లా సైన్స్ సెంటర్లోని నక్షత్రశాల (ప్లానెటోరియం) ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
వాతావరణ సూచనలు ఐదు దిక్కుల్లో..
ఇన్నాళ్లూ ఉత్తర తెలంగాణకు వర్ష సూచన అంటే.. ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ వరకు వానలు పడొచ్చని భావించేవారు. -
మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలి: ఐకార్ డీడీజీ శర్మ
వరి, పత్తిలతో సమానంగా మొక్కజొన్న దేశ ప్రధాన పంటగా మారాలని, అధిక ఉత్పత్తినిచ్చే నూతన వంగడాలను శాస్త్రవేత్తలు సృష్టించాలని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ పిలుపునిచ్చారు. -
ఓటేస్తే కన్సల్టేషన్, వైద్య పరీక్షల్లో రాయితీ
ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొచ్చాయి. -
పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి: యూఎస్పీసీ
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికే పాఠశాలల్లో విద్యావాలంటీర్లను, పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఉచిత విద్యుత్తు అమలు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. -
‘బ్యారేజీ’ పేరుతో.. ‘డ్యాం’ నిర్మాణం జరుగుతున్నట్లు ముందే తెలుసా?
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్లను జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
ఉత్తమ పర్యావరణ వీడియోలకు ఆహ్వానం: పీసీబీ
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వీడియోలను పంపాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కోరింది. -
పాడి రైతులకు బిల్లులు చెల్లించాలి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయడెయిరీ)కి పాలను విక్రయిస్తున్న రైతులు గత 40 రోజులుగా బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని పలు పాడి ఉత్పత్తిదారుల సంఘాల నేతలు సమాఖ్య ఎండీ చిట్టెం లక్ష్మిని కోరారు. -
ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీఎస్ఈఏపీసెట్-2024లో గురువారం మూడో రోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. -
అమిత్షా నకిలీ వీడియో కేసు.. తెలంగాణకే పరిమితం కాదు
కేంద్ర హోంమంత్రి అమిత్షా నకిలీ వీడియోకు సంబంధించిన కేసు కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశం నలుమూలలా వ్యాపించిందని దిల్లీ పోలీసులు గురువారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. -
ఆ పురుగుల మందుపై నిషేధం
టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్కు చెందిన ట్రైకో డెర్మా విరిడి 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ క్రిమిసంహారక మందును నిషేధించినట్లు వ్యవసాయ సంచాలకుడు బి.గోపి గురువారం తెలిపారు. -
లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయిలు రూ.477.34 కోట్లు
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంపుహౌస్ విద్యుత్తు బకాయి పెరుగుతూ వస్తోంది. 2019లో నాటి సీఎం కేసీఆర్ లక్ష్మీ పంపుహౌస్ను ప్రారంభించగా 2022 జులై వరకు గోదావరి జలాలను ఎత్తిపోశారు.