నాణ్యతకు తెలంగాణ పెద్దపీట
సమీకృత శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) అమలు కోసం పంపిణీచేసే వివిధ వస్తువులను తెలంగాణలో నాణ్యత కొలమానాల ఆధారంగా సేకరిస్తున్నట్లు నీతిఆయోగ్ పేర్కొంది. దీంతో నాసిరకం వస్తువుల సేకరణ తగ్గిపోయిందని.. ఫిర్యాదులు కూడా
పారదర్శకంగా ‘ఐసీడీఎస్’ కొనుగోళ్లు
సరకులు పక్కదారి పట్టకుండా ఆధార్తో అనుసంధానం
వెల్లడించిన నీతిఆయోగ్
ఈనాడు, దిల్లీ : సమీకృత శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) అమలు కోసం పంపిణీచేసే వివిధ వస్తువులను తెలంగాణలో నాణ్యత కొలమానాల ఆధారంగా సేకరిస్తున్నట్లు నీతిఆయోగ్ పేర్కొంది. దీంతో నాసిరకం వస్తువుల సేకరణ తగ్గిపోయిందని.. ఫిర్యాదులు కూడా తగ్గాయని చెప్పింది. ఆర్థికనష్టంతో పాటు, అనారోగ్య ముప్పు తప్పుతున్నట్లు తెలిపింది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తెలంగాణ పోర్టల్ ద్వారా పారదర్శక పద్ధతిలో ఆన్లైన్ ద్వారా పాలు, కందిపప్పు, గుడ్లు, నూనె, బాలామృతాలను రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ తెలంగాణ ఆయిల్ ఫెడరేషన్ అండ్ ఫుడ్స్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. అలాగే బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ నుంచి ఈపాస్ ద్వారా గ్రామాల్లోని చౌకధరల దుకాణాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది. సమీకృత శిశు అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను క్రోడీకరించి నీతిఆయోగ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం గురువారం ‘టేక్ హోం రేషన్’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్ఛైర్మన్ సుమన్ కె.బేరి, సభ్యుడు వీకేపాల్, సీఈవో అమితాబ్కాంత్లు పాల్గొన్నారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
సహకార సమాఖ్యల నుంచే పాలు
ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పాలు కొనుగోలుచేసి గర్భిణులు, బాలింతలకు నెలలో 30 రోజుల పాటు రోజుకు 200 మిల్లీలీటర్లు అందిస్తున్నట్లు తెలిపింది. పాలలో ఉండాల్సిన పోషకాల గురించి ముందే నిర్దేశించి ఆన్లైన్ టెండరింగ్ విధానం ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు వివరించింది. ఈ టెండర్ ప్రక్రియలో కేవలం సహకార సమాఖ్యలు మాత్రమే పాల్గొనాలనే నిబంధన వల్ల నేరుగా రైతులు ప్రయోజనం పొందుతున్నట్లు పేర్కొంది.
* ఈటెండరింగ్ ద్వారా కోడిగుడ్ల కొనుగోలులో కూడా పారదర్శక పద్ధతులను అనుసరిస్తున్నట్లు తెలిపింది. జిల్లా కొనుగోళ్ల కమిటీ ఏడాది కాలపరిమితితో టెండర్ జారీచేస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ పశుసంవర్ధక శాఖ ధ్రువీకరణపత్రంతో కోళ్లఫారాలు నిర్వహిస్తున్న రైతులు, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ కింద నమోదైన సంస్థలు మాత్రమే ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి అర్హులన్న నిబంధన విధించినట్లు గుర్తుచేసింది. కందిపప్పులాంటి పప్పుదినుసుల సేకరణకు కూడా టెండర్ పద్ధతిని అనుసరిస్తున్నట్లు తెలిపింది.
* అంగన్వాడీలకు పంపిణీచేసే సరకులు పక్కదారి పట్టకుండా ఆధార్తో అనుసంధానమైన ఐటీ ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు నీతిఆయోగ్ పేర్కొంది. తెలంగాణ స్టేట్ కమోడిటీస్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టం యాప్ ద్వారా ఈ వస్తువులను అంగన్వాడీ సెంటర్లకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ సెంటర్ల ఓపెనింగ్, క్లోజింగ్ బ్యాలెన్స్లను చూడటానికి వీలవుతోందని, దీనివల్ల ఏ సెంటర్కు ఎంత సరకు కావాలన్నది కచ్చితంగా అంచనావేయగలుగుతున్నట్లు తెలిపింది.
* రవాణాకు ఆర్టీసీసేవలను ఉపయోగించుకుంటోందని, ఎలాంటి లీకేజీ లేకుండా సరకు నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు చేరుతోందని తెలిపింది.
* 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు ఉన్న చిన్నారులకు అదనపు పోషకాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం బాలామృతంతో పాటు బాలామృతం ప్లస్ను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. దీనిద్వారా గోధుమలు, శనగలు, పాలపొడి, నూనె, చక్కెర అందిస్తున్నట్లు పేర్కొంది.
* బాలామృతాన్ని ఇది వరకు 2.5 కేజీల ప్యాకెట్ల రూపంలో ఇస్తుండగా దీన్ని వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు 1.25 కేజీల రూపంలోకి మార్చిందని, అందువల్ల దీని వాడకం మరింత సులభతరంగా మారినట్లు ఈ నివేదిక వివరించింది.
* తెలంగాణ ఫుడ్స్ ఆధ్వర్యంలో ఉన్న పోషకాహార మండలి ఏటా రెండుసార్లు సమావేశమై ఐసీడీఎస్ ద్వారా అందించే ఆహారవస్తువుల నాణ్యతను పరీక్షిస్తున్నట్లు నీతిఆయోగ్ నివేదిక తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరికాసేపట్లో తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. -
పోస్టింగ్ ఇవ్వకుండానే పంపించే పన్నాగం!
ప్రభుత్వమే ఫ్యాక్షనిస్టుగా మారితే... గిట్టనివారిని ఏ స్థాయిలో వేధిస్తుందో, ఎంతలా కక్ష సాధిస్తుందో డీజీ ర్యాంకు కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఉదంతమే తిరుగులేని ఉదాహరణ. -
ఇంటి దీపం కావాలి.. మా కలలకు రూపం ఇవ్వాలి!
‘అమ్మా..!’ అనే పిలుపు కోసం ఆరాటపడే స్త్రీమూర్తులు ఎందరో.. సంతానం కలగక ఆందోళన చెందుతున్న దంపతులూ వేల సంఖ్యలో ఉంటారు. అలాంటి వారంతా తమ ఇంటి దీపం వెలిగించే ఆడపిల్లలే కావాలంటున్నారు. -
నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఉద్యోగుల పనిదినాలు 5 రోజులకు తగ్గించాలి
సచివాలయ ఉద్యోగుల పనిదినాలను వారానికి ఆరు నుంచి ఐదు రోజులకు తగ్గించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తిరుమల వేంకటేశ్వరస్వామిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాది శ్రీదేవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. -
మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలన
రాష్ట్రంలో మూడు నెలల్లోగా నాటుసారా నిర్మూలించేలా కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్శాఖ కమిషనర్ ఇ.శ్రీధర్ ఆదేశించారు. -
వారికి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలి
తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘మేల్చాట్ వస్త్రం’ ‘తిరుప్పావడ’ సేవలకు నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత అర్ధాంతరంగా రద్దు చేసినందుకు తితిదే.. భక్తులకు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేకుంటే రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు అనురాధ, సభ్యులు చంద్రశేఖర్రెడ్డి, విజయలక్ష్మి ఇటీవల తీర్పు వెలువరించారు. -
ప్రజల భవితకు భరోసా కల్పించడమే లక్ష్యం
దేశంలో అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) దృష్టి సారించిందని, ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా పని చేయడమే తమ లక్ష్యమని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ అరుణ్కుమార్ మిశ్రా స్పష్టంచేశారు. -
అధిక ధరకు...బియ్యం టెండర్లు!
సన్న బియ్యం కొనుగోలుకు పౌరసరఫరాలశాఖ పిలిచిన ఈ-టెండర్ల అంశం కీలకదశలో ఉంది. 2.20 లక్షల టన్నుల సన్నబియ్యం (ఫైన్ వెరైటీ) కొనేందుకు మార్చిలో టెండర్లు పిలిచారు. తాజాగా బిడ్లను తెరిచారు. -
జిల్లా జడ్జి పోస్టుల నియామకంపై వివరణ
రాష్ట్రంలో తొమ్మిది జిల్లా జడ్జి(ఎంట్రీలెవల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. -
మధుమేహ చిన్నారుల మానసికోల్లాసానికి..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో పదుల సంఖ్యలో టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్న చిన్నారులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో ప్లాస్టిక్ నిషేధం..ఈవో ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధిస్తూ ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. -
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ తీగల వంతెన
ఏపీలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఏపీ-తెలంగాణ మధ్య నంద్యాల-ఆత్మకూరు-కొల్లాపూర్-నాగర్కర్నూల్-కల్వకుర్తి మార్గంలో సోమశిల వద్ద కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా.. అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తోంది. -
సంక్షిప్త వార్తలు (9)
తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాసయాదవ్ పత్రికా వ్యాసాల సంకలనం భూమి పుత్రుడు(సన్ ఆఫ్ ది సాయిల్) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. -
రేపు అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణోత్సవాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది. -
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
ఆమె నిండు గర్భిణి.. ఆపై పురిటి నొప్పులు.. బాధను భరించలేక తల్లడిల్లుతున్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సరైన దారి లేదు. గ్రామానికి వాహనమొచ్చే మార్గమూ కనిపించలేదు. -
టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో!
సుమాంజలిది ఆదిలాబాద్ జిల్లా. ఆమె టెట్ పేపర్-1, 2లకు దరఖాస్తు చేశారు. పరీక్ష రాసేందుకు తొలి ఆప్షన్ ఆదిలాబాద్, రెండోది హైదరాబాద్ ఇచ్చారు. -
తడిసిన ధాన్యం... తడి కళ్లతో రైతన్న దైన్యం
అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకసారి వర్షం నుంచి తేరుకునేలోగా మరోసారి కురుస్తుండటంతో వారికి కంటిమీద కునుకు ఉండటంలేదు. -
కుంగిన బ్లాక్లో ఒక గేటును పైకెత్తిన ఇంజినీర్లు
ఎట్టకేలకు మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్లో ఒక గేటును శుక్రవారం పైకెత్తారు. బ్యారేజీలో మొత్తం 85 రేడియల్ గేట్లున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే