దిల్లీ మద్యం కేసులో.. ఎంపీ సోదరుడిని విచారించనున్న ఈడీ!
మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ కూడా దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది.
ఈనాడు, హైదరాబాద్ : మద్యం ముడుపుల వ్యవహారంలో ఈడీ కూడా దూకుడు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన శరత్చంద్రారెడ్డిని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాబోయే రోజుల్లో మరికొందరిని ప్రశ్నించే అవకాశం ఉందని, ఇందులో ఓ ఎంపీ సోదరుడు కూడా ఉన్నట్లు సమాచారం. మద్యం ముడుపుల కేసులో లబ్ధి చేకూర్చుతానని నిందితులు, అనుమానితులతో బేరమాడారన్న అనుమానంతోనే ఆయనను విచారించాలని దిల్లీ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.మద్యం ముడుపుల కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే రాష్ట్రంలో అనేకమార్లు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గోరంట్ల అసోసియేట్స్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా అనేక మందిని దిల్లీ పిలిపించి విచారించారు. దిల్లీ మద్యం వ్యాపారంలో దక్షిణాది లాబీ కీలకపాత్ర పోషించిందని, పెద్దఎత్తున నిధులు చేతులు మారాయని, నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఎనిమిది సర్కిళ్లను ఇదే లాబీ దక్కించుకుందని దర్యాప్తులో వెల్లడయింది. ఇందులో భాగంగా ఈడీ అధికారులు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు భావిస్తున్న శరత్చంద్రారెడ్డిని అరెస్టు చేశారు. ఆయన వాంగ్మూలం కూడా నమోదు చేశారు. ఈ లోపు సీబీఐ అధికారులు రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్సీ కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. వచ్చే 11న ఆమెను విచారించనున్నారు. ఇదిలా ఉండగా రాబోయే రోజుల్లో ఈడీ అధికారులు దర్యాప్తు వేగం పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ ఎంపీ సోదరుడిని పిలిపించాలని నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారమే ఇందుకు నిదర్శనం. గతంలో ఓ ఎంపీ ఇంట్లో ఆదాయపన్నుశాఖ సోదాలు నిర్వహించినప్పుడు పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ దొరికిందని, దీని వివరాలు తెలుసుకునేందుకు ఇటీవల ఈడీ అధికారులు ఆయన సోదరుడిని పిలిపించి విచారించారని సమాచారం. ప్రస్తుతం మద్యం ముడుపుల కేసులో దిల్లీ ఈడీ అధికారులు విచారణకు పిలిచిన ఎంపీ సోదరుడు, విదేశీ కరెన్సీ విషయంలో విచారణకు హాజరైన వ్యక్తి ఒకరేనా?, వేర్వేరా? అనేది త్వరలోనే తేలనుంది.
అమిత్ అరోడా ఈడీ కస్టడీ పొడిగింపు
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో అమిత్ అరోడా ఈడీ కస్టడీని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మరో వారం పొడిగించింది. అక్రమ నగదు చలామణి వ్యతిరేక చట్టం (పీఎంఎల్ఏ) కింద అమిత్ అరోడాను అరెస్టు చేసిన ఈడీ అధికారులు గత వారం రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా నాడు న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీకి ఇచ్చింది. గడువు ముగియడంతో బుధవారం ఈడీ అధికారులు న్యాయస్థానం ఎదుట మరోసారి అరోడాను హాజరుపర్చారు. కేసు దర్యాపు కొనసాగుతోందని, కీలక సమచారం సేకరిస్తున్నందున కస్టడీని మరో పది రోజులు పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. స్పందించిన న్యాయస్థానం కస్టడీని వారం రోజులు పొడిగించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత