శివారు.. ఫాం ల్యాండ్స్ అక్రమాల జోరు
రాజధాని హైదరాబాద్ శివారులో వ్యవసాయ క్షేత్రం ఉండటమనేది ఒక స్టేటస్ సింబల్గా మారింది. వారాంతాల్లో విడిదిగా ఈ క్షేత్రాలను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు.
గజాల్లో విక్రయాలు.. గుంటల్లో రిజిస్ట్రేషన్లు
ధరణి నిబంధనల ఆసరాగా వ్యాపారం
ఈనాడు, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్ శివారులో వ్యవసాయ క్షేత్రం ఉండటమనేది ఒక స్టేటస్ సింబల్గా మారింది. వారాంతాల్లో విడిదిగా ఈ క్షేత్రాలను చాలా మంది ఉపయోగించుకుంటున్నారు. కానీ కొందరు ఈ పేరుతో అక్రమ వ్యాపారం చేస్తున్నారు. సాగు భూములను చిన్న చిన్న విస్తీర్ణాలుగా మార్చి ఫాం ల్యాండ్స్ పేరిట విక్రయిస్తున్నారు. రూ.40-50 లక్షలు వెచ్చిస్తే చాలు దాదాపు 242 చదరపు గజాల స్థలంలో నివాసం, గ్రీనరీ ఉన్న ఫాం ల్యాండ్ సొంతమవుతుందన్న ఆలోచనతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విదేశాల్లో స్థిరపడిన వారు చాలామంది కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. ఓ వైపు వ్యాపారులు సాగు భూమిని సాగేతర భూమిగా చూపి కొనుగోలుదారులకు అంటగడుతుండగా మరోవైపు ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఈ తరహా వ్యాపారం పెద్దఎత్తున సాగుతోంది. దీన్ని కట్టడి చేయకపోతే భవిష్యత్లో టౌన్ ప్లానింగ్ సమస్యలు ఏర్పడతాయి. ధరణి పోర్టల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లలో రెండు, మూడు నెలలుగా గుంటల్లో జరుగుతున్నవే ఎక్కువగా ఉంటున్నాయి.
60 కిలోమీటర్ల పరిధిలోనే ఎక్కువగా..
నగరానికి 60 కిలోమీటర్ల పరిధిలోనే ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్లకు దారితీసే ప్రధాన రహదారుల్లోని మండలాల్లో ఈ క్షేత్రాలు వెలుస్తున్నాయి. సాగు భూమిని కొనుగోలు చేస్తున్న వ్యాపారులు రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. గుంట, రెండు గుంటల విస్తీర్ణాన్ని ప్లాట్గా మార్చుతున్నారు. ఒక మూలన సకల వసతులతో చిన్నపాటి ఇంటిని నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల కంటెయినర్లను పెడుతున్నారు. ఖాళీ స్థలంలో మామిడి, జామ, కొబ్బరి మొక్కలు పెంచుతున్నారు. కొన్ని చోట్ల అప్పటికే తోటలు ఉంటే చెట్ల మధ్య వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎకరా భూమిని రూ.రెండు, మూడు కోట్లకు కొనుగోలు చేసి గజం సుమారు రూ.20 వేలకు పైగా ధరకు విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి పన్నులేవీ ఉండకపోగా.. వ్యాపారులకు కనీసం రూ.రెండింతలు మిగులు ఉంటోందన్న అంచనాలు ఉన్నాయి.
వెసులుబాటు కల్పిస్తున్న ధరణి
గుంట భూమిని కూడా రిజిస్ట్రేషన్-మ్యుటేషన్ చేసే వెసులుబాటును ధరణి పోర్టల్ కల్పిస్తుండటం ఈ వ్యాపారానికి కలిసి వస్తోంది. అయితే, ఆ భూమిని గజాలుగా మార్చి(121 చ.గజాలు) విక్రయిస్తున్నారు. వాస్తవానికి నాలా పన్ను చెల్లించి స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేయాలంటే పక్కాగా లేఅవుట్ ప్లాన్, అనుమతులు ఉండాలి. అందుకే ఇవేమీ లేకుండా గుంటల్లో అంటకడుతున్నారు. పైగా పాసుపుస్తకం, ప్రభుత్వం ఇచ్చే పంట పెట్టుబడి వస్తుందని భరోసా ఇస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన నాలా, రిజిస్ట్రేషన్ పన్ను ఆదాయానికి గండిపడుతోంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగిస్తే మ్యుటేషన్ చేయకూడదు. కానీ 2020 నవంబరు నుంచి అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్ ఏకకాలంలో రిజిస్ట్రేషన్- మ్యుటేషన్లకు అనుమతిస్తోంది. క్షేత్రస్థాయిలో భూమి పరిశీలన చేయకుండానే మ్యుటేషన్ పూర్తవుతుండటం ఫాం ల్యాండ్స్ వ్యాపారానికి కలిసి వస్తోంది.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
సాగు భూమిని నాలా అనుమతి పొందాకే సాగేతర రంగాలకు వినియోగించాలి. పంచాయతీ, డీటీసీపీ నుంచి లే అవుట్ అనుమతి పొందాలి. స్థలంలో పది శాతం గ్రీన్బెల్ట్కు, సామాజిక అవసరాలకు వదలాలి. ఆ భూమి విస్తీర్ణం బట్టి ప్రధాన రహదారి, అంతర్గత రహదారుల నిర్మాణం ప్రమాణాల మేరకు చేపట్టాలి. డ్రైనేజీ మార్గం నిర్మించాలి. ఫాం ల్యాండ్స్లలో ఇవేమీ ఉండవు. భవిష్యత్లో ఆవాస ప్రాంతంగా మారిన తరువాత లే అవుట్ ఇబ్బందులు, ప్లానింగ్ సమస్యలు వస్తాయనే విషయం తెలియక చాలా మంది కొనుగోలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. -
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
మత్తు అనర్థాలపై అవగాహన: ఐఎంఏ
మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది. -
తగ్గిన గనులశాఖ ఆదాయం
రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. -
తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రెండు, మూడు నెలల్లో… బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ పనులు
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో లైన్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. -
థింపూలో ఏబీటీవో కార్యాలయం ప్రారంభం
భూటాన్ రాజధాని థింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది. -
29, 30 తేదీల్లో వనదేవతల గద్దెలకు తాళాలు
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. -
నేటి నుంచే ‘టెట్’
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభం కానుంది. జూన్ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్కు 99,958 మంది, రెండో పేపర్కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రారంభించింది. -
వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. -
ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఎస్.మురళీధర్ అన్నారు. -
ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు
ములుగు జిల్లా వెంకటాపూర్లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. -
ఆధార్ అనుసంధానం కాకున్నా..‘డెత్ క్లెయిమ్’లు పరిష్కరించండి
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?