Health: ముప్పు ‘మద్య’ ఉన్నట్టే
మద్యం వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు అని మరోసారి వెల్లడైంది. మద్యపానంతో కాలేయమే కాదు.. నోరు, పెదవులు, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల బారినపడే ప్రమాదం కూడా ఉందని తాజాగా ‘ఆక్స్ఫర్డ్’ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం
మద్యంతో కాలేయంతో పాటు ఇతర అవయవాలకూ క్యాన్సర్ సోకే ప్రమాదం
ధూమపానం కూడా తోడైతే మరింత హెచ్చు
ఆక్స్ఫర్డ్ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: మద్యం వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు అని మరోసారి వెల్లడైంది. మద్యపానంతో కాలేయమే కాదు.. నోరు, పెదవులు, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల బారినపడే ప్రమాదం కూడా ఉందని తాజాగా ‘ఆక్స్ఫర్డ్’ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. దీనికి ధూమపానం వంటి దురలవాట్లు, జీవనశైలి అవలక్షణాలు కూడా జతకూడితే ముప్పు తీవ్రత మరింత పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా మద్యం కారణంగా ఏటా 30 లక్షల మరణాలు సంభవిస్తున్నట్లు ‘ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్’ అధ్యయనం తెలిపింది. ఇందులో 4 లక్షలు క్యాన్సర్ కారణంగా జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. 1.50 లక్షలమంది చైనీయులపై ఈ అధ్యయనం చేశారు. ఇందులో 60 వేల మంది పురుషులు, 90 వేలమంది మహిళలు ఉన్నారు. 11 ఏళ్ల పాటు వీరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఈ అధ్యయన ఫలితాలు ఇటీవలే ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’లో ప్రచురితమయ్యాయి. పాశ్చాత్య దేశాలతో పోల్చితే.. ఆసియా ఖండంలోని జనాభాలో జన్యుపరమైన మార్పులున్నాయనీ, అందుకే ఆసియన్లలో మద్యం కారక ముప్పు ఎక్కువేనని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా క్యాన్సర్ కోరల్లో చిక్కుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ఏటా 1000కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో దేశవ్యాప్తంగా 1,18,044 క్యాన్సర్ కేసులు నమోదు కాగా.. 64,620 మంది మృత్యువాతపడ్డారు. భారత్లో నమోదవుతున్న మొత్తం క్యాన్సర్లలో.. పురుషుల్లో 6 శాతం.. మహిళల్లో 0.5-1 శాతం వరకూ మద్యం కారణంగా సంభవిస్తున్నవేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఎలా ప్రమాదకరంగా మారుతోంది?
మద్యం శరీరం లోనికి వెళ్లగానే.. జీవక్రియలో భాగంగా అది విచ్ఛినమై, ‘ఎసిటేల్ డీహైడ్’గా ఉత్పరివర్తనం చెందుతుంది. తద్వారా అతి ప్రమాదకర ‘కార్సినోజెనిక్’ రసాయనాలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా అనేక రకాల అవయవాలపై దాని ప్రభావం పడి నేరుగా క్యాన్సర్కు దారితీస్తుంది. పైగా మద్యపాన ప్రియుల్లో అత్యధికుల్లో అనుబంధంగా జీవనశైలి దురలవాట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ధూమపానం, నిద్రలేమి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, స్థూలకాయం తదితరాలు. ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యకరమైన పోషక విలువలను శరీరం గ్రహించే తత్వం కోల్పోతుంది. దీనివల్ల కూడా క్యాన్సర్ త్వరగా రావడానికి అవకాశాలెక్కువ ఉంటాయి.
తక్కువ తీసుకున్నా ముప్పు ఎక్కువే
మద్యం వల్ల క్యాన్సర్ వస్తుందని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. చాలామందిలో మద్యం ఎంత తీసుకుంటే మంచిది? అనే సందేహం ఉంటుంది. నిజానికి కొద్ది మోతాదులో తీసుకున్నా ముప్పే. తీసుకోకపోవడమే మంచిది. మద్యం ఎక్కువగా తీసుకునే మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా రొమ్ము క్యాన్సర్కు దారితీస్తుంది.
- డాక్టర్ సెంథిల్ రాజప్ప, ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణులు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి
ఆసియన్లకు మద్యాన్ని తట్టుకునే శక్తి తక్కువ
పాశ్చాత్యదేశాలతో పోల్చితే ఆసియన్లకు మద్యాన్ని తట్టుకునే శక్తి తక్కువ అని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. భారత్లో గతంలో 60 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే క్యాన్సర్లు ఇప్పుడు 30 ఏళ్లలోనే కనిపిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల కంటే తక్కువ మోతాదులోనే మద్యాన్ని తీసుకున్నా భారత్లో క్యాన్సర్ల బారినపడే వారి సంఖ్య ఎక్కువ. ఇందుకు జన్యుపరమైన కారణాలున్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి. మద్యం వల్ల ప్రమాదకరమైన రసాయనాలు ఉత్పన్నమై, మన డీఎన్ఏపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి. హెపటైటిస్ బి, సి వైరస్ వ్యాధులతో బాధపడుతున్నవారు మద్యం తీసుకుంటే చాలా త్వరగా కాలేయ క్యాన్సర్ బారినపడే ప్రమాదముంది.
- డాక్టర్ రాజేశ్గుప్తా, సీనియర్ హెపటాలజిస్ట్, ఏఐజీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ