Huzurabad By Election: హోరు ముగిసింది... పోరు మిగిలింది
హోరాహోరీ సమరంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రచార ఘట్టానికి తెరపడింది. నియోజకవర్గంలో ప్రధానంగా విమర్శలు, ప్రతి విమర్శలతో సాగిన ప్రచార పర్వం బుధవారం రాత్రి 7 గంటలతో ముగిసింది. ఇన్నాళ్లుగా ఇక్కడికి
హుజూరాబాద్లో ప్రచారం పరిసమాప్తం
ఓటర్ల ప్రసన్నానికి ప్రారంభమైన ప్రలోభ పర్వం
ఈనాడు డిజిటల్, కరీంనగర్: హోరాహోరీ సమరంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ప్రచార ఘట్టానికి తెరపడింది. నియోజకవర్గంలో ప్రధానంగా విమర్శలు, ప్రతి విమర్శలతో సాగిన ప్రచార పర్వం బుధవారం రాత్రి 7 గంటలతో ముగిసింది. ఇన్నాళ్లుగా ఇక్కడికి ఆయా పార్టీల నుంచి ప్రచారానికి వచ్చిన నేతలంతా వారి జిల్లాలకు వెళ్లిపోయారు. చివరి రోజున తెరాస, భాజపా, కాంగ్రెస్- మూడు పార్టీల అభ్యర్థుల తరఫున ముఖ్య నేతలు ప్రచారాల్లో పాల్గొన్నారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరఫున రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్లు హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్లలో ప్రచార సభలో పాల్గొని అభివృద్ధికి పట్టంగట్టాలని కోరారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సినీనటి విజయశాంతి, ఎంపీ అర్వింద్లు పలుచోట్ల ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్కు మద్దతుగా పీసీసీ అధినేత రేవంత్రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహాలు పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ నెల 1వ తేదీన ఇక్కడి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొదలు దాదాపుగా 27 రోజులపాటు రాజకీయ సందడి తార స్థాయికి చేరింది. పల్లెలు, పట్టణాలల్లో ప్రచారం హోరెత్తింది. నాయకులు, అభ్యర్థులు పోటాపోటీగా హామీల వర్షాన్ని కురిపించారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.
పలు పార్టీలు ప్రచారం ముగిసిన చివరి రోజు నుంచే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటర్లకు నగదును పంపిణీ చేసే పర్వానికి తెరదీసినట్లు తెలుస్తోంది. ఓటుకింత రేటు అనేలా పంపిణీ చేపట్టినట్లు ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం సాగుతోంది. పలు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇంట్లో ఉన్న ఓటర్ల సంఖ్యను కవర్పైన రాసి.. లోపల నగదు ఉంచి అందించారనే ఆరోపణలు వినిపించాయి. మున్ముందు మద్యం, నగదు పంపిణీ మరింతగా కొనసాగే అవకాశముంది. ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనే ఎత్తుగడలను అమలు చేసేందుకు ఆయా పార్టీలు వ్యూహ రచనల్లో మునిగి తేలాయి.
డబ్బు, మద్యం పంపిణీపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
నారాయణగూడ, న్యూస్టుడే: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోందని హైకోర్టు న్యాయవాది సయ్యద్ సలీం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. ఓటుకు రూ.6 వేలు ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయన్నారు. ఎన్నిక పూర్తయ్యేవరకు పోలీసులు, ఎన్నికల కమిషన్ సమర్థంగా విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీధి ఒక్కటే.. తండ్రిది ఏపీ.. కుమారుడిది తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. -
50 శాతంపైగా పెరిగిన కరెంటు వినియోగం
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్, వినియోగం అనూహ్యంగా పెరుగుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. -
పోల్ 2023.. కేఎంఆర్..!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు క్రమంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భారాస ప్రత్యర్థుల్ని నియంత్రించాలనే ప్రధాన ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ నిందితులు ప్రత్యేక వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేసినట్లు తాజా దర్యాప్తులో తేలింది. -
రోహిత్ కేసు పునర్విచారణ ప్రారంభం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. -
వడదెబ్బకు 19 మంది మృత్యువాత
రాష్ట్రంలో వారం రోజులుగా హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మృతిచెందారు. -
మధుమేహంపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలి
భారత్లో మధుమేహం ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. -
బతికుండగానే పూడ్చిపెట్టారు..
ముక్కుపచ్చలారని పసిగుడ్డు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు.. ప్రాణాలతో గుంతలో వేసి మట్టితో పూడ్చేశారు. -
నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సీఎస్ గౌరవం
కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం, పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ నగరి బీరప్పకు అరుదైన గౌరవం దక్కింది. -
మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్కు మాతృవియోగం
మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్ మాతృ వియోగం పొందారు. -
‘ఆపరేషన్ కగార్’తో అమాయకుల ప్రాణాలు బలి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టి.. అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలు తీస్తోందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. -
అంధులకు వీఐపీ దర్శనం
యాదాద్రి ప్రధాన ఆలయంలో శనివారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అంధులు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా.. అక్కడే విధుల్లో ఉన్న ఆలయ ఈవో భాస్కర్రావు కంటపడ్డారు. -
శిక్షలో పక్షపాతం తగదు
విద్యారుణాలకు సంబంధించి నకిలీ రుణ మంజూరు పత్రాల జారీ వ్యవహారంలో బాధ్యులైన అధికారులకు శిక్ష విధించడంలో పక్షపాతం చూపడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
ఎకరాకు 12 క్వింటాళ్ల జొన్నలు ప్రభుత్వమే కొంటుంది
రాష్ట్ర ప్రభుత్వం జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది. ఎకరాకు 8.85 క్వింటాళ్లను మాత్రమే మద్దతు ధరకు కొనాలన్న గరిష్ఠ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. -
టీఎస్సెట్ నోటిఫికేషన్ విడుదల
అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ నియామకాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష ‘తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్- 2024’ నోటిఫికేషన్ విడుదలైంది. -
7న మేడిగడ్డకు జ్యుడిషియల్ విచారణ కమిటీ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నెల 7న విశ్రాంత జడ్జి పినాకి చంద్రఘోష్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. -
అవినీతి చెక్పోస్టులకు అడ్డుకట్ట!
రాష్ట్రంలో రవాణాశాఖ చెక్పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 33పై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. -
నేడు నీట్-యూజీ ప్రవేశపరీక్ష
నీట్-యూజీ (ఎంబీబీఎస్) ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్