Social Media: సూర్యరశ్మే శిశువుకు ఆహారమట.. సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్ఫ్లుయెన్సర్
Social Media: సోషల్ మీడియాలో ఆదరణ కోసం కొంత మంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా రష్యాలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పనికి సొంత బిడ్డే బలయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోదామన్న ఆతృతతో కొంత మంది చేస్తున్న పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇతరుల ప్రాణాల మీదకూ తెస్తున్న సందర్భాలున్నాయి. ముఖ్యంగా ఏమాత్రం అవగాహనలేని విషయాలపై సాధికారికంగా మాట్లాడుతూ ఫాలోవర్లను తప్పుదోవ పట్టిస్తున్న వారి సంఖ్య మరీ ఎక్కువై పోతోంది. ఇలాగే రష్యాకు చెందిన ఓ ఇన్ప్లుయెన్సర్ తన సొంత కొడుకుపై ప్రయోగాలు చేసి.. ఆ పసిబిడ్డ మరణానికి కారకుడయ్యాడు. ఈ ఘటన ఏడాది క్రితం జరిగింది. తాజాగా నేరం రుజువు కావటంతో అతడికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.
ప్రత్యేక డైట్ ప్రమోషన్..
రష్యాకు చెందిన మాక్సిమ్ లైయుటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. పచ్చి కూరగాయలతో ప్రత్యేక డైట్ల గురించి చెబుతూ యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసేవాడు. ఈ క్రమంలో తాను ఆహారం, ఆరోగ్యం గురించి ఇచ్చే సూచనలు ఎంత బలమైనవో నిరూపించాలనుకొన్నాడు. సొంత కొడుకుపైనే ప్రయోగాలు మొదలుపెట్టాడు. మనిషి బతకడానికి అసలు ఆహారం అవసరం లేదని.. కేవలం సూర్యరశ్మితోనే ఎంతకాలమైనా జీవించొచ్చనేది అతడి భ్రమ. దీన్ని యూజర్లకు నూరిపోసి.. దానిని నిరూపించటం కోసం నెలలు నిండని తన కొడుకుపై ప్రయోగం ప్రారంభించాడు.
భార్య ఎంత వారించినా మాక్సిమ్ మాట వినలేదు. ఆ శిశువుకు పాలు పట్టొద్దని హెచ్చరించేవాడు. ఆరోగ్యం క్షీణిస్తున్నా.. రోగనిరోధక శక్తి దానంతట అదే పెరిగి కోలుకుంటాడని మొండిగా వాదించేవాడు. తల్లి ఆగలేక దొంగచాటుగా ఒక్కోసారి ఆ శిశువుకు పాలు పట్టేది. కానీ, మాక్సిమ్కు దొరికిపోతానేమోనని ఆమె చాలా భయపడేది.
చేదాటిపోయాక ఆసుపత్రికి..
శిశువును ఎండలో మాత్రమే ఉంచాలని.. అప్పుడే కోలుకుంటాడని మూర్ఖంగా వాదించేవాడని అతని స్నేహితులు వెల్లడించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇబ్బంది పడుతున్నా వైద్యుల వద్దకు తీసుకెళ్లేందుకు అనుమతించేవాడు కాదని వారు వాపోయారు. పైగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆ చిన్నారిని చన్నీటిలో ముంచేవాడని చెప్పారు. దాని వల్ల అతడి శరీరం దృఢంగా తయారవుతుందనేవాడని ఆ చిన్నారి దయనీయ పరిస్థితిని వివరించారు.
క్రమంగా బాలుడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు పలువురి ఒత్తిడి మేరకు బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి మాక్సిమ్ అనుమతించాడు. కానీ, అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. వైద్య పరీక్షల్లో నిమోనియా సహా పలు సమస్యల వల్ల ఆ చిన్నారి చనిపోయినట్లు తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు మాక్సిమ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బిడ్డ బలం కోసమేనట..
గర్భవతిగా ఉన్నప్పుడు తన భార్య పౌష్టికాహారం తీసుకోలేదని అందుకే బిడ్డ అనారోగ్య సమస్యలతో మరణించాడని విచారణలో మాక్సిమ్ బుకాయించాడు. తల్లి మాత్రం ఉన్న విషయం చెప్పేసింది. ఆమెకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఏడాది విచారణ తర్వాత మాక్సిమ్ కూడా నేరాన్ని అంగీకరించాడు. తన వల్లే కుమారుడు మరణించాడని ఒప్పుకొన్నాడు. అయితే, తాను కావాలని అలా చేయలేదని.. బిడ్డను బలమైన వ్యక్తిగా చూడాలన్నదే తన లక్ష్యమని న్యాయస్థానానికి తెలిపాడు. అతడిని దోషిగా తేల్చిన కోర్టు ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కొసమెరుపు ఏంటంటే.. పచ్చి కూరగాయలు తినాలని సూచించిన అతడే.. కస్టడీలో ఉన్నప్పుడు నూడుల్స్, మాంసం వంటివి ఆర్డరు చేసినట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ‘అంతర్జాతీయ నేర న్యాయస్థానం’ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఇజ్రాయెల్లో ఆందోళన నెలకొంది. -
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యా (Kenya)లో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?