Gaza: సొంతవారు.. ప్రమాదాలు.. 17శాతం మంది ఇజ్రాయెల్ సైనికుల మరణాలు ఇలానే..!
ఇజ్రాయెల్ సైనికుల్లో దాదాపు చాలా మంది ఫ్రెండ్లీ ఫైర్లో మరణించారు. ఈ విషయాన్ని ఐడీఎఫ్ ప్రకటించింది. మరోవైపు 2024 ఏడాది మొత్తం గాజాలో యుద్ధం చేసేందుకు వీలుగా దళాల్లో ఇజ్రాయెల్ కీలక మార్పులు చేసింది.
ఇంటర్నెట్డెస్క్: సముద్రాలు ఈదిన వారు పిల్ల కాలువలో పడి మరణించినట్లుంది ఇజ్రాయెల్ పరిస్థితి. ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా పేరున్న ఐడీఎఫ్ సైనికుల్లో 17శాతం మంది అకారణంగా చనిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ గాజాలో చేపట్టిన భూతల దాడుల్లో 170 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 29 మంది ఫ్రెండ్లీఫైర్ (సొంత దళాల కాల్పులు) ప్రమాదాల్లో మరణించారు. ఈ డేటాను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) స్వయంగా వెల్లడించింది.
ఈ 29 మంది సైనికుల్లో 18 మంది సొంత దళాలు, ట్యాంకులు, విమానాలు జరిపిన దాడుల్లో చనిపోయారు. తొమ్మిది మంది భవనాల కూల్చివేతల సమయంలో శకలాలుపడి, ఆయుధాలు ప్రమాదవశాత్తూ పేలి, వాహనాలు ఢీకొన్న ఘటనల్లో కన్నుమూశారు.
యుద్ధం మొదలైన నాటి నుంచి ప్రతివారం ఇటువంటి ఘటనల్లో కనీసం ఇద్దరు నుంచి ఆరుగురు వరకు మరణించారు. గాజా వంటి కిక్కిరిసిన ప్రదేశంలో భారీ సంఖ్యలో దళాలు రంగంలోకి దిగడం, సైనికుల మధ్య కమ్యూనికేషన్లలో లోపాలు, కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వంటివే వీటికి ప్రధాన కారణాలు.
గాజా నుంచి ఐదు బ్రిగేడ్లను వెనక్కి పంపిన ఇజ్రాయెల్..
గాజాలో భూతల దాడుల్లో విజయాలు సాధించడంతో ఇజ్రాయెల్ దళాల సంఖ్యను తగ్గించింది. మొత్తం ఐదు బ్రిగేడ్లను వెనక్కి పంపాలని నిర్ణయించింది. 2024లో ఇజ్రాయెల్ దళాలు హమాస్తో పోరాడాల్సి రావచ్చన్న అంచనాలున్నాయి. ‘‘ఆయా ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ పోరాట విధానాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఈ యుద్ధం సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్లే మేము సిద్ధమవుతున్నాం. సైన్యం విషయంలో స్మార్ట్ మేనేజ్మెంట్ విధానాలు అవలంబిస్తున్నాం. ఆర్థిక వ్యవస్థ పుంజుకొనేట్లు చేసేందుకు, శిక్షణకు వీలుగా రిజర్విస్టులను వెనక్కి పంపిస్తున్నాం. ఇక గాజాలోని ఖాన్ యూనిస్లో హమాస్కు అత్యంత కీలకమైన నుఖ్బా ఫోర్సు కీలక నాయకులను ఆదివారం మట్టుబెట్టాము. మరికొందరు లొంగిపోయారు. ఈ దళంలో అక్టోబర్ 7వ తేదీన జరిగిన దాడిలో పాల్గొంది’’ అని ఐడీఎఫ్ ప్రతినిధి డానియల్ హగారీ వెల్లడించారు.
ఇక ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 21 వేల మంది మంది ప్రజలు చనిపోయినట్లు గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. వీటిల్లో హమాస్ రాకెట్లు గురితప్పి గాజాపైన పడటంతో మరణించి వారు కూడా ఉన్నారు. ఐడీఎఫ్ లెక్కల ప్రకారం 8,500 మంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు కూడా గణనీయంగా తగ్గాయి. డిసెంబర్ తొలి వారంలో రోజుకు 75 రాకెట్లను హమాస్ ప్రయోగించగా.. ఆ సంఖ్య డిసెంబర్ చివరి వారం నాటికి రోజుకు 14 రాకెట్లకు పడిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యా (Kenya)లో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?