Imran Khan: ఇమ్రాన్ను వేరే జైలుకు మార్చండి..హైకోర్టులో పీటీఐ పిటిషన్
జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ను (Imran Khan) అక్కడి నుంచి వేరే చోటుకి తరలించాలని పీటీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఇస్లామాబాద్: తోషఖానా (Toshakhana) కేసులో జైలు పాలైన పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను (Imran Khan) వేరే కారాగారానికి తరలించాలని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) డిమాండ్ చేసింది. ఆయన్ను పంజాబ్ ప్రావిన్స్లోని అట్టోక్ జైలు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించాలని కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన గత నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యున్నత సదుపాయాలు కలిగిన అడియాలా కారాగారానికి మార్చాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, వ్యక్తిగత వైద్యుడు డా.ఫైజల్ సుల్తాన్ తరచూ ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతించాలని కోరింది. పార్టీ అధ్యక్షుడిగా న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపే హక్కు ఆయనకు ఉంటుందని పేర్కొంది.
ఇమ్రాన్.. తోషఖానా స్కామ్ అంటే?
ఇమ్రాన్ ఖాన్ సంపన్న కుటుంబంలో పుట్టిన వారని, విదేశాల్లో ఉన్నత చదువులు చదివారని, అంతేకాకుండా పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు వహించి దేశానికి పేరు తీసుకొచ్చారని పీటీఐ తన పిటిషన్లో గుర్తు చేసింది. ఆయన సామాజిక, రాజకీయ స్థాయిని దృష్టిలో ఉంచుకొని జైల్లో సదుపాయాలు కల్పించాలని కోరింది. తోషఖానా కేసులో ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు శనివారం ఇమ్రాన్ ఖాన్కు మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే.. లాహోర్లోని ఆయన నివాసంలో పోలీసులు ఇమ్రాన్ను అరెస్టు చేశారు. రావల్పిండి కోర్టులో ఆయన్ను ఉంచాలని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. అట్టోక్ పట్టణంలో ఉన్న జైలుకు తరలించారు. దీనిపై తాజాగా పీటీఐ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది.
పాక్ ప్రముఖులు ఎవరైనా ఉన్నత పదవుల్లో ఉండి విదేశాల నుంచి బహుమతులు అందుకుంటే.. పదవి నుంచి వైదొలగిన తర్వాత వాటిని తోషాఖానాలో జమ చేయాల్సి ఉంటుంది. లేదంటే నిబంధనల ప్రకారం నిర్దేశించిన ధర చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. కానీ, ఇమ్రాన్ఖాన్ మాత్రం చాలా తక్కువ ధర చెల్లించి వాటిని తన వద్దే ఉంచుకున్నారని, మరికొన్నింటిని తోషఖానాకు తెలియకుండా విదేశాల్లోనే అమ్మేశారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 11.9 కోట్ల పాకిస్థాన్ రూపాయల విలువైన బహుమతులను చాలా తక్కువ మొత్తంలో చెల్లించి తీసుకున్నారన్నది ఆరోపణ. దీనిపైనే శనివారం కోర్టు తీర్పు వెలువరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర