IRGC: ఇజ్రాయెల్ భీకర దాడి.. నలుగురు ఇరాన్ సైనిక సలహాదారులు మృతి
సిరియాలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన నలుగురు సలహాదారులు మృతి చెందారు.
డమాస్కస్: ఇజ్రాయెల్- హమాస్ల పోరు (Israel-Hamas War) వేళ.. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కుతోంది. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్లోని ఓ భవనంపై ఇజ్రాయెల్ (Israel) జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC)కు చెందిన నలుగురు సలహాదారులు మృతి చెందారు. టెహ్రాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీని వెనుక టెల్అవీవ్ హస్తం ఉందని ఆరోపించింది. మృతుల వివరాలు వెల్లడించలేదు. సిరియాలో కుద్స్ ఫోర్స్ ఉన్నతాధికారి జనరల్ సాదేగ్ ఒమిద్జాదే, అతడి డిప్యూటీ హజ్ గోలమ్లు చనిపోయినవారిలో ఉన్నట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది.
ఇరాన్ మద్దతుగల సంస్థల అధికారులు సమావేశమైన సందర్భంలో ఈ దాడి జరిగినట్లు ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ తెలిపింది. ఐదుగురు ఇరానీయన్లు, ఒక సిరియన్ మృతి చెందినట్లు చెప్పింది. ఇరాన్వాసుల్లో ముగ్గురు కమాండర్లు ఉన్నారని వెల్లడించింది. మరో నలుగురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు పేర్కొంది. వెనిజులా, దక్షిణాఫ్రికా రాయబార కార్యాలయాలకు సమీపంలో ఈ దాడి జరిగినట్లు సిరియా స్టేట్ టీవీ తెలిపింది. ఇజ్రాయెల్ క్షిపణులు నాలుగు అంతస్తుల భవనాన్ని మొత్తం ధ్వంసం చేశాయని ఓ అధికారి వెల్లడించారు. నెతన్యాహు ప్రభుత్వం ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు.
హమాస్పై యుద్ధంలో ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల్లో విభేదాలు!
హమాస్కు, ఇతర ఉగ్రవాద సంస్థలకు టెహ్రాన్ ఆర్థిక, సైనిక సాయం చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబరులో డమాస్కస్ శివారులోని జైనాబియా జిల్లాలో జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ సైనిక సలహాదారు, బ్రిగేడియర్ సయ్యద్ రజీ మౌసావీ మృతి చెందారు. దీన్ని తీవ్రంగా పరిగణించినట్లు ప్రకటించిన ఐఆర్జీసీ.. తగిన మూల్యం తప్పదని హెచ్చరించింది. ఉత్తర ఇరాక్లోని ఇర్బిల్ నగరంలో అమెరికా కాన్సులేట్కు సమీపంలో ఉన్న మొసాద్ ముఖ్య కార్యాలయంపై క్షిపణులను ప్రయోగించింది. ఈ పరిణామాల నడుమే తాజా ఘటన చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?