Kim Jong Un: కొత్త సంవత్సరంలో కిమ్ లక్ష్యాలివే..!
Kim Jong Un: కొత్త ఏడాదిలో సైనికపరంగా మరింత బలోపేతం కావడానికి ప్రయత్నిస్తామని కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. అమెరికా సహా ఇతర దేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను తిప్పికొట్టే సామర్థ్యాన్ని సాధిస్తామని తెలిపారు.
సియోల్ (దక్షిణ కొరియా): నూతన సంవత్సరం నేపథ్యంలో ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) తన తదుపరి లక్ష్యాలను ప్రకటించారు. అమెరికా నేతృత్వంలోని ఘర్షణాత్మక ఎత్తుగడలను ఎదుర్కోవడానికి యుద్ధ సంసిద్ధత కోసం ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయాలను ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్ఏ ఆదివారం వెల్లడించింది.
కేసీఎన్ఏ వివరాల ప్రకారం.. కొత్త ఏడాదిలో మరో మూడు అదనపు సైనిక నిఘా ఉపగ్రహాలను పరీక్షిస్తామని కిమ్ (Kim Jong Un) ప్రతినబూనారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలనూ సమకూర్చుకుంటామని ప్రకటించారు. అత్యాధునిక మానవ రహిత పరికరాలనూ ప్రవేశపెడతామని వెల్లడించారు. అధికార వర్కర్స్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రభుత్వ లక్ష్యాలను ఆయన ప్రకటించారు.
అమెరికాతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సవాళ్ల నేపథ్యంలో తమ ఆయుధ సంపత్తిని మరింత బలోపేతం చేసుకుంటామని కిమ్ (Kim Jong Un) పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో కొత్త ఆయుధాల ప్రయోగ పరీక్షల పరంపర నూతన ఏడాదిలోనూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉత్తర కొరియాకు (North Korea) వ్యతిరేకంగా అమెరికా, దాని మిత్రదేశాలు ఈ ఏడాది అనూహ్య చర్యలు తీసుకున్నాయని అన్నారు. తద్వారా కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు నెట్టాయని వ్యాఖ్యానించారు.
ఈ పరిస్థితుల్లో యుద్ధ ప్రతిస్పందన సామర్థ్యాలను పొందడం తమకు అత్యావశ్యకమని కిమ్ (Kim Jong Un) అన్నారు. శత్రువులు తమని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే.. వాటిని దీటుగా తిప్పికొట్టేందుకు సమగ్ర, పరిపూర్ణమైన సైనిక సంసిద్ధత తమకు అవసరమని వ్యాఖ్యానించారు.
2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చలు విఫలమైన తర్వాత కిమ్ (Kim Jong Un) తమ ఆయుధ సంపత్తిని మరింత పెంచుకునే పనిలో పడ్డారు. గత ఏడాది వ్యవధిలో ఉత్తర కొరియా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వాటిలో చాలా వరకు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నవే. వీటికి దీటుగా అమెరికా, దక్షిణ కొరియా కలిసి తమ సైనిక కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అందులో భాగంగా బాంబర్లు, విమాన వాహన నౌకలు, అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన జలాంతర్గాములను రంగంలోకి దింపాయి. అయితే, ఈ ఇరు దేశాల చర్యలను.. తమని ఆక్రమించడానికి చేస్తున్న ప్రయోగాలుగా కిమ్ పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ‘అంతర్జాతీయ నేర న్యాయస్థానం’ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఇజ్రాయెల్లో ఆందోళన నెలకొంది. -
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యా (Kenya)లో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!