Imran Khan: ఇమ్రాన్ ఖాన్కు మూడేళ్ల జైలు శిక్ష.. ఆ వెంటనే అరెస్టు
అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ (Imran Khan)కు ఆ దేశ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు ఐదేళ్లు ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని, పాక్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తోషాఖానా అవినీతి కేసు (Toshakhana corruption case)లో ఆయనను దోషిగా తేలుస్తూ ఇస్లామాబాద్లోని జిల్లా, సెషన్స్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక, ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. శిక్షతో పాటు లక్ష పాకిస్థాన్ రూపాయల జరిమానా కూడా విధించింది. ఈ జరిమానా కట్టకపోతే ఇమ్రాన్ మరో ఆరు నెలల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందని హెచ్చరించింది.
తీర్పు వచ్చిన క్షణాల్లోనే అరెస్టు..
మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన కోర్టు అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో క్షణాల వ్యవధిలోనే ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను పోలీసులు అరెస్టు చేశారు. లాహోర్లోని తన నివాసం నుంచి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇమ్రాన్ ఖాన్పై అనర్హత వేటు వేయడంతో ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు వీల్లేకుండా పోయింది. ఈ నెల 9 నెల జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్నట్లు దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఆ తర్వాత 90 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఇమ్రాన్పై అనర్హత వేటు పడటం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, వచ్చే ఎన్నికల్లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పోటీ చేస్తారని పీఎం షెహబాజ్ ఇప్పటికే ప్రకటించారు.
ఏంటీ తోషాఖానా కేసు..
గతేడాది ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పదవీచ్యుతుడైన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఆయన్ను కేసులు చుట్టుముట్టాయి. ఇమ్రాన్ఖాన్ ప్రధాన మంత్రి పదవిలో ఉండగా.. విదేశీ పర్యటనల్లో ఆయనకు వచ్చిన బహుమతులను విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదైంది.
ఇమ్రాన్ తన హయాంలో దాదాపు 58 ఖరీదైన బహుమతులు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. అయితే, వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధరం చెల్లించి తీసుకోవాలి. కానీ, ఇందులో రూ.38 లక్షల రొలెక్స్ గడియారాన్ని కేవలం రూ.7,54,000 చెల్లించి సొంతం చేసుకొన్నారు. రూ.15 లక్షల విలువ చేసే మరో రొలెక్స్ గడియారానికి రూ.2,94,000 మాత్రమే చెల్లించారు. ఇవేగాక.. నగలు, ఇతరత్రా ఖరీదైన వస్తువులను ఆయన చాలా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకున్నారనే ఆరోరపణలు ఉన్నాయి. మొత్తంగా 11.9కోట్ల పాకిస్థాన్ రూపాయల విలువైన వస్తువులను ఆయన కేవలం 2.4కోట్ల పాకిస్థానీ రూపాయలకే తీసుకున్నారని మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపించారు. వాటిల్లో కొన్నింటిని దుబాయ్లో అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలకందని విషాదమే.. రఫాలో ఇజ్రాయెల్ దాడులపై ఐరాస ఆందోళన
Israel: రఫాపై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న వేళ దాని పరిణామాలపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాగైనా దీన్ని ఆపేందుకు కృషి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. -
వారానికి 24 గంటలే పని
కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నెల నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. -
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు
చైనాలో వెలుగుచూసి ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ సీక్వెన్స్ను తొలిసారి ప్రచురించిన శాస్త్రవేత్త ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. -
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ట్రంప్.. 9వేల డాలర్ల జరిమానా
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాగ్ ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడ్డారని న్యూయార్క్ కోర్టు జడ్జి మంగళవారం నిర్ధారించారు. -
భార్య దారుణహత్య.. భారతీయుడికి జీవితఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
భారత్ సూపర్ పవర్ కలలు కంటుంటే.. మనం అడుక్కుంటున్నాం
పాకిస్థాన్లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. -
లండన్లో కత్తితో దాడి
తూర్పు లండన్లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. -
‘ఇజ్రాయెల్’ కేసులో జర్మనీకి ఊరట
గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. -
కొవిషీల్డ్తో కొన్ని దుష్పరిణామాలు నిజమే
కొవిడ్ టీకా కొవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. -
కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు
గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. -
హమాస్ నాశనమే మా లక్ష్యం: ఇజ్రాయెల్
కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల మోత
కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్ కరోలినాలోని షార్లెట్లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. -
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా (China).. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) అంగీకరించింది.