North Korea: సరికొత్త క్షిపణి ఇంజిన్ను పరీక్షించిన ఉత్తర కొరియా..!
ఉత్తర కొరియా మరో సరికొత్త శ్రేణి క్షిపణి ఇంజిన్ను పరీక్షించింది. ఆ దేశంపై ఇప్పటికే ఐరాస అంక్షలు ఉన్నా ఈ పరీక్ష జరగడం గమనార్హం. ఇది తమ వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని పెంచుతుందని ఉత్తరకొరియా చెబుతోంది.
ఇంటర్నెట్డెస్క్: విమర్శలను లెక్కచేయకుండా ఉత్తర కొరియా క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. తాజాగా కిమ్ సర్కారు ఓ మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కోసం ఘన ఇంధనం ఆధారంగా నడిచే ఇంజిన్ను పరీక్షించింది. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ క్షిపణుల వినియోగానికి సంబంధించి ఉత్తరకొరియాపై ఆంక్షలు ఉన్నాయి.
‘‘ఉత్తర కొరియా మరోసారి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల (ఐఆర్బీఎం) కోసం సరికొత్త హై థ్రస్ట్ సాలిడ్ ఫ్యూయల్ ఇంజిన్ను అభివృద్ధి చేసింది. ఇవి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనవి. ఈ పరీక్షతో నమ్మకమైన, ఆధారపడదగిన ఐఆర్బీఎంల తయారీ వేగవంతం అవుతుంది’’ అని కేసీఎన్ఏ పత్రిక పేర్కొంది. ఈ పరీక్ష నవంబర్ 11-14 మధ్యలో జరిగినట్లు వెల్లడించింది.
ఆరేళ్ల తర్వాత అమెరికాలో అడుగుపెట్టిన జిన్పింగ్.. నేడు బైడెన్తో భేటీ
ఈ పరీక్షలపై కేసీఎన్ఏ కథనం ప్రకారం ఉత్తరకొరియా జనరల్ మిసైల్ బ్యూరో స్పందిస్తూ.. ‘‘దేశం అత్యంత దారుణమైన అస్థిర పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో వ్యూహాత్మక దాడులు చేసే సామర్థ్యాన్ని సైన్యానికి అందించడంలో ఈ పరీక్షలు చాలా కీలకం’’ అని పేర్కొంది. క్షిపణుల్లో ఘన ఇంధన ఇంజిన్ల వినియోగంతో వాటి రవాణా తేలికవుతుంది. అంతేకాదు.. వీటిని ప్రయోగించడం కూడా తేలిక. ఈ ఫీచర్ల కారణంగా ఈ క్షిపణులను గుర్తించడం కూడా ప్రత్యర్థులకు కష్టంగా మారుతుంది. ఇటీవల కాలంలో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలను వేగవంతం చేసింది. కొన్నాళ్ల క్రితమే తొలిసారి ఘన ఇంధన సాయంతో ప్రయోగించే ఖండాంతర క్షిపణి, సబ్మెరైన్ నుంచి ప్రయోగించే మిసైల్ను పరీక్షించింది. వాస్తవానికి ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలపై ఐరాస ఆంక్షలు ఉన్నాయి.
మరో వైపు రష్యా సహజవనరుల శాఖ మంత్రి అలెగ్జాండర్ కొజెలోవ్ ప్యాంగ్యాంగ్లో పర్యటిస్తున్న సమయంలోనే ఈ పరీక్ష జరపడం గమనార్హం. ఆయన పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, టెక్నాలజీ వంటి అంశాల్లో సహకారంపై చర్చలు జరుగుతున్నాయి. మరో వైపు రష్యాకు ఈ దేశం నుంచి భారీగా ఆయుధాలు సరఫరా అవుతున్నాయి. ఆగస్టులోనే దాదాపు 10లక్షల ఫిరంగి గుండ్లను ఉత్తర కొరియా పంపించి ఉండవచ్చని దక్షిణ కొరియా నిఘా విభాగం ఇటీవల అంచనా వేసింది. నౌకలు, ఇతర మార్గాల ద్వారా ఈ ఫిరంగి గుండ్లు తరలించినట్లు దక్షిణ కొరియా (South Korea) జాతీయ నిఘా విభాగం భావిస్తున్నట్లు స్థానిక చట్టసభ సభ్యుడు యూ సాంగ్-బుమ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ‘అంతర్జాతీయ నేర న్యాయస్థానం’ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఇజ్రాయెల్లో ఆందోళన నెలకొంది. -
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యా (Kenya)లో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?