North Korea: రాకెట్ దశను గాల్లోనే పేల్చేసిన ఉ.కొరియా.. ఎందుకంటే..?
ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగంలో తొలిదశ పరికరాలు సముద్రంలో పడకముందే పేల్చేశారు. కిమ్ సర్కారు వ్యూహాత్మకంగానే ఈ చర్యకు పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఇటీవల ఉత్తర కొరియా(North Korea)లోని కిమ్ సర్కార్ ఒక నిఘా ఉపగ్రహాన్ని విజయంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనిని ప్రయోగించే సమయంలో ఎలాంటి ఆధారాలు, పరికరాలు.. అమెరికా, దక్షిణ కొరియాలకు చిక్కకుండా ఉత్తరకొరియా చాలా జాగ్రత్తలు తీసుకొంది. ఈ విషయాన్ని స్పేస్ డాట్కామ్ వెలుగులోకి తెచ్చింది. ఈ ఉపగ్రహ ప్రయోగానికి వాడిన రాకెట్ తొలి దశను గాల్లోనే పేల్చినట్లు గుర్తించారు. దక్షిణ కొరియా(South Korea) యోన్సై విశ్వవిద్యాలయం ఉల్కలను గమనించేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలో ఉత్తరకొరియా శాటిలైట్ ప్రయోగం నిక్షిప్తమైంది.
ఉపగ్రహాన్ని తీసుకెళుతున్న చోలీమా-1 రాకెట్ గాల్లోకి ఎగిరిన తర్వాత తొలి దశ విడిపోయి గాల్లోనే పేలిపోయినట్లు గుర్తించారు. దాని శకలాలు చెల్లాచెదురైపోయాయి. దీనిని ఉద్దేశపూర్వకంగానే గాల్లో ధ్వంసం చేసినట్లు విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ యంగ్ ఇక్ పేర్కొన్నట్లు స్పేస్ కామ్ వెల్లడించింది. గత ప్రయోగాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపించలేదని ఆయన చెప్పారు. ఈ రాకెట్ తొలి దశ సముద్రంలో కూలితే అమెరికా, దక్షిణ కొరియా నౌకా దళాలు అక్కడి నుంచి రాకెట్ శకలాలను సేకరించి వాటి ఆధారంగా తమ టెక్నాలజీని గుర్తిస్తారనే భయంతో.. ఉత్తర కొరియా ఈ పనిచేసినట్లు యంగ్ విశ్లేషించారు. ఇక మరో వైపు ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్డోవెల్ కూడా ఉత్తరకొరియా ఉపగ్రహం కక్ష్యకు చేరిందన్నారు. ఒక వస్తువు కొత్తగా కక్ష్యలోకి వచ్చినట్లు అమెరికా స్పేస్ ఫోర్స్ బృందాలు గుర్తించాయని వెల్లడించారు.
కొత్త వైరస్ లేదు.. అవి సీజనల్ నిమోనియా సమస్యలే..: చైనా
గతంలో ఉత్తరకొరియా నిఘా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడానికి విఫల యత్నాలు చేసింది. అనంతరం ఇటీవల ఆ దేశాధ్యక్షుడు కిమ్ రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాము ఉత్తరకొరియా ఉపగ్రహ ప్రయోగానికి సాయం చేస్తామని రష్యా అధినేత పుతిన్ హామీ ఇచ్చారు. అయితే.. అది ఎలాంటి సాయమో వెల్లడించలేదు. ఇది జరిగిన కొన్నాళ్లకే ఉత్తరకొరియా విజయవంతంగా నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చింది.
ఇక ఉ.కొరియా చర్య ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రాజేసింది. దక్షిణ కొరియా కూడా నవంబర్ చివరినాటికి తమ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపుతామని ప్రకటించింది. కాకపోతే అమెరికా కంపెనీ స్పేస్ ఎక్స్ సాయం తీసుకొంటుందని అంతా భావిస్తున్నారు.
ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఉద్రిక్తతలను రాజేసింది. దీనికి ప్రతిగా 2018లో తాము ఉత్తరకొరియాతో చేసుకొన్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామని దక్షిణ కొరియా ప్రకటించింది. ఈ అంశాన్ని దక్షిణ కొరియా ప్రధాని హాన్ డక్ సూ వెల్లడించారు. మరోవైపు ఉత్తర కొరియా కూడా ఇలాంటి ప్రకటనే చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యా (Kenya)లో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య