Israel-Hamas: యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉంది: అమెరికా
Israel-Hamas: హెజ్బొల్లా సైతం ఇజ్రాయెల్పై దాడులకు దిగిన నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం పశ్చిమాసియా పర్యటనకు బయలుదేరారు.
జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధం (Israel-Hamas conflict) మరింత విస్తరించే ప్రమాదం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken) హెచ్చరించారు. ఇది పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పు కలగజేస్తుందని చెప్పారు. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొందని వివరించారు. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్లా (Hezbollah) సైతం ఇజ్రాయెల్పై దాడులకు దిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం ఆయన ఆకస్మికంగా ఈ ప్రాంత పర్యటన చేపట్టారు.
పర్యటనలో జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో పాటు ఖతర్ ప్రధానమంత్రి షేక్ అబ్దుల్ రహమాన్ అల్ థానితో బ్లింకెన్ చర్చలు జరిపారు. హమాస్ ఉప నేత సలేహ్ అరౌరీని లెబనాన్ రాజధాని బీరుట్లోనే ఇజ్రాయెల్ హతమార్చిన నేపథ్యంలో.. బందీల విడుదల ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశం ఉందని బ్లింకెన్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న ఖతర్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. అయినప్పటికీ తాము ఇరు పక్షాలతో చర్చలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
ఇజ్రాయెల్ దాడి వల్లే అరౌరీ మృతిచెందాడని.. దీనికి ప్రతీకారంగానే శనివారం ఎదురుదాడి చేశామని హెజ్బొల్లా ప్రకటించింది. అయితే, హమాస్కు అనుబంధంగా పనిచేస్తున్న హెజ్బొల్లాపై ఒత్తిడి పెరిగిందని ఇజ్రాయెల్ త్రిదళాధిపతి లెఫ్టినెంట్ కర్నల్ హెర్జ్వీ హలేవీ తెలిపారు. దీంతో అది యుద్ధంలో నేరుగా పాల్గొనాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు. ఫలితంగా మరో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
మరోవైపు హెజ్బొల్లా (Hezbollah) దాడులతో ‘మౌంట్ మెరోన్’పై ఉన్న తమ కీలక గగనతల నిఘా స్థావరం దెబ్బతిందని ఇజ్రాయెల్ (Israel) ప్రకటించింది. అయితే, తమ గగనతల రక్షణ వ్యవస్థలకు మాత్రం ఎలాంటి ముప్పు వాటిల్లలేదని తెలిపింది. మౌంట్ మెరోన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బేస్ ఇజ్రాయెల్కు ఆక్రమిత పాలస్తీనాలో ఉన్న అతి కీలక స్థావరం. అక్కడి నుంచే సిరియా, లెబనాన్, తుర్కియే, సైప్రస్తోపాటు మధ్యదరా సముద్ర ఉత్తర, తూర్పు బేసిన్లవైపు ఆపరేషన్స్ను ఇజ్రాయెల్ నిర్వహిస్తుంటుంది. ఇది ఇజ్రాయెల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్కూ కీలక స్థావరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
కెన్యా (Kenya)లో డ్యామ్ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. -
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
Justin Trudeau: కెనడా ప్రధాని ట్రూడో సభలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు వినిపించడం చర్చనీయాంశంగా మారింది. -
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
రష్యా ఉద్యమకారుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని హత్య చేయమని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసి ఉండకపోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల వాల్స్ట్రీట్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా జో బైడెన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. -
రంగంలోకి బైడెన్.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్ అనుమతి
Israel-Hamas Conflict: గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం అందించేలా సరిహద్దుల్లో మరిన్ని దారులు తెరుస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
చిత్ర వార్త
గాజాలోని ఖాన్యూనియన్లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో చదువుకుంటున్న పాలస్తీనా చిన్నారులు -
ఆరేళ్ల పిల్లాడితో పోటీ పడుతున్నా: జో బైడెన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వయసు పెద్ద చర్చనే రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కు 81 ఏళ్లు. దీంతో ఆయన రేసులో నిలబడటంపై విమర్శలు చెలరేగుతున్నాయి. -
గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు
వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. -
టిబెట్పై చైనా అణచివేతను ప్రపంచానికి చాటుతా: నామ్కీ
టిబెట్ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోందని, టిబెట్ వాసులు నానాటికీ పెరుగుతున్న భయం, అణచివేతల నడుమ బతుకుతున్నట్లు నామ్కీ (24) తెలిపారు. -
దుబాయ్లో అతిపెద్ద విమానాశ్రయం!
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ దారుణహత్య
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్లోని ఆమె ఇంటి వద్దే గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపారు. -
దక్షిణ చైనాలో టోర్నడో విధ్వంసం
దక్షిణ చైనాలోని గ్వాంగ్ఝౌ నగరంలో శనివారం ఓ భారీ టోర్నడో విధ్వంసం సృష్టించింది. దీని తాకిడికి అయిదుగురు మరణించగా, 33 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
అమెరికాలో ‘గాజా’ సెగలు.. ఆగని విద్యార్థుల ఆందోళనలు
గాజాపై దాడులకు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో గత పది రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. -
హూతీల దాడికి గురైన నౌకకు భారత్ అండ
ఎర్రసముద్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్లీ భారత నౌకాదళం తన సత్తా చూపింది. హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్ నౌకకు అండగా నిలిచింది. -
తీవ్రంగా వేడెక్కనున్న హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రం తీవ్రస్థాయిలో వేడెక్కే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. 2020 నుంచి 2100 మధ్య ఈ మహాసాగర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరగొచ్చని స్పష్టంచేస్తోంది. -
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ దార్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇశాక్ దార్ అనూహ్య రీతిలో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. ఆదివారం ఈ నిర్ణయం వెలువడింది. -
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో 35 బిలియన్ డాలర్ల (రూ.2.9లక్షల కోట్లు)తో కొత్త టెర్మినల్ నిర్మించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసు.. పలువురు కాంగ్రెస్ నాయకులకు నోటీసులు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్