West Bengal: పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. 9 మంది మృతి
భారీ ఎత్తున కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులను మోహరించినప్పటికీ బంగాల్ (Bengal) పంచాయితీ ఎన్నికల్లో హింస చెలరేగింది. వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్ల కార్యకర్తలు పరస్పర దాడుల్లో 9 మంది మృతి చెందారు. ఐదుగురు తృణమూల్, భాజపా, కాంగ్రెస్, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. హింసకు మీరంటే మీరు కారణమంటూ పార్టీలన్నీ ఆరోపణలకు దిగాయి. పోలింగ్ బూత్లు లూటీ, బ్యాలెట్ల పత్రాల దగ్ధంతో బంగాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.
Published : 08 Jul 2023 15:20 IST
Tags :